Trends

ఈ సారి హైద‌రాబాద్‌లో బ‌స్సు కింద త‌ల‌

బ‌స్సు కింద ప‌డి చ‌నిపోతే వ‌చ్చే న‌ష్ట ప‌రిహారంతో త‌న కొడుకు క‌ళాశాల ఫీజు క‌ట్టుకుంటాడ‌ని భావించిన ఓ త‌మిళ‌నాడు మ‌హిళ‌.. క‌దులుతున్న బ‌స్సుకు ఎదురుగా వెళ్లి త‌నువు చాలించిన సంగ‌తి తెలిసిందే. ఇది జ‌రిగి వారం కూడా కాక‌ముందే హైద‌రాబాద్‌లోనూ ఇలాంటి ఘ‌ట‌నే వెలుగులోకి వ‌చ్చింది. క‌దులుతున్న ఆర్టీసీ బ‌స్సు వెనుక చ‌క్రాల కింద త‌ల‌పెట్టి చ‌నిపోవాల‌ని ఓ వ్య‌క్తి ప్ర‌య‌త్నించాడు.

ప‌శ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాకు చెందిన 40 ఏళ్ల బిసు రాజ‌క్.. త‌న ప‌ది మంది స్నేహితుల‌తో క‌లిసి బ‌తుకుదెరువు కోసం ఈ నెల 22 (శ‌నివారం)న హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. ఇందులో ఆరుగురు న‌గ‌రంలోని ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిపోయారు. బిసురాజ‌క్‌, మ‌రో ముగ్గురు క‌లిసి కొండాపూర్ చేరుకున్నారు. భ‌వ‌న నిర్మాణ కూలీలుగా ప‌ని చేయాల‌నుకున్నారు. సాయంత్రం కొండాపూర్ 8వ పోలీసు బెటాలియ‌న్ రోడ్డులో ఓ దుకాణంలో చెప్పులు కోనేందుకు న‌డుచుకుంటూ వెళ్తున్నారు.

కానీ ఉన్న‌ట్లుండి బిసు రాజ‌క్ ప‌రుగెత్తుకు వెళ్లి అటుగా వ‌స్తున్న ఆర్టీసీ బ‌స్సు వెనుక చక్రాల కింద‌కు దూరాడు. అది గ‌మ‌నించి డ్రైవ‌ర్ బ‌స్సు ఆపాడు. అప్ప‌టికే టైరు కొంచెం అత‌ని మీద‌కు ఎక్కింది. వెంట‌నే స్థానికులు బ‌య‌ట‌కు లాగి గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ అత‌ను మ‌ర‌ణించాడు. అత‌ని మృతికి కుటుంబ స‌మ‌స్య‌లే కార‌ణ‌మై ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. అత‌ను బ‌స్సు కింద ప‌డ్డ దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి.

This post was last modified on July 25, 2023 8:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

7 minutes ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

25 minutes ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

48 minutes ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

55 minutes ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

1 hour ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

2 hours ago