Trends

హోటల్ గది పంచాయితీతో రైనా వెళ్లిపోయాడా?

మిగిలిన క్రికెట్ టోర్నీలకు ఐపీఎల్ కు ఉన్న తేడా తెలిసిందే. ప్రతి సీజన్లో ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. కరోనా వేళ.. దుబాయ్ లో నిర్వహిస్తున్న ఐపీఎల్ రోటీన్ కు పూర్తిగా భిన్నమైనది. ఓవైపు వైరస్ భయం.. మరోవైపు సుదీర్ఘకాలం పాటు కుటుంబ సభ్యులకు దూరంగా మెలగటంతో పాటు.. మరిన్ని ఆంక్షల మధ్య ఆడాల్సిన బాధ్యత క్రికెటర్ల మీద ఉంది. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ కు చెందినస్టార్ ఆటగాడు సురేశ్ రైనా టీం నుంచి అనూహ్యంగా తప్పుకోవటం చర్చనీయాంశంగా మారింది.

సన్నిహితుల మరణంతో పాటు.. కుటుంబంపై బెంగతోనే ఆయన వెళ్లిపోయినట్లుగా ఇప్పటివరకు వినిపించింది. అందుకు భిన్నంగా.. ఆయన తిరిగి వెళ్లిపోవటానికి కారణం.. అతగాడికి కేటాయించిన హోటల్ గదిగా చెబుతున్నారు. తనకు కేటాయించిన హోటల్ గది ఏ మాతం నచ్చలేదట. కనీసం బాల్కనీ కూడా లేని హోటల్ గది కేటాయిస్తారా? అని ప్రశ్నించటంతో పాటు.. ధోనీకి కేటాయించినట్లుగా గది తనకు కేటాయించాలని కోరాడట. కానీ.. జట్టు యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతోనే జట్టు నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.

సాధారణంగా అయితే.. ఇవన్నీ పుకార్ల ఖాతాలోనే పడేవి. కానీ.. జట్టు యజమాని శ్రీనివాసన్ స్వయంగా ఈ అంశంపై మాట్లాడటంతో.. మరింత క్లారిటీ వచ్చిందని చెప్పాలి. పాతతరం సినిమా తారల మాదిరి క్రికెటర్లు తమ గురించి తాము గొప్పగా ఊహించుకుంటారన్నారు ‘చెన్నై జట్టులో ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదు. అందరూ సమానమే. అంతా కుటుంబంలా ఉంటారు. నిజంగా నీకు అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు. నేను బలవంతం పెట్టను. కొన్నిసార్లు విజయాలు తలకెక్కటం మామూలే. మాకు ధోని రూపంలో బలమైన ఆటగాడు ఉన్నాడు’ అని ఆయన పేర్కొన్నారు.

అంతేకాదు.. ఐపీఎల్ నుంచి రైనా తొలిగిపోవటం ఆయనకే భారీ నష్టమని శ్రీనివాసన్ వ్యాఖ్యానించటం గమనార్హం భారీగా డబ్బు (సుమారు 11 కోట్లరూపాయిలకు పైనే) కోల్పోవటంతో పాటు.. మరిన్ని కోల్పోతాడు. ఇవన్నీ రానున్న రోజుల్లోరైనాకు బాగా అర్థమవుతాయంటూ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

This post was last modified on August 31, 2020 5:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

6 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

7 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

8 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

10 hours ago