అసలే ప్రపంచకప్ ఇండియాలో జరుగుతోంది. పైగా ఇండియా ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థితో రసవత్తర పోరును చూడబోతున్నాం. ఇక ఈ మ్యాచ్ మీద ఉండే ఆసక్తి, అంచనాల గురించి చెప్పేదేముంది? ఇప్పటికే ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక మంది అభిమానులు స్టేడియాలకు వచ్చిన ప్రపంచకప్గా ఈ టోర్నీ రికార్డు సృష్టించింది. టీవీ వ్యూయర్ షిప్ విషయంలోనూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఫైనల్కు మరిన్ని కొత్త రికార్డులు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.
మొన్న సెమీస్ సందర్భంగా ఒకేసారి నాలుగున్నర కోట్ల మంది డిస్నీ-స్టార్ యాప్లో క్రికెట్ మ్యాచ్ చూశారు. ఇది రికార్డు. ఫైనల్లో ఈజీగా ఐదు కోట్ల వ్యూస్ మార్కును దాటేస్తారని అంచనా వేస్తున్నారు. మరి ఇంత వ్యూయర్ షిప్ ఉన్నపుడు యాడ్స్ ధరలు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయి. మామూలుగా 10 సెకన్ల టైంకి మ్యాచ్ ఆసక్తిని బట్టి రూ.10-20 లక్షల మధ్య ఛార్జ్ చేస్తుంటారు. గరిష్టంగా ఈ రేటు రూ.25 లక్షల వరకు ఉంటుంది. కానీ ఫైనల్ మ్యాచ్కు మాత్రం డిస్నీ-స్టార్ వాళ్లు పది సెకన్ల యాడ్కు ఏకంగా రూ.35 లక్షలు ఛార్జ్ చేస్తున్నారట.
ఇక అహ్మదాబాద్లో ఆదివారం నాడు హోటల్ ధరలు చుక్కలను అంటుతున్నాయి. ఒక గదికి ఒక్క రాత్రికి రూ.2 లక్షల దాకా చెల్లించాల్సిన పరిస్థితి వస్తోందట. సాధారణ హోటళ్లు సైతం భారీగా ధరలను పెంచేశాయి. ఇదిలా ఉంటే.. మ్యాచ్కు ముందు రోజు ఇండియా ప్రాక్టీస్ సెషన్ను సైతం క్యాష్ చేసుకోవడానికి బ్రాడ్కాస్టర్ రెడీ అయిపోయింది.
ఈ రోజు ప్రాక్టీస్ సెషన్ను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఇక మ్యాచ్ రోజు ఆరంభ సమయం కంటే 7 గంటల ముందు నుంచే డిస్కషన్లతో స్ట్రీమింగ్ మొదలవుతుందట. మొత్తానికి ఇండియాలో ఇండియా ఫైనల్ ఆడటం ఏమో కానీ.. దాన్ని పూర్తిగా క్యాష్ చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
This post was last modified on November 19, 2023 9:22 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…