Trends

కిలోమీట‌ర్ రోడ్డుకు రూ.250 కోట్లు!

కిలోమీట‌ర్ రోడ్డుకు రూ.250 కోట్లు! అవును.. మీరు చ‌దివింది నిజ‌మే! ద్వార‌క ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో కిలోమీట‌ర్‌కు రూ.250.77 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ని కాగ్ (కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌) నివేదిక వెల్ల‌డించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఢిల్లీ- గురుగ్రామ్ మ‌ధ్య నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం అత్యంత ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా క‌నిపిస్తోంద‌ని కాగ్ నివేదిక వ్యాఖ్యానించ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో బీజేపీపై విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తిప‌క్షాల‌కు ఓ ఆయుధం దొరికిన‌ట్ల‌యింది.

నిజానికి ఈ ర‌హ‌దారి నిర్మాణానికి ఒక్కో కిలోమీట‌ర్‌కు ప్ర‌భుత్వ కేటాయింపులు రూ.18.20 కోట్లు కాగా.. వాస్త‌వ ఖ‌ర్చు మాత్రం రూ.250.77 కోట్ల‌కు పెరిగింద‌ని కాగ్ నివేదిక తెలిపింది. భార‌త్ మాల ప్రాజెక్టులో భాగంంగా ఈ 48వ నంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిని 14 వ‌రుస‌లుగా నిర్మించేందుకు 2017లో కేంద్రం అనుమ‌తులిచ్చింది. 8 లేన్ల ఎలివేటెడ్ ద్వార‌క ఎక్స్‌ప్రెస్ హైవే కారిడార్‌లో సుల‌భంగా వాహ‌నాల రాక‌పోక‌ల కోసం త‌క్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పెట్ట‌డ‌మే నిర్మాణ వ్య‌యం పెరిగేందుకు కార‌ణ‌మ‌ని రోడ్డు ర‌వాణా హైవేల శాఖ చెబుతోంద‌ని కాగ్ వెల్ల‌డించింది. ఈ కార‌ణం ఏ మాత్రం క‌రెక్టుగా లేద‌ని కాగ్ పేర్కొంది.

8 లేన్ల‌కు బ‌దులు ఆరు లేన్ల‌కు మాత్ర‌మే ప్ర‌ణాళిక రూపొందించి, నిర్మాణం పూర్తి చేశార‌ని కాగ్ పేర్కొంది.  భార‌త్ మాల ప్రాజెక్టుల్లో భాగంగా దేశంలోని ఇత‌ర హైవేల నిర్మాణ కేటాయింపుల కంటే 58 శాతం అధికంగా ద్వార‌క ఎక్స్‌ప్రెస్ హైవే కేసం ఖ‌ర్చు చేశార‌ని కాగ్ తెలిపింది. దీంతో అధికార బీజేపీపై ప్ర‌తిప‌క్షాలు విరుచుకుప‌డుతున్నాయి. రూ.6741 కోట్ల స్కామ్‌ను కాగ్ బ‌య‌ట‌పెట్టింద‌ని  ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సంచ‌ల‌న నివేదిక జాతీయ రాజ‌కీయాల‌ను మ‌రోసారి వేడెక్కించింద‌నే చెప్పాలి. 

Satya

Recent Posts

బంగారం బోణీ నిజంగా బంగారమే

సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…

7 minutes ago

వారణాసి లెక్కలు వేరే ఉన్నాయి

వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…

1 hour ago

సెట్ కి రాకుండా సినిమా తీసిన సింగీతం

దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…

5 hours ago

బ్రాండింగ్ లో బాబు, పవన్ తర్వాతే ఎవరైనా!

నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…

7 hours ago

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

11 hours ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

13 hours ago