Trends

కిలోమీట‌ర్ రోడ్డుకు రూ.250 కోట్లు!

కిలోమీట‌ర్ రోడ్డుకు రూ.250 కోట్లు! అవును.. మీరు చ‌దివింది నిజ‌మే! ద్వార‌క ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో కిలోమీట‌ర్‌కు రూ.250.77 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ని కాగ్ (కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌) నివేదిక వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఢిల్లీ- గురుగ్రామ్ మ‌ధ్య నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం అత్యంత ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా క‌నిపిస్తోంద‌ని కాగ్ నివేదిక వ్యాఖ్యానించ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో బీజేపీపై విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తిప‌క్షాల‌కు ఓ ఆయుధం దొరికిన‌ట్ల‌యింది.

నిజానికి ఈ ర‌హ‌దారి నిర్మాణానికి ఒక్కో కిలోమీట‌ర్‌కు ప్ర‌భుత్వ కేటాయింపులు రూ.18.20 కోట్లు కాగా.. వాస్త‌వ ఖ‌ర్చు మాత్రం రూ.250.77 కోట్ల‌కు పెరిగింద‌ని కాగ్ నివేదిక తెలిపింది. భార‌త్ మాల ప్రాజెక్టులో భాగంంగా ఈ 48వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిని 14 వ‌రుస‌లుగా నిర్మించేందుకు 2017లో కేంద్రం అనుమ‌తులిచ్చింది. 8 లేన్ల ఎలివేటెడ్ ద్వార‌క ఎక్స్‌ప్రెస్ హైవే కారిడార్‌లో సుల‌భంగా వాహ‌నాల రాక‌పోక‌ల కోసం త‌క్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పెట్ట‌డ‌మే నిర్మాణ వ్య‌యం పెరిగేందుకు కార‌ణ‌మ‌ని రోడ్డు ర‌వాణా హైవేల శాఖ చెబుతోంద‌ని కాగ్ వెల్ల‌డించింది. ఈ కార‌ణం ఏ మాత్రం క‌రెక్టుగా లేద‌ని కాగ్ పేర్కొంది.

8 లేన్ల‌కు బ‌దులు ఆరు లేన్ల‌కు మాత్ర‌మే ప్ర‌ణాళిక రూపొందించి, నిర్మాణం పూర్తి చేశార‌ని కాగ్ పేర్కొంది.  భార‌త్ మాల ప్రాజెక్టుల్లో భాగంగా దేశంలోని ఇత‌ర హైవేల నిర్మాణ కేటాయింపుల కంటే 58 శాతం అధికంగా ద్వార‌క ఎక్స్‌ప్రెస్ హైవే కేసం ఖ‌ర్చు చేశార‌ని కాగ్ తెలిపింది. దీంతో అధికార బీజేపీపై ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. రూ.6741 కోట్ల స్కామ్‌ను కాగ్ బ‌య‌ట‌పెట్టింద‌ని  ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సంచ‌ల‌న నివేదిక జాతీయ రాజ‌కీయాల‌ను మ‌రోసారి వేడెక్కించింద‌నే చెప్పాలి. 

This post was last modified on August 14, 2023 10:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

27 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago