Trends

కోహ్లీ@50..మోడీ, సచిన్ ఫిదా!

టీమిండియా క్రికెటర్, ప్రపంచం గర్వించదగ్గ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రపంచంలో మరే క్రికెటర్ కు సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో 50 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా కింగ్ కోహ్లీ అవతరించాడు. ఈ రోజు న్యూజిల్యాండ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 50వ సెంచరీ నమోదు చేశాడు. కొంతకాలంగా ఊరిస్తున్న ఈ రికార్డును మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సమక్షంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోహ్లీ అధిగమించడం విశేషం. 113 బంతుల్లో 117 రన్స్ చేసిన కోహ్లీతోపాటు శ్రేయాస్ అయ్యర్ కూడా సెంచరీ చేశాడు.

ఓపెనర్లు రోహిత్ శర్మ,శుభ్ మన్ గిల్ అర్ధ సెంచరీలతో దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాను తొలిసారిగా కోహ్లీని డ్రెస్సింగ్ రూంలో కలిసినప్పుడు.. తన పాదాలు తాకాలని మిగతా ఆటగాళ్లు ప్రాంక్ చేశారని సచిన్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత కోహ్లీ తన అంకితభావం, నైపుణ్యంతో తన హృదయాన్ని తాకాడని, ఆనాటి యువకుడు ‘విరాట్’గా ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఒక భారతీయుడు తన రికార్డును బద్దలు కొట్టినందుకే కాకుండా, ప్రపంచకప్ సెమీస్‌లో తన హోం గ్రౌండ్‌లో ఈ రికార్డు సాధించినందుకు గర్వంగా ఉందని క్రికెట్ దిగ్గజం సచిన్ ట్వీట్ చేశారు.

మరోవైపు, ఈ ఘనత సాధించిన విరాట్ కోహ్లీకి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ తన 50 సెంచరీని సాధించడమే కాకుండా అత్యుత్తమ క్రీడాస్పూర్తి కనబరిచారని, ఈ అద్భుతమైన మైలురాయి అతడి నిరంతర అంకిత భావానికి, అసాధారణ ప్రతిభకు నిదర్శనం అని కొనియాడారు. భవిష్యత్ తరాలకు కోహ్లీ బెంచ్‌మార్క్ సెట్ చేస్తూనే ఉన్నాడని ట్వీట్ చేశారు. 50వ సెంచరీ సాధించి, చారిత్రక మైలురాయిని సాధించిన కోహ్లీకి షా అభినందనలు తెలిపారు. ఆటను మరింత స్థాయికి ఎదగనివ్వాలని, దేశం మొత్తం కోహ్లీని చూసి గర్విస్తోందని చెప్పారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

1 hour ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

1 hour ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

3 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

3 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

3 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

3 hours ago