బస్సు కింద పడి చనిపోతే వచ్చే నష్ట పరిహారంతో తన కొడుకు కళాశాల ఫీజు కట్టుకుంటాడని భావించిన ఓ తమిళనాడు మహిళ.. కదులుతున్న బస్సుకు ఎదురుగా వెళ్లి తనువు చాలించిన సంగతి తెలిసిందే. ఇది జరిగి వారం కూడా కాకముందే హైదరాబాద్లోనూ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కదులుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద తలపెట్టి చనిపోవాలని ఓ వ్యక్తి ప్రయత్నించాడు.
పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాకు చెందిన 40 ఏళ్ల బిసు రాజక్.. తన పది మంది స్నేహితులతో కలిసి బతుకుదెరువు కోసం ఈ నెల 22 (శనివారం)న హైదరాబాద్కు వచ్చారు. ఇందులో ఆరుగురు నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. బిసురాజక్, మరో ముగ్గురు కలిసి కొండాపూర్ చేరుకున్నారు. భవన నిర్మాణ కూలీలుగా పని చేయాలనుకున్నారు. సాయంత్రం కొండాపూర్ 8వ పోలీసు బెటాలియన్ రోడ్డులో ఓ దుకాణంలో చెప్పులు కోనేందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు.
కానీ ఉన్నట్లుండి బిసు రాజక్ పరుగెత్తుకు వెళ్లి అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కిందకు దూరాడు. అది గమనించి డ్రైవర్ బస్సు ఆపాడు. అప్పటికే టైరు కొంచెం అతని మీదకు ఎక్కింది. వెంటనే స్థానికులు బయటకు లాగి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. అతని మృతికి కుటుంబ సమస్యలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతను బస్సు కింద పడ్డ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
This post was last modified on July 25, 2023 8:57 am
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోటి వెంట కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జపం వినిపించింది.…
రేపు సాయంత్రం కల్కి 2898 ఏడి ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. సుమారు…
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితరులు అరెస్టయ్యారు.…
ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి వరస సూపర్ హిట్ల తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో…
ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాటలే కాదు.. ఆశలు కూడా కోటలు దాటుతున్నాయి. ఈ నెల 13న జరిగిన పోలింగ్లో…