నిజమే.. మీరు చదివింది నిజంగానే జరిగింది. కట్టుకున్న భార్యను ఎంతో ఇష్టపడి.. ప్రేమించిన భర్త.. ఆమెను ఉన్నత చదువులు చదివించాడు. ఆమె అబీష్టాన్ని నెరవేర్చాడు. తీరా చదువు పూర్తయి.. ఉద్యో గం వచ్చాక.. సదరు భార్యామణి.. లవర్తో జంప్ అయిపోయింది! దీంతో ఆ భర్త ఇప్పుడు లబోదిబోమం టున్నా డు. ఈ పక్కా మోసం.. మధ్య ప్రదేశ్లో జరిగింది. విషయంలో సీరియస్ నెస్ ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?
మధ్యప్రదేశ్లోని అనూప్పూర్ జిల్లా పకరియా గ్రామానికి చెందిన జోహన్ భారియా, మీనాక్షి దంపతులు. వీరిద్దరిలో మీనాక్షిని జోహాన్ ప్రేమించి మరీ చేసుకున్నాడు. సరే.. ఈ ప్రేమతోనే ఆమె చెప్పిందల్లా చేశాడు. ఆయన కోరిందల్లా సమకూర్చాడు. ఈ క్రమంలోనే తనకు నర్సు కావాలని ఎప్పుటి నుంచో కోరికని.. సమజానికి సేవ చేస్తానని మీనాక్షి చెప్పింది. దీంతో సదరు కాదనకుండా.. బ్యాంకు నుంచి లోన్ తీసుకొని మరీ ఆమెను చదివించాడు.
ఎట్టకేలకు ఆమె నర్సు ఉద్యోగం సంపాదించింది. ప్రభుత్వ నర్సుగా ఎంపికైన ఆమెకు ఖండ్వా జిల్లా ఆసుపత్రిలో పోస్టింగ్ వచ్చింది. అక్కడికి ఆమె వెళ్లాక అసలు సమస్య మొదలైంది. అక్కడ ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక ఆ వ్యక్తితోనే కలిసుండాలని నిర్ణయించుకొని, జోహన్న వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కుమార్తెను సైతం తీసుకెళ్లిపోయింది.
అయితే.. ఎంతో ప్రేమించిన భార్య.. తనని విడిచి వెళ్లడంతో మానసికంగా కుంగిపోయిన భర్త.. వెళ్లొద్దని, తనతోనే ఉండాలని ఎంతో ప్రాధేయపడ్డాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. పైగా.. ‘నా జీవితంలోకి మరొకరు వచ్చారు, నువ్వు కూడా ఎవరినైనా చూసుకో’ అని చెప్పి వెళ్లిపోయింది. ఈ ఘటనపై నెటిజన్లు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మోసం గురూ“ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…