Trends

నోట్ల క‌ట్ట‌లు.. కిలోల కొద్దీ బంగారం: లేడీ ఆఫ్ కరప్షన్

గిరిజ‌నుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి వారి సేవ‌లో త‌రించాల్సిన ఓ మ‌హిళా అధికారి.. త‌న సంక్షేమం చూసు కున్నారు. అందిన కాడికి వ‌సూలు చేసుకున్నారు. స‌హ‌జంగా మ‌హిళా అధికారులు అంటే.. లంచాల‌కు, ప్ర‌లోభాల‌కు దూరంగా ఉంటార‌నే రికార్డులు ఉన్నాయి. కానీ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి మాత్రం నిఖార్స‌యిన లంచావ‌తారానికి ప్ర‌తిరూపంగా నిలిచింది. సోమ‌వారం ఆమె కార్యాల‌యంపై దాడి చేసిన ఏసీబీ అధికారులు.. 84 వేల రూపాయ‌ల‌ను లంచంగా తీసుకుంటుండ‌గా రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.

కానీ, జ్యోతి మాత్రం.. క‌న్నీరు పెట్టుకుని.. తాను అడ‌గ‌క‌పోయినా.. లంచం ఇచ్చార‌ని.. ఆ సొమ్ముకు త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. తాను చాలా నిజాయితీ ప‌రురాలిన‌ని, కొంద‌రు ఉద్దేశ పూర్వ‌కంగా త‌న‌పై ఫిర్యాదు చేసి.. త‌న ఉన్న‌తిని అడ్డుకుంటున్నార‌ని.. బోరున విల‌పించారు. దీంతో పాపం.. క‌దా.. అనే సానుభూతి వ‌చ్చింది. అయితే.. అస‌లు విష‌యం త‌ర్వాత తెలిసింది. ఏసీబీ అధికారులు ఆమె క‌న్నీటికి క‌రిగిపోకుండా.. ఇంటిని చుట్టుముట్టారు.

ఆమె ఇంట్లోసోదాలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఆ అధికారిణి నివాసంలో ఎక్కడబడితే అక్కడ క‌ట్ట‌ల కొద్దీ 500 నోట్లు క‌నిపించాయి. మంచం కింద‌.. బాత్ రూమ్ అల్మ‌రా, కిచెన్ స‌హా దేన్నీ ఆమె వ‌ద‌ల‌కుండా.. అన్నింటినీ బ్యాంకుగా మార్చేసి.. క‌ట్టలు కూరేసింది. అంతేకాదు.. కిలోల కొద్దీ బంగారం బిస్కెట్లు, న‌గ‌లు.. కూడా ఉన్నాయి. దాదాపు రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆమెకు రిమాండ్ ఖైదు విధించింది.

This post was last modified on February 20, 2024 2:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

59 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago