లవర్ను కలిసేందుకు తన ఊర్లో రోజూ పవర్ కట్ చేసే ఓ యువతి.. వీళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న గ్రామస్థులు.. ఆ యువకుడిని చితకబాదితే కాపాడేందుకు ప్రయత్నించిన యువతి.. చివరకు రెండు గ్రామాల పెద్దల జోక్యంతో పెళ్లితో ఒక్కటైన ఈ ప్రేమ జంట.. ఇదేం సినిమా కథ కాదు. కానీ మూవీ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని ఈ ఘటన బిహార్లోని పశ్చిమ చంపారన్లో జరిగింది.
బెటియాకు చెందిన ప్రీతి కుమారి.. పక్క గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ప్రేమించుకున్నారు. తన ప్రియుడిని రహస్యంగా కలిసేందుకు వేరే మార్గం లేక ప్రీతి ఓ పథకం వేసింది. గ్రామంలో విద్యుత్ను నిలిపివేసి.. చీకట్లో రాజ్కుమార్ను కలిసేది. ఇలా తరచూ జరుగుతుండడంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోనూ దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని గ్రామస్థులే రంగంలోకి దిగారు.
ఓ రోజు పవర్ కట్ కాగానే కారణం ఏమిటో తెలుసుకోవాలని గ్రామంలో తిరిగారు. అప్పుడే వీళ్లకు రాజ్కుమార్, ప్రీతి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. రాజ్కుమార్ను కలిసేందుకే విద్యుత్ నిలిపివేస్తున్నానని ప్రీతి చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. వెంటనే ఆ యువకుడిపై గ్రామస్థులు దాడికి దిగారు. దీనికి ప్రతీకారంగా రాజ్కుమార్ తన గ్యాంగ్ను పిలిపించాడు. దీంతో ఘర్షణ తీవ్రతరమైంది. దాడి నుంచి ప్రియుడ్ని కాపాడుకోవడం కోసం ప్రీతి ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వారం పాటు రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు రెండు గ్రామాల పెద్దల జోక్యంతో రాజ్కుమార్, ప్రీతి స్థానిక దేవాలయంలో పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమైంది.
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…