నాజులైన ఉత్పత్తులతో తనకు సాటి మరెవరూ రానట్లుగా ఉండే యాపిల్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెక్ దిగ్గజ కంపెనీ అయిన ఈ సంస్థ తాజాగా హిస్టరీ క్రియేట్ చేసింది. తాజగా ఆ కంపెనీ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. అమెరికాలో 2లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఏకైక కంపెనీగా అవతరించింది.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రెండేళ్ల క్రితం యాపిల్ లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అందుకు రెట్టింపు విలువను సొంతం చేసుకోవటం విశేషం. అమెరికాలో ఈ రికార్డు ఉన్న కంపెనీ మరొకటి లేదని చెబుతున్నారు. ఇంతకూ ఇంత భారీ రికార్డుకు కారణం.. ఈ ఏడాదిలోయాపిల్ షేర్లు 60 శాతం దూసుకెళ్లటమేనని చెబుతున్నారు.
ఇంత భారీ రికార్డును సొంతం చేసుకున్న యాపిల్.. కరోనా కష్టకాలంలో సాధించటం ప్రత్యేకతగా చెప్పాలి. ఈ సంక్షోభ సమయంలో చాలా కంపెనీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. అందుకు భిన్నంగా యాపిల్ మాత్రం కొత్త రికార్డును నెలకొల్పటం ప్రత్యేకతగా చెప్పక తప్పదు. చైనాలో ఐఫోన్లు ఉత్పత్తి చేసే ప్లాంట్లను మూసివేయటం.. కరోనా నేపథ్యంలో రిటైల్ అమ్మకాలు ఆగిపోవటం లాంటి చిక్కుల్ని అధిగమించటం విశేషం.
యాపిల్ సంగతి ఇలా ఉంటే..సౌదీ అరేబియా చమురు దిగ్గజం సౌదీ అరామ్ కో 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను 2019లోనే సొంతం చేసుకుంది. పబ్లిక్ కంపెనీగా మారిన కొద్దిరోజులకే ఈ ఘనతనుసాధించినా.. గడిచిన కొద్ది నెలలుగా చమురు ధరలు తగ్గిపోవటంతో ఆ సంస్థ మార్కెట్ విలువ 1.82లక్షల కోట్ల డాలర్లకు పడిపోవటం గమనార్హం.
This post was last modified on August 20, 2020 11:06 am
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…