నిజమే.. మీరు చదివింది నిజంగానే జరిగింది. కట్టుకున్న భార్యను ఎంతో ఇష్టపడి.. ప్రేమించిన భర్త.. ఆమెను ఉన్నత చదువులు చదివించాడు. ఆమె అబీష్టాన్ని నెరవేర్చాడు. తీరా చదువు పూర్తయి.. ఉద్యో గం వచ్చాక.. సదరు భార్యామణి.. లవర్తో జంప్ అయిపోయింది! దీంతో ఆ భర్త ఇప్పుడు లబోదిబోమం టున్నా డు. ఈ పక్కా మోసం.. మధ్య ప్రదేశ్లో జరిగింది. విషయంలో సీరియస్ నెస్ ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?
మధ్యప్రదేశ్లోని అనూప్పూర్ జిల్లా పకరియా గ్రామానికి చెందిన జోహన్ భారియా, మీనాక్షి దంపతులు. వీరిద్దరిలో మీనాక్షిని జోహాన్ ప్రేమించి మరీ చేసుకున్నాడు. సరే.. ఈ ప్రేమతోనే ఆమె చెప్పిందల్లా చేశాడు. ఆయన కోరిందల్లా సమకూర్చాడు. ఈ క్రమంలోనే తనకు నర్సు కావాలని ఎప్పుటి నుంచో కోరికని.. సమజానికి సేవ చేస్తానని మీనాక్షి చెప్పింది. దీంతో సదరు కాదనకుండా.. బ్యాంకు నుంచి లోన్ తీసుకొని మరీ ఆమెను చదివించాడు.
ఎట్టకేలకు ఆమె నర్సు ఉద్యోగం సంపాదించింది. ప్రభుత్వ నర్సుగా ఎంపికైన ఆమెకు ఖండ్వా జిల్లా ఆసుపత్రిలో పోస్టింగ్ వచ్చింది. అక్కడికి ఆమె వెళ్లాక అసలు సమస్య మొదలైంది. అక్కడ ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక ఆ వ్యక్తితోనే కలిసుండాలని నిర్ణయించుకొని, జోహన్న వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కుమార్తెను సైతం తీసుకెళ్లిపోయింది.
అయితే.. ఎంతో ప్రేమించిన భార్య.. తనని విడిచి వెళ్లడంతో మానసికంగా కుంగిపోయిన భర్త.. వెళ్లొద్దని, తనతోనే ఉండాలని ఎంతో ప్రాధేయపడ్డాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. పైగా.. ‘నా జీవితంలోకి మరొకరు వచ్చారు, నువ్వు కూడా ఎవరినైనా చూసుకో’ అని చెప్పి వెళ్లిపోయింది. ఈ ఘటనపై నెటిజన్లు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మోసం గురూ“ అని కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on August 14, 2023 11:05 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…