హైదరాబాద్ నడిబొడ్డున ఉండే సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చోటు చేసుకున్న దారుణం షాకింగ్ గా మారింది. చికిత్స కోసం సోదరుడు ఆసుపత్రిలో చేరితే.. అతడికి సాయంగా ఉండేందుకు వచ్చిన అతడి సోదరిపై అత్యాచారం జరిగిన వైనం సంచలనంగా మారింది. ఆసుపత్రి క్యాంటీన్ సిబ్బంది ఒకరు చేసిన ఈ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోగులు.. వారి బంధువుల భద్రతపై కొత్త సందేహాలకు తావిచ్చేలా పరిస్థితులు నెలకొన్నాయి.
కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల యువతి సోదరుడు జారి పడిన ఉదంతంలో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో.. అతడ్ని సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే.. బాధితుడికి ఇటీవల నొప్పులు మళ్లీ తిరగబెట్టటంతో ఈ నెల ఆరున తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. అతడికి సాయంగా ఉండేందుకు అతని సోదరి (బాధితురాలు) వచ్చింది. శుక్రవారం రాత్రి సోదరుడికి భోజనం తీసుకురావటానికి ఆమె కిందకు వచ్చింది.
తిరిగి సోదరుడు ఉన్న గదికి వెళ్లే సమయంలో ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు ఆమెను కలిశాడు. అక్కడి క్యాంటీన్ లో పని చేసే పాతికేళ్ల షాదాబ్ ను పరిచయం చేశాడు. ఏమైనా సాయం కావాలంటే అతడ్ని సంప్రదించాలని చెప్పాడు. అనంతరం ఆమె లిఫ్టులో వెళుతున్నప్పుడు షాదాబ్ ఆమెను ఫాలో అయ్యి.. బలవంతంగా ఆమెను రెండో అంతస్తులోని చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బ్లడ్ టెస్టులు చేసే గదిలో ఆమెను మరోసారి అత్యాచారం చేశాడు.
తనను లైంగికంగా వేధిస్తున్న అతడ్ని తప్పించుకోవటానికి సోదరుడికి ఫోన్ చేయగా.. అతను రెండో అంతస్తుకు వచ్చి గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. నిందితుడు పారిపోయాడు. ఆసుపత్రి అధికారులకు ఈ విషయం మీద కంప్లైంట్ చేయగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. భాదితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు షాదాబ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఉదంతం ఆసుపత్రి వర్గాల్లో సంచలనంగా మారింది.
This post was last modified on September 17, 2023 2:31 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…