హైదరాబాద్ నడిబొడ్డున ఉండే సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చోటు చేసుకున్న దారుణం షాకింగ్ గా మారింది. చికిత్స కోసం సోదరుడు ఆసుపత్రిలో చేరితే.. అతడికి సాయంగా ఉండేందుకు వచ్చిన అతడి సోదరిపై అత్యాచారం జరిగిన వైనం సంచలనంగా మారింది. ఆసుపత్రి క్యాంటీన్ సిబ్బంది ఒకరు చేసిన ఈ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోగులు.. వారి బంధువుల భద్రతపై కొత్త సందేహాలకు తావిచ్చేలా పరిస్థితులు నెలకొన్నాయి.
కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల యువతి సోదరుడు జారి పడిన ఉదంతంలో తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో.. అతడ్ని సనత్ నగర్ లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే.. బాధితుడికి ఇటీవల నొప్పులు మళ్లీ తిరగబెట్టటంతో ఈ నెల ఆరున తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. అతడికి సాయంగా ఉండేందుకు అతని సోదరి (బాధితురాలు) వచ్చింది. శుక్రవారం రాత్రి సోదరుడికి భోజనం తీసుకురావటానికి ఆమె కిందకు వచ్చింది.
తిరిగి సోదరుడు ఉన్న గదికి వెళ్లే సమయంలో ఆసుపత్రి సెక్యూరిటీ గార్డు ఆమెను కలిశాడు. అక్కడి క్యాంటీన్ లో పని చేసే పాతికేళ్ల షాదాబ్ ను పరిచయం చేశాడు. ఏమైనా సాయం కావాలంటే అతడ్ని సంప్రదించాలని చెప్పాడు. అనంతరం ఆమె లిఫ్టులో వెళుతున్నప్పుడు షాదాబ్ ఆమెను ఫాలో అయ్యి.. బలవంతంగా ఆమెను రెండో అంతస్తులోని చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత బ్లడ్ టెస్టులు చేసే గదిలో ఆమెను మరోసారి అత్యాచారం చేశాడు.
తనను లైంగికంగా వేధిస్తున్న అతడ్ని తప్పించుకోవటానికి సోదరుడికి ఫోన్ చేయగా.. అతను రెండో అంతస్తుకు వచ్చి గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. నిందితుడు పారిపోయాడు. ఆసుపత్రి అధికారులకు ఈ విషయం మీద కంప్లైంట్ చేయగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. భాదితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు షాదాబ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఉదంతం ఆసుపత్రి వర్గాల్లో సంచలనంగా మారింది.
This post was last modified on September 17, 2023 2:31 pm
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…
ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి రాజకీయ నేత సీఎం కావాలనే కోరుకుంటారు. ఇక గ్రాండ్…
ఇవాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన…