గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి వారి సేవలో తరించాల్సిన ఓ మహిళా అధికారి.. తన సంక్షేమం చూసు కున్నారు. అందిన కాడికి వసూలు చేసుకున్నారు. సహజంగా మహిళా అధికారులు అంటే.. లంచాలకు, ప్రలోభాలకు దూరంగా ఉంటారనే రికార్డులు ఉన్నాయి. కానీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి మాత్రం నిఖార్సయిన లంచావతారానికి ప్రతిరూపంగా నిలిచింది. సోమవారం ఆమె కార్యాలయంపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. 84 వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కానీ, జ్యోతి మాత్రం.. కన్నీరు పెట్టుకుని.. తాను అడగకపోయినా.. లంచం ఇచ్చారని.. ఆ సొమ్ముకు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను చాలా నిజాయితీ పరురాలినని, కొందరు ఉద్దేశ పూర్వకంగా తనపై ఫిర్యాదు చేసి.. తన ఉన్నతిని అడ్డుకుంటున్నారని.. బోరున విలపించారు. దీంతో పాపం.. కదా.. అనే సానుభూతి వచ్చింది. అయితే.. అసలు విషయం తర్వాత తెలిసింది. ఏసీబీ అధికారులు ఆమె కన్నీటికి కరిగిపోకుండా.. ఇంటిని చుట్టుముట్టారు.
ఆమె ఇంట్లోసోదాలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఆ అధికారిణి నివాసంలో ఎక్కడబడితే అక్కడ కట్టల కొద్దీ 500 నోట్లు కనిపించాయి. మంచం కింద.. బాత్ రూమ్ అల్మరా, కిచెన్ సహా దేన్నీ ఆమె వదలకుండా.. అన్నింటినీ బ్యాంకుగా మార్చేసి.. కట్టలు కూరేసింది. అంతేకాదు.. కిలోల కొద్దీ బంగారం బిస్కెట్లు, నగలు.. కూడా ఉన్నాయి. దాదాపు రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆమెకు రిమాండ్ ఖైదు విధించింది.
This post was last modified on February 20, 2024 2:33 pm
దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో వివిద నియోజకవర్గాలలో నిలబడ్డ ప్రముఖులలో ఎవరు గెలుస్తారు ? అని…
https://www.youtube.com/watch?v=CKpbdCciELk జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర పాటల సందడి మొదలైపోయింది. నాలుగేళ్లకు పైగా సుదీర్ఘమైన…
ఒక హీరో వద్దన్న స్టోరీలు ఇంకొకరు తీసుకోవడం సినీ పరిశ్రమలో లెక్కలేనన్నిసార్లు జరిగి ఉంటుంది. త్రివిక్రమ్ చెప్పినప్పుడు నిద్రరాకపోయి ఉంటే…
యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు…
ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్కి ముందు.. కొంత ఉపశమనం…
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి…