అసలే ప్రపంచకప్ ఇండియాలో జరుగుతోంది. పైగా ఇండియా ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థితో రసవత్తర పోరును చూడబోతున్నాం. ఇక ఈ మ్యాచ్ మీద ఉండే ఆసక్తి, అంచనాల గురించి చెప్పేదేముంది? ఇప్పటికే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మంది అభిమానులు స్టేడియాలకు వచ్చిన ప్రపంచకప్గా ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. టీవీ వ్యూయర్ షిప్ విషయంలోనూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఫైనల్కు మరిన్ని కొత్త రికార్డులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.
మొన్న సెమీస్ సందర్భంగా ఒకేసారి నాలుగున్నర కోట్ల మంది డిస్నీ-స్టార్ యాప్లో క్రికెట్ మ్యాచ్ చూశారు. ఇది రికార్డు. ఫైనల్లో ఈజీగా ఐదు కోట్ల వ్యూస్ మార్కును దాటేస్తారని అంచనా వేస్తున్నారు. మరి ఇంత వ్యూయర్ షిప్ ఉన్నపుడు యాడ్స్ ధరలు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయి. మామూలుగా 10 సెకన్ల టైంకి మ్యాచ్ ఆసక్తిని బట్టి రూ.10-20 లక్షల మధ్య ఛార్జ్ చేస్తుంటారు. గరిష్టంగా ఈ రేటు రూ.25 లక్షల వరకు ఉంటుంది. కానీ ఫైనల్ మ్యాచ్కు మాత్రం డిస్నీ-స్టార్ వాళ్లు పది సెకన్ల యాడ్కు ఏకంగా రూ.35 లక్షలు ఛార్జ్ చేస్తున్నారట.
ఇక అహ్మదాబాద్లో ఆదివారం నాడు హోటల్ ధరలు చుక్కలను అంటుతున్నాయి. ఒక గదికి ఒక్క రాత్రికి రూ.2 లక్షల దాకా చెల్లించాల్సిన పరిస్థితి వస్తోందట. సాధారణ హోటళ్లు సైతం భారీగా ధరలను పెంచేశాయి. ఇదిలా ఉంటే.. మ్యాచ్కు ముందు రోజు ఇండియా ప్రాక్టీస్ సెషన్ను సైతం క్యాష్ చేసుకోవడానికి బ్రాడ్కాస్టర్ రెడీ అయిపోయింది.
ఈ రోజు ప్రాక్టీస్ సెషన్ను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఇక మ్యాచ్ రోజు ఆరంభ సమయం కంటే 7 గంటల ముందు నుంచే డిస్కషన్లతో స్ట్రీమింగ్ మొదలవుతుందట. మొత్తానికి ఇండియాలో ఇండియా ఫైనల్ ఆడటం ఏమో కానీ.. దాన్ని పూర్తిగా క్యాష్ చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
This post was last modified on November 19, 2023 9:22 am
జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…
నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…
ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…