గంజాయి మత్తుకు బానిసై ఆత్మహత్య చేసుకున్న ప్రియుడ్ని మరిచిపోలేక ప్రియురాలు కూడా బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యానాం యూకేవీ నగర్ కు చెందిన మీసాల మౌనిక (22) తాళ్లరేవులో నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ కోర్సును మూడో సంవత్సరం చదువుతుంది.
మౌనికకు 2 ఇద్దరు అక్కలు ఉండగా..వారిద్దరికీ పెళ్లి అయిపోగా..అప్పటి నుంచి కూడా మౌనిక మేనమామ వద్ద ఉండి చదువుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు నిమ్మకాయల చిన్నా అనే వ్యక్తి పరిచమయ్యాడు. సుమారు రెండు సంవత్సరాల నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.
చిన్నా కొంతకాలం నుంచి గంజాయికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే చిన్నాకి తన సోదరునికి డబ్బుల విషయంలో గొడవ జరగడంతో క్షణికావేశంలో రెండు నెలల క్రితం గంజాయి మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మౌనిక కుంగిపోయింది. అప్పటి నుంచి మౌనిక కాలేజీకి వెళ్లడం మానేసింది.
అతడినే తలుచుకుంటూ గడుపుతుంది. ఈ క్రమంలోనే చిన్నాకు సంబంధించిన దుస్తులు, కొన్ని వస్తువులను మౌనిక తన గదిలో ఉంచుకుని వాటిని చూస్తూ ఏడుస్తూండేది. చిన్నా ఫోటోలను కూడా గోడలకు వేలాడదీసింది. ప్రియుడి జ్ఞాపకాలతో జీవిస్తూ.. మానసికంగా కుంగుబాటుకు గురైంది. ఈ క్రమంలోనే ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది.
కొంత సమయం తరువాత మేనమామ జరిగిన విషయాన్ని గమనించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని డెడ్ బాడీని హాస్పిటల్ తీసుకెళ్లి. పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on August 23, 2023 1:20 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…