కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యంగా అనిపించినా.. నిజమే. వాటి వెనుక చాలానే రీజన్లు ఉంటాయి. ప్రపంచంలో జనాభా పెరుగుదల విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాకు చెందిన జనగణన శాఖ అధికారులు ఒక సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా సెకనుకు 4 చొప్పున పిల్లలు పుడతారని తేల్చి చెప్పారు. అంటే.. ఒక నిమిషానికి.. 24 మంది పుట్టనున్నారు. వారు ఆడైనా..మగైనా.. ఎవరైనా కావొచ్చు.. నిముషానికి 24 మంది పుట్టడం ఖాయమని చెబుతున్నారు.
విషయంలోకివెళ్తే.. ప్రస్తుతం ప్రపంచ జనాభాపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని దేశాల్లో జనాభా తక్కువగా ఉండగా.. మరికొన్ని దేశాల్లో జనాభా ఎక్కువగా ఉంది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా కూడా జనాభా పెరుగుతోంది. ఇలా పెరుగుతూ.. పోతే తిండి గింజలు, నీరు, మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు తప్పవనేది అమెరికా జనగణన శాఖ ఆందోళన. ఈ విభాగం వెల్లడించిన లెక్కల ప్రకారం.. కొన్ని ఆశ్చర్యకర సంగతులు వెలుగు చూశాయి.
+ 2024 జనవరి నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కుని దాటేస్తుంది.
+ 2023లో ప్రపంచ జనాభా 7.5 కోట్ల మేర జనాభా ఉంది.
+ 2024 జనవరి 1 నాటికి ఇది 800 కోట్ల మార్కుని అధిగమిస్తుంది.
+ 2024లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున 4.3 జననాలు, రెండు మరణాలు సంభవిస్తాయి. అంటే.. నిమిషానికి 24 మంది పుడితే.. అదేసమయంలో 12 మంది మృతి చెందుతారు.
+ ఈ ఏడాది అమెరికాలో 17.5 లక్షల జననాలు నమోదయ్యాయి.
+ 2024 జనవరి 1 నాటికి అమెరికా జనాభా 33.58 కోట్లకు చేరుకుంటుంది
+ అమెరికాలో జనాభా తగ్గకుండా ఉండడానికి ప్రధాన కారణం వలసలు.(ఇదే పెద్ద రాజకీయ వివాదంగా కూడా ఉంది)
This post was last modified on December 30, 2023 1:44 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…