కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న మైదానాలు మళ్లీ ఆటలతో సందడి చేస్తున్నాయి. దాదాపుగా అన్ని ఆటలూ పున:ప్రారంభం అయ్యాయి. టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ టోర్నీ కూడా నిర్వహిస్తున్నారు. మధ్యలో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీలను నిర్వహించే అవకాశం లేకపోగా.. ఏడాదిలో చివరి గ్రాండ్ స్లామ్ అయిన యుఎస్ ఓపెన్ను వారం కిందటే మొదలుపెట్టారు. రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, హలెప్ సహా చాలామంది స్టార్ క్రీడాకారులు ఈ టోర్నీకి దూరమైనా సరే.. యుఎస్ ఓపెన్ను అనుకున్న ప్రకారమే నిర్వహిస్తున్నారు.
ఐతే పురుషుల సింగిల్స్లో చాలామంది స్టార్లు దూరం కాగా.. మిగిలిన ఏకైక ఆకర్షణ నొవాక్ జకోవిచే. ఈ ప్రపంచ నంబర్ టూ ఆటగాడు టోర్నీలో ఆడి తీరాలని పట్టుదలతో వచ్చాడు. జకోకు సవాలు విసిరే వాళ్లలో చాలామంది టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఇక అతడికి ఎదురే ఉండదని.. మరో గ్రాండ్స్లామ్ అతడి ఖాతాలో చేరినట్లే అని అంతా అనుకున్నారు. అంచనాలకు తగ్గట్లే తొలి మూడు రౌండ్లలో ఘనవిజయాలు సాధించి ప్రి క్వార్టర్స్లోకి దూసుకొచ్చాడు జకోవిచ్. కానీ భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో అనూహ్య పరిణామం జరిగి జకోవిచ్ టోర్నీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి తలెత్తింది.
బుస్టా అనే ఆటగాడితో జరిగిన ఈ మ్యాచ్లో తొలి సెట్లో జకోవిచ్ 5-6తో వెనుకబడి ఉన్న దశలో ఒక పాయింట్ కోల్పోయిన అసహనంలో జకోవిచ్.. బంతిని రాకెట్తో లైన్ జడ్జ్ ఉన్న వైపు కొట్టాడు. అది లైన్ జడ్జ్గా ఉన్న మహిళ ముఖానికి గట్టిగా తాకింది. ఆమె వెంటనే కుప్పకూలింది. జకోవిచ్ ఉద్దేశపూర్వకంగా చేశాడో, అనుకోకుండా జరిగిందో కానీ.. టోర్నీ నిర్వాహకులు దీన్ని తీవ్ర విషయంగా పరిగణించి అతడిపై అనర్హత వేటు వేసి ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. టైటిల్ ఖాయం అనుకున్న ఆటగాడు ఇలా అనూహ్యంగా నిష్క్రమించడం టెన్నిస్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
This post was last modified on September 7, 2020 10:32 pm
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…
ఏఐ.. ఏఐ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. దాని సాయంతో అద్భుతాలు చేస్తోంది యువతరం. ఐతే దీన్ని వినోదం…
బీజేపీకి ఉత్తరాదిలో ఉన్న బలం.. దక్షిణాదికి వచ్చే సరికి లేకుండా పోయింది. నిజానికి బండి సంజయ్, కిషన్రెడ్డి, పురందేశ్వరి వంటివారు…