లవర్ను కలిసేందుకు తన ఊర్లో రోజూ పవర్ కట్ చేసే ఓ యువతి.. వీళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న గ్రామస్థులు.. ఆ యువకుడిని చితకబాదితే కాపాడేందుకు ప్రయత్నించిన యువతి.. చివరకు రెండు గ్రామాల పెద్దల జోక్యంతో పెళ్లితో ఒక్కటైన ఈ ప్రేమ జంట.. ఇదేం సినిమా కథ కాదు. కానీ మూవీ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని ఈ ఘటన బిహార్లోని పశ్చిమ చంపారన్లో జరిగింది.
బెటియాకు చెందిన ప్రీతి కుమారి.. పక్క గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ప్రేమించుకున్నారు. తన ప్రియుడిని రహస్యంగా కలిసేందుకు వేరే మార్గం లేక ప్రీతి ఓ పథకం వేసింది. గ్రామంలో విద్యుత్ను నిలిపివేసి.. చీకట్లో రాజ్కుమార్ను కలిసేది. ఇలా తరచూ జరుగుతుండడంతో గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోనూ దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై విద్యుత్ శాఖకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని గ్రామస్థులే రంగంలోకి దిగారు.
ఓ రోజు పవర్ కట్ కాగానే కారణం ఏమిటో తెలుసుకోవాలని గ్రామంలో తిరిగారు. అప్పుడే వీళ్లకు రాజ్కుమార్, ప్రీతి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. రాజ్కుమార్ను కలిసేందుకే విద్యుత్ నిలిపివేస్తున్నానని ప్రీతి చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. వెంటనే ఆ యువకుడిపై గ్రామస్థులు దాడికి దిగారు. దీనికి ప్రతీకారంగా రాజ్కుమార్ తన గ్యాంగ్ను పిలిపించాడు. దీంతో ఘర్షణ తీవ్రతరమైంది. దాడి నుంచి ప్రియుడ్ని కాపాడుకోవడం కోసం ప్రీతి ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వారం పాటు రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు రెండు గ్రామాల పెద్దల జోక్యంతో రాజ్కుమార్, ప్రీతి స్థానిక దేవాలయంలో పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమైంది.
తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుందని ఒకవైపు మురిసిపోతూనే, ఇంకోవైపు చాలా విషయాల్లో ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు…
చాన్నాళ్ల నుంచి భారతీయ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ప్రోమో రానే వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎపిక్స్లో ఒకటైన రామాయణం ఆధారంగా…
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…