నాజులైన ఉత్పత్తులతో తనకు సాటి మరెవరూ రానట్లుగా ఉండే యాపిల్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెక్ దిగ్గజ కంపెనీ అయిన ఈ సంస్థ తాజాగా హిస్టరీ క్రియేట్ చేసింది. తాజగా ఆ కంపెనీ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అమెరికాలో 2లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక కంపెనీగా అవతరించింది.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రెండేళ్ల క్రితం యాపిల్ లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అందుకు రెట్టింపు విలువను సొంతం చేసుకోవటం విశేషం. అమెరికాలో ఈ రికార్డు ఉన్న కంపెనీ మరొకటి లేదని చెబుతున్నారు. ఇంతకూ ఇంత భారీ రికార్డుకు కారణం.. ఈ ఏడాదిలోయాపిల్ షేర్లు 60 శాతం దూసుకెళ్లటమేనని చెబుతున్నారు.
ఇంత భారీ రికార్డును సొంతం చేసుకున్న యాపిల్.. కరోనా కష్టకాలంలో సాధించటం ప్రత్యేకతగా చెప్పాలి. ఈ సంక్షోభ సమయంలో చాలా కంపెనీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. అందుకు భిన్నంగా యాపిల్ మాత్రం కొత్త రికార్డును నెలకొల్పటం ప్రత్యేకతగా చెప్పక తప్పదు. చైనాలో ఐఫోన్లు ఉత్పత్తి చేసే ప్లాంట్లను మూసివేయటం.. కరోనా నేపథ్యంలో రిటైల్ అమ్మకాలు ఆగిపోవటం లాంటి చిక్కుల్ని అధిగమించటం విశేషం.
యాపిల్ సంగతి ఇలా ఉంటే..సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ అరామ్ కో 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను 2019లోనే సొంతం చేసుకుంది. పబ్లిక్ కంపెనీగా మారిన కొద్దిరోజులకే ఈ ఘనతనుసాధించినా.. గడిచిన కొద్ది నెలలుగా చమురు ధరలు తగ్గిపోవటంతో ఆ సంస్థ మార్కెట్ విలువ 1.82లక్షల కోట్ల డాలర్లకు పడిపోవటం గమనార్హం.
This post was last modified on August 20, 2020 11:06 am
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…