Trends

సోషల్ మీడియా కళ్ళలో టిల్లు భామ

ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ మారింది కానీ మొదటి భాగంలో నటించిన నేహా శెట్టి పాత్రను తక్కువ చేసి చూడలేం. సిద్ధూ జొన్నలగడ్డతో అమ్మడి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పేలింది. ప్రియుడిని చంపేసి ఆ కేసులో కూల్ గా కొత్త లవర్ ని ఇరికించిన పాత్రలో సరిగ్గా ఒదిగిపోయింది. రెండో భాగంలో ఎందుకు లేదనే ప్రశ్న హీరోకు దర్శకుడికే తెలియాలి. తన స్థానంలోనే అనుపమ పరమేశ్వరన్ వచ్చి చేరింది. అయితే ఎనిమిదేళ్ల క్రితం కన్నడలో తెరగేట్రం మొదలుపెట్టిన నేహాకి టిల్లు సక్సెస్ ఆఫర్ల వర్షం కురిపించలేదు. చెప్పుకోదగ్గ అవకాశాలూ రాలేదు.

ట్విస్టు ఏంటంటే ఒక్క పాటతో ఈ మధ్య నేహా శెట్టి సోషల్ మీడియా ట్రెండ్స్ లో బాగా నానుతోంది కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న రూల్స్ రంజన్ నుంచి ఇటీవలే చూసేయ్ చూసేయ్ పాట విడుదలైంది. ట్యూన్ చాలా క్యాచీగా ఉండటంతో పాటు శ్రేయ ఘోషల్ లయ బద్ధమైన గొంతుకు నేహా శెట్టి వయ్యారాలు ఒలికించిన తీరు మీమ్స్, షార్ట్స్, రీల్స్ రూపంలో విపరీతమైన రీచ్ తెచ్చుకుంటోంది. లిరికల్ వీడియోలో ఈమెను చూస్తున్న జనాలు పక్కన హీరో ఉన్న సంగతే మర్చిపోతున్నారు. అంత ఈ సాంగ్ ఎక్కేసింది. దెబ్బకు నేహా స్వయంగా ఇదే స్టెప్పుని వేర్వేరుగా షార్ట్స్ చేస్తోంది.

వరస ఫ్లాపుల వల్ల రూల్స్ రంజన్ మీద ఎలాంటి బజ్ లేదు. మీటర్ చేయడం కిరణ్ అబ్బవరంకి బాగా డ్యామేజ్ చేసింది. జీరో షేర్ మూవీగా డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో అతని మీద నెగటివిటీ తెచ్చి పెట్టింది. కమర్షియల్ ఉచ్చులో తానెంత తప్పు చేస్తున్నాడో దీని వల్ల అర్థమయ్యింది. లక్కీగా ఈ రూల్స్ రంజన్ మ్యూజికల్ గా మంచి పేరు తెచ్చుకోవడం కలిసొచ్చేలా ఉంది. ఇంకా విడుదల తేదీ నిర్ణయించలేదు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలలు మొత్తం ప్యాక్ అయిపోవడంతో సరైన తేదీ కోసం చూస్తున్నారు. నేహా శెట్టికి ఇది కాకుండా బెదురులంక 2012 కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. 

This post was last modified on July 30, 2023 10:55 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

31 mins ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

2 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

3 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

4 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

5 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

5 hours ago