బస్సు కింద పడి చనిపోతే వచ్చే నష్ట పరిహారంతో తన కొడుకు కళాశాల ఫీజు కట్టుకుంటాడని భావించిన ఓ తమిళనాడు మహిళ.. కదులుతున్న బస్సుకు ఎదురుగా వెళ్లి తనువు చాలించిన సంగతి తెలిసిందే. ఇది జరిగి వారం కూడా కాకముందే హైదరాబాద్లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కదులుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద తలపెట్టి చనిపోవాలని ఓ వ్యక్తి ప్రయత్నించాడు.
పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాకు చెందిన 40 ఏళ్ల బిసు రాజక్.. తన పది మంది స్నేహితులతో కలిసి బతుకుదెరువు కోసం ఈ నెల 22 (శనివారం)న హైదరాబాద్కు వచ్చారు. ఇందులో ఆరుగురు నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. బిసురాజక్, మరో ముగ్గురు కలిసి కొండాపూర్ చేరుకున్నారు. భవన నిర్మాణ కూలీలుగా పని చేయాలనుకున్నారు. సాయంత్రం కొండాపూర్ 8వ పోలీసు బెటాలియన్ రోడ్డులో ఓ దుకాణంలో చెప్పులు కోనేందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు.
కానీ ఉన్నట్లుండి బిసు రాజక్ పరుగెత్తుకు వెళ్లి అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందకు దూరాడు. అది గమనించి డ్రైవర్ బస్సు ఆపాడు. అప్పటికే టైరు కొంచెం అతని మీదకు ఎక్కింది. వెంటనే స్థానికులు బయటకు లాగి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. అతని మృతికి కుటుంబ సమస్యలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతను బస్సు కింద పడ్డ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…