ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…ఈ హైటెక్ జమానాలో ఈ టెక్నాలజీ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఎన్నో రకాల ఆవిష్కరణలు పురుడుపోసుకుంటున్నాయి. ఇంటి పనులు మొదలు భారీ పరిశ్రమల వరకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏకంగా ఓ న్యూస్ యాంకర్ ను రూపొందించడం సంచలనం రేపుతోంది.
ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. జూలై 9న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ ‘లిసా’ను ఆవిష్కరించింది. ఏఐ సాయంతో రూపొందించిన ఈ చిట్టి న్యూస్ యాంకర్ చిట్టి పొట్టి పలుకులు పొల్లుపోకుండా పలుకుతోంది. అచ్చ ఒడిశా సంప్రదాయ చేనేత చీరలో తళుక్కున మెరుస్తూ మామూలు యాంకర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా వార్తలు చదువుతోంది. రెండు చేతులు కట్టుకొని నిల్చున్న లిసా…పర్ ఫెక్ట్ లిప్ మూమెంట్ తో వార్తలు చదువుతోంది.
OTV నెట్వర్క్ టెలివిజన్ అండ్ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఒడియా, ఇంగ్లీష్ రెండు భాషట్లో వార్తలను చదవడానికి లిసాను ప్రోగ్రాం చేశారు. లిసా పలు భాషలు మాట్లాడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ, ప్రస్తుతం ఒడియా, ఇంగ్లీష్ వార్తలను మాత్రమే చదవనుంది. ఒడియా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో లిసా ఓ సంచలనం అని, ఓ మైలురాయి అని పలువురు ప్రశంసిస్తున్నారు.
అయితే, చూడచక్కగా వార్తలు చదువుతున్న లిసా వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లిసా ఎంత బాగా వార్తలు చదివినా…మామూలు యాంకర్లకు సరిసాటి రాదని అంటున్నారు. హావభావాలు యాంకర్ల మాదిరిగా ఉన్నప్పటికీ మనుషులు చదివినట్లుగా వార్తలు చదవలేదని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్ తరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధార పడాల్సిందేనని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లిసా లాంటి వాళ్లు మహిళా న్యూస్ యాంకర్లకు ఎసరు పెట్టడం ఖాయమని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on July 10, 2023 9:25 pm
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…