Trends

హోటల్ గది పంచాయితీతో రైనా వెళ్లిపోయాడా?

మిగిలిన క్రికెట్ టోర్నీలకు ఐపీఎల్ కు ఉన్న తేడా తెలిసిందే. ప్రతి సీజన్లో ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. కరోనా వేళ.. దుబాయ్ లో నిర్వహిస్తున్న ఐపీఎల్ రోటీన్ కు పూర్తిగా భిన్నమైనది. ఓవైపు వైరస్ భయం.. మరోవైపు సుదీర్ఘకాలం పాటు కుటుంబ సభ్యులకు దూరంగా మెలగటంతో పాటు.. మరిన్ని ఆంక్షల మధ్య ఆడాల్సిన బాధ్యత క్రికెటర్ల మీద ఉంది. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ కు చెందినస్టార్ ఆటగాడు సురేశ్ రైనా టీం నుంచి అనూహ్యంగా తప్పుకోవటం చర్చనీయాంశంగా మారింది.

సన్నిహితుల మరణంతో పాటు.. కుటుంబంపై బెంగతోనే ఆయన వెళ్లిపోయినట్లుగా ఇప్పటివరకు వినిపించింది. అందుకు భిన్నంగా.. ఆయన తిరిగి వెళ్లిపోవటానికి కారణం.. అతగాడికి కేటాయించిన హోటల్ గదిగా చెబుతున్నారు. తనకు కేటాయించిన హోటల్ గది ఏ మాతం నచ్చలేదట. కనీసం బాల్కనీ కూడా లేని హోటల్ గది కేటాయిస్తారా? అని ప్రశ్నించటంతో పాటు.. ధోనీకి కేటాయించినట్లుగా గది తనకు కేటాయించాలని కోరాడట. కానీ.. జట్టు యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతోనే జట్టు నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.

సాధారణంగా అయితే.. ఇవన్నీ పుకార్ల ఖాతాలోనే పడేవి. కానీ.. జట్టు యజమాని శ్రీనివాసన్ స్వయంగా ఈ అంశంపై మాట్లాడటంతో.. మరింత క్లారిటీ వచ్చిందని చెప్పాలి. పాతతరం సినిమా తారల మాదిరి క్రికెటర్లు తమ గురించి తాము గొప్పగా ఊహించుకుంటారన్నారు ‘చెన్నై జట్టులో ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదు. అందరూ సమానమే. అంతా కుటుంబంలా ఉంటారు. నిజంగా నీకు అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు. నేను బలవంతం పెట్టను. కొన్నిసార్లు విజయాలు తలకెక్కటం మామూలే. మాకు ధోని రూపంలో బలమైన ఆటగాడు ఉన్నాడు’ అని ఆయన పేర్కొన్నారు.

అంతేకాదు.. ఐపీఎల్ నుంచి రైనా తొలిగిపోవటం ఆయనకే భారీ నష్టమని శ్రీనివాసన్ వ్యాఖ్యానించటం గమనార్హం భారీగా డబ్బు (సుమారు 11 కోట్లరూపాయిలకు పైనే) కోల్పోవటంతో పాటు.. మరిన్ని కోల్పోతాడు. ఇవన్నీ రానున్న రోజుల్లోరైనాకు బాగా అర్థమవుతాయంటూ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Satya

Recent Posts

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

1 hour ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

4 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

6 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

7 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

7 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

7 hours ago