కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న మైదానాలు మళ్లీ ఆటలతో సందడి చేస్తున్నాయి. దాదాపుగా అన్ని ఆటలూ పున:ప్రారంభం అయ్యాయి. టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ టోర్నీ కూడా నిర్వహిస్తున్నారు. మధ్యలో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలను నిర్వహించే అవకాశం లేకపోగా.. ఏడాదిలో చివరి గ్రాండ్ స్లామ్ అయిన యుఎస్ ఓపెన్ను వారం కిందటే మొదలుపెట్టారు. రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, హలెప్ సహా చాలామంది స్టార్ క్రీడాకారులు ఈ టోర్నీకి దూరమైనా సరే.. యుఎస్ ఓపెన్ను అనుకున్న ప్రకారమే నిర్వహిస్తున్నారు.
ఐతే పురుషుల సింగిల్స్లో చాలామంది స్టార్లు దూరం కాగా.. మిగిలిన ఏకైక ఆకర్షణ నొవాక్ జకోవిచే. ఈ ప్రపంచ నంబర్ టూ ఆటగాడు టోర్నీలో ఆడి తీరాలని పట్టుదలతో వచ్చాడు. జకోకు సవాలు విసిరే వాళ్లలో చాలామంది టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఇక అతడికి ఎదురే ఉండదని.. మరో గ్రాండ్స్లామ్ అతడి ఖాతాలో చేరినట్లే అని అంతా అనుకున్నారు. అంచనాలకు తగ్గట్లే తొలి మూడు రౌండ్లలో ఘనవిజయాలు సాధించి ప్రి క్వార్టర్స్లోకి దూసుకొచ్చాడు జకోవిచ్. కానీ భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో అనూహ్య పరిణామం జరిగి జకోవిచ్ టోర్నీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి తలెత్తింది.
బుస్టా అనే ఆటగాడితో జరిగిన ఈ మ్యాచ్లో తొలి సెట్లో జకోవిచ్ 5-6తో వెనుకబడి ఉన్న దశలో ఒక పాయింట్ కోల్పోయిన అసహనంలో జకోవిచ్.. బంతిని రాకెట్తో లైన్ జడ్జ్ ఉన్న వైపు కొట్టాడు. అది లైన్ జడ్జ్గా ఉన్న మహిళ ముఖానికి గట్టిగా తాకింది. ఆమె వెంటనే కుప్పకూలింది. జకోవిచ్ ఉద్దేశపూర్వకంగా చేశాడో, అనుకోకుండా జరిగిందో కానీ.. టోర్నీ నిర్వాహకులు దీన్ని తీవ్ర విషయంగా పరిగణించి అతడిపై అనర్హత వేటు వేసి ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. టైటిల్ ఖాయం అనుకున్న ఆటగాడు ఇలా అనూహ్యంగా నిష్క్రమించడం టెన్నిస్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
This post was last modified on September 7, 2020 10:32 pm
థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…
బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…