ఆమెది చాలా సాదాసీదా జీవితం. కానీ.. ఆమెలోని మానవత్వం.. నలుగురికి సాయం చేయాలన్న తపన.. కరోనా లాంటి సంక్షోభ సమయంలో తన గురించి కాకుండా.. అందరి గురించి ఆలోచించే ఆమె తత్త్వం ఎందరికో స్ఫూర్తినిస్తుందని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో తాజాగా వెలుగు చూసిన ఒక స్ఫూర్తి కిరణంగా రత్నమాలను చెప్పాలి. నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ.. కరోనాలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో వీలైనంత మేర సాయం చేయాలన్న తలంపు ఆ ల్యాబ్ టెక్నిషియన్ సొంతం.
నగరం నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేసే ఆమెను విధుల్లోకి రావటం రిస్కుగా అభివర్ణించే వారు చాలామందే ఉంటారు. కానీ.. ఆమె మాత్రం అస్సలు పట్టించుకోరు. ప్రస్తుతం ఎనిమిదినెలల గర్భవతి అయినప్పటికీ.. కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు వెనుకాడరు. ఆమె చేసే పనిని సాహసంగా పోలిస్తే.. అస్సలు ఒప్పుకోరు. నలుగురికి సాయం చేసే అవకాశం వచ్చినప్పుడు మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమిటన్నది ఆమె మాట.
ముషీరాబాద్ ఆరోగ్య కేంద్రంలో గత నెల నుంచి కరోనా పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 మంది వరకు కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఆమె గర్భవతి కావటంతో ప్రమాదకరమైన బాధ్యతల్ని అప్పగించేందుకు అధికారులు ఇష్టపడకున్నా.. ఆమె మాత్రం వెనక్కి తగ్గకుండా విధులు నిర్వర్తించటం విశేషం. మార్చి నుంచి మే వరకు గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ గా పని చేశారు.
అనంతరం ఆమె గర్భవతి అన్న విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఆమెను ముషీరాబాద్ కు బదిలీ చేశారు. అయినప్పటికీ.. విధి నిర్వహణ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. అవకాశం ఉన్నంత వరకు తాను విధులకు హాజరవుతానని చెప్పే రత్నమాలను ఎంత అభినందించినా తక్కువేనని చెప్పక తప్పదు.
This post was last modified on August 20, 2020 3:19 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…