19వ ఏషియన్ గేమ్స్ లో తొలిసారిగా క్రికెట్ ను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతంగా రాణించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక, ఇదే జోరులో తాజాగా భారత పురుషుల క్రికెట్ జట్టు కూడా స్వర్ణ పతకం సాధించింది. వర్షం కారణంగా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫలితం రాకపోవడంతో టీమిండియాను విజేతగా ప్రకటించారు.
మెరుగైన ర్యాంక్ కారణంగా భారత జట్టును ఛాంపియన్ గా నిర్ణయించారు. శనివారం నాడు జరిగిన ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆఫ్గాన్ జట్టు 18 ఓవర్లలో వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత వరుణుడు కరుణించకపోవడంతో మ్యాచ్ రద్దు చేసి భారత్ ను విజేతగా ప్రకటించారు.
ఏషియన్ గేమ్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టిన తొలి ఏడాది భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించాయి. ఈ గోల్డ్ మెడల్ తో కలిపి మొత్తం 27 స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. ఇప్పటివరకు మొత్తం 102 పతకాలను మన దేశపు క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. శనివారం ఉదయం ఆర్చరీ, మహిళ కబడ్డీలో భారత్ మూడు బంగారం పతకాలను కైవసం చేసుకుంది. ఆర్చరీ విభాగంలో జ్యోతి సురేఖ వెన్నం, ప్రవీణ ఓజస్ బంగారు పతకాలను గెలుచుకున్నారు. చైనీస్ తైపీ జట్టును ఓడించి భారత మహిళల కబడ్డీ జట్టు బంగారం పతకం సొంతం చేసుకుంది. 100 మెడల్స్ కు పైగా సాధించి అద్భుతంగా రాణిస్తున్న భారత జట్టుకు, క్రీడాకారులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
This post was last modified on October 7, 2023 9:47 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…