ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…ఈ హైటెక్ జమానాలో ఈ టెక్నాలజీ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఎన్నో రకాల ఆవిష్కరణలు పురుడుపోసుకుంటున్నాయి. ఇంటి పనులు మొదలు భారీ పరిశ్రమల వరకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏకంగా ఓ న్యూస్ యాంకర్ ను రూపొందించడం సంచలనం రేపుతోంది.
ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. జూలై 9న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ ‘లిసా’ను ఆవిష్కరించింది. ఏఐ సాయంతో రూపొందించిన ఈ చిట్టి న్యూస్ యాంకర్ చిట్టి పొట్టి పలుకులు పొల్లుపోకుండా పలుకుతోంది. అచ్చ ఒడిశా సంప్రదాయ చేనేత చీరలో తళుక్కున మెరుస్తూ మామూలు యాంకర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా వార్తలు చదువుతోంది. రెండు చేతులు కట్టుకొని నిల్చున్న లిసా…పర్ ఫెక్ట్ లిప్ మూమెంట్ తో వార్తలు చదువుతోంది.
OTV నెట్వర్క్ టెలివిజన్ అండ్ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఒడియా, ఇంగ్లీష్ రెండు భాషట్లో వార్తలను చదవడానికి లిసాను ప్రోగ్రాం చేశారు. లిసా పలు భాషలు మాట్లాడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ, ప్రస్తుతం ఒడియా, ఇంగ్లీష్ వార్తలను మాత్రమే చదవనుంది. ఒడియా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో లిసా ఓ సంచలనం అని, ఓ మైలురాయి అని పలువురు ప్రశంసిస్తున్నారు.
అయితే, చూడచక్కగా వార్తలు చదువుతున్న లిసా వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లిసా ఎంత బాగా వార్తలు చదివినా…మామూలు యాంకర్లకు సరిసాటి రాదని అంటున్నారు. హావభావాలు యాంకర్ల మాదిరిగా ఉన్నప్పటికీ మనుషులు చదివినట్లుగా వార్తలు చదవలేదని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్ తరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధార పడాల్సిందేనని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లిసా లాంటి వాళ్లు మహిళా న్యూస్ యాంకర్లకు ఎసరు పెట్టడం ఖాయమని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on July 10, 2023 9:25 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…