కిలోమీటర్ రోడ్డుకు రూ.250 కోట్లు! అవును.. మీరు చదివింది నిజమే! ద్వారక ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో కిలోమీటర్కు రూ.250.77 కోట్లు ఖర్చయిందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వెల్లడించడం సంచలనంగా మారింది. ఢిల్లీ- గురుగ్రామ్ మధ్య నిర్మించిన ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం అత్యంత ఖరీదైన వ్యవహారంగా కనిపిస్తోందని కాగ్ నివేదిక వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో బీజేపీపై విమర్శలకు ప్రతిపక్షాలకు ఓ ఆయుధం దొరికినట్లయింది.
నిజానికి ఈ రహదారి నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్కు ప్రభుత్వ కేటాయింపులు రూ.18.20 కోట్లు కాగా.. వాస్తవ ఖర్చు మాత్రం రూ.250.77 కోట్లకు పెరిగిందని కాగ్ నివేదిక తెలిపింది. భారత్ మాల ప్రాజెక్టులో భాగంంగా ఈ 48వ నంబర్ జాతీయ రహదారిని 14 వరుసలుగా నిర్మించేందుకు 2017లో కేంద్రం అనుమతులిచ్చింది. 8 లేన్ల ఎలివేటెడ్ ద్వారక ఎక్స్ప్రెస్ హైవే కారిడార్లో సులభంగా వాహనాల రాకపోకల కోసం తక్కువ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పెట్టడమే నిర్మాణ వ్యయం పెరిగేందుకు కారణమని రోడ్డు రవాణా హైవేల శాఖ చెబుతోందని కాగ్ వెల్లడించింది. ఈ కారణం ఏ మాత్రం కరెక్టుగా లేదని కాగ్ పేర్కొంది.
8 లేన్లకు బదులు ఆరు లేన్లకు మాత్రమే ప్రణాళిక రూపొందించి, నిర్మాణం పూర్తి చేశారని కాగ్ పేర్కొంది. భారత్ మాల ప్రాజెక్టుల్లో భాగంగా దేశంలోని ఇతర హైవేల నిర్మాణ కేటాయింపుల కంటే 58 శాతం అధికంగా ద్వారక ఎక్స్ప్రెస్ హైవే కేసం ఖర్చు చేశారని కాగ్ తెలిపింది. దీంతో అధికార బీజేపీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రూ.6741 కోట్ల స్కామ్ను కాగ్ బయటపెట్టిందని ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సంచలన నివేదిక జాతీయ రాజకీయాలను మరోసారి వేడెక్కించిందనే చెప్పాలి.
This post was last modified on August 14, 2023 10:29 pm
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…