లవర్ను కలిసేందుకు తన ఊర్లో రోజూ పవర్ కట్ చేసే ఓ యువతి.. వీళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న గ్రామస్థులు.. ఆ యువకుడిని చితకబాదితే కాపాడేందుకు ప్రయత్నించిన యువతి.. చివరకు రెండు గ్రామాల పెద్దల జోక్యంతో పెళ్లితో ఒక్కటైన ఈ ప్రేమ జంట.. ఇదేం సినిమా కథ కాదు. కానీ మూవీ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని ఈ ఘటన బిహార్లోని పశ్చిమ చంపారన్లో జరిగింది.
బెటియాకు చెందిన ప్రీతి కుమారి.. పక్క గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ప్రేమించుకున్నారు. తన ప్రియుడిని రహస్యంగా కలిసేందుకు వేరే మార్గం లేక ప్రీతి ఓ పథకం వేసింది. గ్రామంలో విద్యుత్ను నిలిపివేసి.. చీకట్లో రాజ్కుమార్ను కలిసేది. ఇలా తరచూ జరుగుతుండడంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోనూ దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని గ్రామస్థులే రంగంలోకి దిగారు.
ఓ రోజు పవర్ కట్ కాగానే కారణం ఏమిటో తెలుసుకోవాలని గ్రామంలో తిరిగారు. అప్పుడే వీళ్లకు రాజ్కుమార్, ప్రీతి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. రాజ్కుమార్ను కలిసేందుకే విద్యుత్ నిలిపివేస్తున్నానని ప్రీతి చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. వెంటనే ఆ యువకుడిపై గ్రామస్థులు దాడికి దిగారు. దీనికి ప్రతీకారంగా రాజ్కుమార్ తన గ్యాంగ్ను పిలిపించాడు. దీంతో ఘర్షణ తీవ్రతరమైంది. దాడి నుంచి ప్రియుడ్ని కాపాడుకోవడం కోసం ప్రీతి ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వారం పాటు రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు రెండు గ్రామాల పెద్దల జోక్యంతో రాజ్కుమార్, ప్రీతి స్థానిక దేవాలయంలో పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమైంది.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…