కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యంగా అనిపించినా.. నిజమే. వాటి వెనుక చాలానే రీజన్లు ఉంటాయి. ప్రపంచంలో జనాభా పెరుగుదల విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాకు చెందిన జనగణన శాఖ అధికారులు ఒక సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా సెకనుకు 4 చొప్పున పిల్లలు పుడతారని తేల్చి చెప్పారు. అంటే.. ఒక నిమిషానికి.. 24 మంది పుట్టనున్నారు. వారు ఆడైనా..మగైనా.. ఎవరైనా కావొచ్చు.. నిముషానికి 24 మంది పుట్టడం ఖాయమని చెబుతున్నారు.
విషయంలోకివెళ్తే.. ప్రస్తుతం ప్రపంచ జనాభాపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని దేశాల్లో జనాభా తక్కువగా ఉండగా.. మరికొన్ని దేశాల్లో జనాభా ఎక్కువగా ఉంది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా కూడా జనాభా పెరుగుతోంది. ఇలా పెరుగుతూ.. పోతే తిండి గింజలు, నీరు, మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు తప్పవనేది అమెరికా జనగణన శాఖ ఆందోళన. ఈ విభాగం వెల్లడించిన లెక్కల ప్రకారం.. కొన్ని ఆశ్చర్యకర సంగతులు వెలుగు చూశాయి.
+ 2024 జనవరి నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కుని దాటేస్తుంది.
+ 2023లో ప్రపంచ జనాభా 7.5 కోట్ల మేర జనాభా ఉంది.
+ 2024 జనవరి 1 నాటికి ఇది 800 కోట్ల మార్కుని అధిగమిస్తుంది.
+ 2024లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున 4.3 జననాలు, రెండు మరణాలు సంభవిస్తాయి. అంటే.. నిమిషానికి 24 మంది పుడితే.. అదేసమయంలో 12 మంది మృతి చెందుతారు.
+ ఈ ఏడాది అమెరికాలో 17.5 లక్షల జననాలు నమోదయ్యాయి.
+ 2024 జనవరి 1 నాటికి అమెరికా జనాభా 33.58 కోట్లకు చేరుకుంటుంది
+ అమెరికాలో జనాభా తగ్గకుండా ఉండడానికి ప్రధాన కారణం వలసలు.(ఇదే పెద్ద రాజకీయ వివాదంగా కూడా ఉంది)
This post was last modified on December 30, 2023 1:44 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…