గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి వారి సేవలో తరించాల్సిన ఓ మహిళా అధికారి.. తన సంక్షేమం చూసు కున్నారు. అందిన కాడికి వసూలు చేసుకున్నారు. సహజంగా మహిళా అధికారులు అంటే.. లంచాలకు, ప్రలోభాలకు దూరంగా ఉంటారనే రికార్డులు ఉన్నాయి. కానీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి మాత్రం నిఖార్సయిన లంచావతారానికి ప్రతిరూపంగా నిలిచింది. సోమవారం ఆమె కార్యాలయంపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. 84 వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కానీ, జ్యోతి మాత్రం.. కన్నీరు పెట్టుకుని.. తాను అడగకపోయినా.. లంచం ఇచ్చారని.. ఆ సొమ్ముకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను చాలా నిజాయితీ పరురాలినని, కొందరు ఉద్దేశ పూర్వకంగా తనపై ఫిర్యాదు చేసి.. తన ఉన్నతిని అడ్డుకుంటున్నారని.. బోరున విలపించారు. దీంతో పాపం.. కదా.. అనే సానుభూతి వచ్చింది. అయితే.. అసలు విషయం తర్వాత తెలిసింది. ఏసీబీ అధికారులు ఆమె కన్నీటికి కరిగిపోకుండా.. ఇంటిని చుట్టుముట్టారు.
ఆమె ఇంట్లోసోదాలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఆ అధికారిణి నివాసంలో ఎక్కడబడితే అక్కడ కట్టల కొద్దీ 500 నోట్లు కనిపించాయి. మంచం కింద.. బాత్ రూమ్ అల్మరా, కిచెన్ సహా దేన్నీ ఆమె వదలకుండా.. అన్నింటినీ బ్యాంకుగా మార్చేసి.. కట్టలు కూరేసింది. అంతేకాదు.. కిలోల కొద్దీ బంగారం బిస్కెట్లు, నగలు.. కూడా ఉన్నాయి. దాదాపు రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆమెకు రిమాండ్ ఖైదు విధించింది.
This post was last modified on February 20, 2024 2:33 pm
గత కొంత కాలంగా సౌత్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వడం లేదని సంగీత ప్రియులు…
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…
నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయ్.. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ ఒక భార్య ప్రియుడికి వాట్సాప్ మెసేజ్…
సక్సెస్ పరంగా అటు బాలీవుడ్లో జాన్వీ కపూర్, ఇటు టాలీవుడ్ లో శ్రీలీల ఇంచుమించు ఒకే ఫేజ్ లో ఉన్నారు.…
కొత్త సినిమాలు చాలా వచ్చాయి కదా, గత వారం రిలీజైన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జోరు బాగా…
అసలు ప్రమోషన్లు లేకుండా ఏదైనా సినిమాకు బజ్ లేదా ఓపెనింగ్స్ రావడం మహా కష్టమైపోయిన ట్రెండ్ లో ఉన్నాం మనం.…