సోషల్ మీడియాలో పాపులర్ అయిన.. కుమారీ ఆంటీ హోటల్ మూత పడింది. ఎక్కడెక్కడి నుంచో ఆమె హోటల్కు కస్టమర్లు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా యూట్యూబర్లు.. చేసిన వీడియోలు, రీల్స్తో కుమారి హోటల్ ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిపోయింది. కేవలం నాన్ వెజ్ రెసిపీలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే కుమారి.. అన్ని రకాల కూరలను వేడివేడిగా వడ్డించడం.. కలగలుపుగా అందరితోనూ నాన్నా.. అమ్మా.. తమ్ముడు అంటూ.. పలకరించడతో ఆమె బాగా ఫేమస్ అయ్యారు.
దీంతో పెద్ద ఎత్తున నాన్ వెజ్ ప్రియులు ఆమె హోటల్కు క్యూ కట్టేవారు. ఇక, కస్టమర్లను ఆకట్టుకున్న కుమారి.. అదేసమయంలో ధరలను అమాంతం పెంచేశారనే టాక్ వచ్చింది. మొదట్లో 100కే నాలుగు రకాల కూరలతో అన్నం పెట్టిన కుమారి.. తర్వాత.. అదే నాలుగు రకాలకు 200 నుంచి 350 వరకు కూడా రేటు పెంచేసింది. అయినా.. యూట్యూబ్ మహిమతో కస్టమర్లకు కొదవ లేకుండా పోయింది. అయితే.. ఇదే ఇప్పుడు ఆమెకు సంకటంగా మారింది.
మధ్యాహ్నం 11గంటలకే కుమారీ ఆంటీ హోటల్కు ఫుడ్ ప్రియులు తరలి రావడం ప్రారంభించారు. మధ్యాహ్నం 1గంట పీక్ సమయంలో అయితే.. తోపులాటలు కూడా జరుగుతున్నాయి. తాజాగా రెండు రోజుల నుంచి హోటల్ ఉన్న చోట జనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీనిని గమనించిన పోలీసులు ఆమెను ఇప్పటికే రెండు సార్లు హెచ్చరించారు. అయినాఫలితం లేకపోవడంతో తాజాగా బండిని సీజ్ చేశారు. ఫైన్ కూడా రాశారు. కేసు కూడా నమోదు చేశారు. దీంతో కుమారీ ఆంటీ హోటల్ మూతబడింది.
యూట్యూబ్పై ఆరోపణలు..
తన హోటల్ మూతబడడానికి సోషల్ మీడియానే కారణమంటూ.. కుమారీ ఆంటీ రుసరుసలాడింది. విపరీత ప్రచారంతోనే తన హోటల్కు జనాలు పోటెత్తారని.. దీంతో మొత్తానికే ఎసరొచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ క్రమంలో యూట్యూబర్లపై తిట్ల దండకం అందుకున్నారు.
వైసీపీ వర్సెస్ జనసేన..
ఇక, కుమారీ ఆంటీ హోటల్ మూతబడి.. ఆమె ఆవేదనలో ఉంటే.. ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు జగనన్న ఇచ్చిన ఇల్లు తప్ప మరే ఆధారం లేదని.. ఓ యూట్యూబర్కు కుమారి ఆంటీ చెప్పింది. దీనిని ప్రస్తావిస్తూ.. వైసీపీ నాయకులు కామెంట్లు చేస్తున్నారు. జగనన్నపై అభిమానం ఉన్నందునే ఆమెపై కక్ష కట్టిన టీడీపీ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి.. హోటల్ను సీజ్ చేయించిందని ఆరోపించారు. దీనికి ప్రతిగా.. జనసేన ఎదురు దాడి చేసింది. కష్టంలో ఉన్న మహిళను ఆదుకుని సానుభూతి చూపించాల్సిన పరిస్థితిని వదిలేసి ఇలా కామెంట్లు చేయడానికి సిగ్గులేదా? అని జనసేన నాయకులు ప్రశ్నించారు.
This post was last modified on January 31, 2024 8:26 am
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…