Trends

సెక‌నుకు న‌లుగురు.. నిమిషానికి 24 మంది పుడ‌తార‌ట‌!

కొన్ని కొన్ని విష‌యాలు ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజ‌మే. వాటి వెనుక చాలానే రీజ‌న్లు ఉంటాయి. ప్ర‌పంచంలో జ‌నాభా పెరుగుద‌ల విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. అమెరికాకు చెందిన జ‌న‌గ‌ణ‌న శాఖ అధికారులు ఒక సంచ‌ల‌న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. వ‌చ్చే ఏడాదిలో ప్ర‌పంచ వ్యాప్తంగా సెక‌నుకు 4 చొప్పున పిల్ల‌లు పుడ‌తార‌ని తేల్చి చెప్పారు. అంటే.. ఒక నిమిషానికి.. 24 మంది పుట్ట‌నున్నారు. వారు ఆడైనా..మ‌గైనా.. ఎవ‌రైనా కావొచ్చు.. నిముషానికి 24 మంది పుట్ట‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

విష‌యంలోకివెళ్తే.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ జ‌నాభాపై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కొన్ని దేశాల్లో జ‌నాభా త‌క్కువ‌గా ఉండ‌గా.. మ‌రికొన్ని దేశాల్లో జ‌నాభా ఎక్కువ‌గా ఉంది. ఇక‌, ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా జ‌నాభా పెరుగుతోంది. ఇలా పెరుగుతూ.. పోతే తిండి గింజ‌లు, నీరు, మౌలిక స‌దుపాయాల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నేది అమెరికా జ‌న‌గ‌ణ‌న శాఖ ఆందోళ‌న‌. ఈ విభాగం వెల్ల‌డించిన లెక్క‌ల ప్రకారం.. కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర సంగ‌తులు వెలుగు చూశాయి.

+ 2024 జ‌న‌వ‌రి నాటికి ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కుని దాటేస్తుంది.

+ 2023లో ప్రపంచ జనాభా 7.5 కోట్ల మేర జ‌నాభా ఉంది.

+ 2024 జనవరి 1 నాటికి ఇది 800 కోట్ల మార్కుని అధిగమిస్తుంది.

+ 2024లో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున 4.3 జననాలు, రెండు మరణాలు సంభవిస్తాయి. అంటే.. నిమిషానికి 24 మంది పుడితే.. అదేస‌మ‌యంలో  12 మంది మృతి చెందుతారు.

+ ఈ ఏడాది అమెరికాలో 17.5 లక్షల జననాలు నమోదయ్యాయి.

+ 2024 జనవరి 1 నాటికి అమెరికా జనాభా 33.58 కోట్లకు చేరుకుంటుంది

+ అమెరికాలో జనాభా తగ్గకుండా ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వ‌ల‌స‌లు.(ఇదే పెద్ద రాజ‌కీయ వివాదంగా కూడా ఉంది) 

This post was last modified on December 30, 2023 1:44 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

4 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

6 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

7 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

7 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

8 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 hours ago