గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి వారి సేవలో తరించాల్సిన ఓ మహిళా అధికారి.. తన సంక్షేమం చూసు కున్నారు. అందిన కాడికి వసూలు చేసుకున్నారు. సహజంగా మహిళా అధికారులు అంటే.. లంచాలకు, ప్రలోభాలకు దూరంగా ఉంటారనే రికార్డులు ఉన్నాయి. కానీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి మాత్రం నిఖార్సయిన లంచావతారానికి ప్రతిరూపంగా నిలిచింది. సోమవారం ఆమె కార్యాలయంపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. 84 వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కానీ, జ్యోతి మాత్రం.. కన్నీరు పెట్టుకుని.. తాను అడగకపోయినా.. లంచం ఇచ్చారని.. ఆ సొమ్ముకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను చాలా నిజాయితీ పరురాలినని, కొందరు ఉద్దేశ పూర్వకంగా తనపై ఫిర్యాదు చేసి.. తన ఉన్నతిని అడ్డుకుంటున్నారని.. బోరున విలపించారు. దీంతో పాపం.. కదా.. అనే సానుభూతి వచ్చింది. అయితే.. అసలు విషయం తర్వాత తెలిసింది. ఏసీబీ అధికారులు ఆమె కన్నీటికి కరిగిపోకుండా.. ఇంటిని చుట్టుముట్టారు.
ఆమె ఇంట్లోసోదాలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఆ అధికారిణి నివాసంలో ఎక్కడబడితే అక్కడ కట్టల కొద్దీ 500 నోట్లు కనిపించాయి. మంచం కింద.. బాత్ రూమ్ అల్మరా, కిచెన్ సహా దేన్నీ ఆమె వదలకుండా.. అన్నింటినీ బ్యాంకుగా మార్చేసి.. కట్టలు కూరేసింది. అంతేకాదు.. కిలోల కొద్దీ బంగారం బిస్కెట్లు, నగలు.. కూడా ఉన్నాయి. దాదాపు రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆమెకు రిమాండ్ ఖైదు విధించింది.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…