Trends

భ‌ర్త చ‌దివించాడు.. ఉద్యోగం వ‌చ్చాక‌.. ల‌వ‌ర్‌తో జంప్‌!

నిజ‌మే.. మీరు చ‌దివింది నిజంగానే జ‌రిగింది. క‌ట్టుకున్న భార్య‌ను ఎంతో ఇష్ట‌ప‌డి.. ప్రేమించిన భ‌ర్త‌.. ఆమెను ఉన్న‌త చ‌దువులు చ‌దివించాడు. ఆమె అబీష్టాన్ని నెర‌వేర్చాడు. తీరా చ‌దువు పూర్తయి.. ఉద్యో గం వ‌చ్చాక‌.. స‌ద‌రు భార్యామ‌ణి.. ల‌వ‌ర్‌తో జంప్ అయిపోయింది!  దీంతో ఆ భ‌ర్త ఇప్పుడు ల‌బోదిబోమం టున్నా డు. ఈ ప‌క్కా మోసం.. మ‌ధ్య ప్రదేశ్‌లో జ‌రిగింది. విష‌యంలో సీరియ‌స్ నెస్ ఉండ‌డంతో దేశ‌వ్యాప్తంగా ఈ కేసు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏం జ‌రిగింది?

మధ్యప్రదేశ్‌లోని అనూప్‌పూర్‌ జిల్లా పకరియా గ్రామానికి చెందిన జోహన్‌ భారియా, మీనాక్షి  దంప‌తులు. వీరిద్ద‌రిలో మీనాక్షిని జోహాన్ ప్రేమించి మ‌రీ చేసుకున్నాడు. స‌రే.. ఈ ప్రేమతోనే ఆమె చెప్పింద‌ల్లా చేశాడు. ఆయ‌న కోరింద‌ల్లా స‌మ‌కూర్చాడు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు న‌ర్సు కావాల‌ని ఎప్పుటి నుంచో కోరిక‌ని.. స‌మ‌జానికి సేవ చేస్తాన‌ని మీనాక్షి చెప్పింది. దీంతో స‌ద‌రు కాద‌న‌కుండా.. బ్యాంకు నుంచి లోన్ తీసుకొని మ‌రీ ఆమెను చదివించాడు.

ఎట్టకేలకు ఆమె నర్సు ఉద్యోగం సంపాదించింది. ప్రభుత్వ నర్సుగా ఎంపికైన ఆమెకు ఖండ్వా జిల్లా ఆసుపత్రిలో పోస్టింగ్‌ వచ్చింది. అక్కడికి ఆమె వెళ్లాక అసలు సమస్య మొదలైంది. అక్కడ ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక ఆ వ్యక్తితోనే కలిసుండాలని నిర్ణయించుకొని, జోహన్‌న వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కుమార్తెను సైతం తీసుకెళ్లిపోయింది.

అయితే.. ఎంతో ప్రేమించిన భార్య‌.. తనని విడిచి వెళ్ల‌డంతో మాన‌సికంగా కుంగిపోయిన భ‌ర్త‌.. వెళ్లొద్దని, తనతోనే ఉండాలని ఎంతో ప్రాధేయపడ్డాడు. అయినా ఆమె వినిపించుకోలేదు. పైగా.. ‘నా జీవితంలోకి మరొకరు వచ్చారు, నువ్వు కూడా ఎవరినైనా చూసుకో’ అని చెప్పి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. “మోసం గురూ“ అని కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on August 14, 2023 11:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago