కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న మైదానాలు మళ్లీ ఆటలతో సందడి చేస్తున్నాయి. దాదాపుగా అన్ని ఆటలూ పున:ప్రారంభం అయ్యాయి. టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ టోర్నీ కూడా నిర్వహిస్తున్నారు. మధ్యలో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలను నిర్వహించే అవకాశం లేకపోగా.. ఏడాదిలో చివరి గ్రాండ్ స్లామ్ అయిన యుఎస్ ఓపెన్ను వారం కిందటే మొదలుపెట్టారు. రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, హలెప్ సహా చాలామంది స్టార్ క్రీడాకారులు ఈ టోర్నీకి దూరమైనా సరే.. యుఎస్ ఓపెన్ను అనుకున్న ప్రకారమే నిర్వహిస్తున్నారు.
ఐతే పురుషుల సింగిల్స్లో చాలామంది స్టార్లు దూరం కాగా.. మిగిలిన ఏకైక ఆకర్షణ నొవాక్ జకోవిచే. ఈ ప్రపంచ నంబర్ టూ ఆటగాడు టోర్నీలో ఆడి తీరాలని పట్టుదలతో వచ్చాడు. జకోకు సవాలు విసిరే వాళ్లలో చాలామంది టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఇక అతడికి ఎదురే ఉండదని.. మరో గ్రాండ్స్లామ్ అతడి ఖాతాలో చేరినట్లే అని అంతా అనుకున్నారు. అంచనాలకు తగ్గట్లే తొలి మూడు రౌండ్లలో ఘనవిజయాలు సాధించి ప్రి క్వార్టర్స్లోకి దూసుకొచ్చాడు జకోవిచ్. కానీ భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో అనూహ్య పరిణామం జరిగి జకోవిచ్ టోర్నీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి తలెత్తింది.
బుస్టా అనే ఆటగాడితో జరిగిన ఈ మ్యాచ్లో తొలి సెట్లో జకోవిచ్ 5-6తో వెనుకబడి ఉన్న దశలో ఒక పాయింట్ కోల్పోయిన అసహనంలో జకోవిచ్.. బంతిని రాకెట్తో లైన్ జడ్జ్ ఉన్న వైపు కొట్టాడు. అది లైన్ జడ్జ్గా ఉన్న మహిళ ముఖానికి గట్టిగా తాకింది. ఆమె వెంటనే కుప్పకూలింది. జకోవిచ్ ఉద్దేశపూర్వకంగా చేశాడో, అనుకోకుండా జరిగిందో కానీ.. టోర్నీ నిర్వాహకులు దీన్ని తీవ్ర విషయంగా పరిగణించి అతడిపై అనర్హత వేటు వేసి ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. టైటిల్ ఖాయం అనుకున్న ఆటగాడు ఇలా అనూహ్యంగా నిష్క్రమించడం టెన్నిస్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…