ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…ఈ హైటెక్ జమానాలో ఈ టెక్నాలజీ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఎన్నో రకాల ఆవిష్కరణలు పురుడుపోసుకుంటున్నాయి. ఇంటి పనులు మొదలు భారీ పరిశ్రమల వరకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒడిశాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏకంగా ఓ న్యూస్ యాంకర్ ను రూపొందించడం సంచలనం రేపుతోంది.
ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. జూలై 9న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ ‘లిసా’ను ఆవిష్కరించింది. ఏఐ సాయంతో రూపొందించిన ఈ చిట్టి న్యూస్ యాంకర్ చిట్టి పొట్టి పలుకులు పొల్లుపోకుండా పలుకుతోంది. అచ్చ ఒడిశా సంప్రదాయ చేనేత చీరలో తళుక్కున మెరుస్తూ మామూలు యాంకర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా వార్తలు చదువుతోంది. రెండు చేతులు కట్టుకొని నిల్చున్న లిసా…పర్ ఫెక్ట్ లిప్ మూమెంట్ తో వార్తలు చదువుతోంది.
OTV నెట్వర్క్ టెలివిజన్ అండ్ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో ఒడియా, ఇంగ్లీష్ రెండు భాషట్లో వార్తలను చదవడానికి లిసాను ప్రోగ్రాం చేశారు. లిసా పలు భాషలు మాట్లాడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ, ప్రస్తుతం ఒడియా, ఇంగ్లీష్ వార్తలను మాత్రమే చదవనుంది. ఒడియా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో లిసా ఓ సంచలనం అని, ఓ మైలురాయి అని పలువురు ప్రశంసిస్తున్నారు.
అయితే, చూడచక్కగా వార్తలు చదువుతున్న లిసా వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లిసా ఎంత బాగా వార్తలు చదివినా…మామూలు యాంకర్లకు సరిసాటి రాదని అంటున్నారు. హావభావాలు యాంకర్ల మాదిరిగా ఉన్నప్పటికీ మనుషులు చదివినట్లుగా వార్తలు చదవలేదని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్ తరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధార పడాల్సిందేనని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లిసా లాంటి వాళ్లు మహిళా న్యూస్ యాంకర్లకు ఎసరు పెట్టడం ఖాయమని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on July 10, 2023 9:25 pm
ఇప్పుడంటే సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారిపోయి మంచి పాత్రలు పట్టేస్తున్నారు కానీ సీనియర్ హీరోయిన్ టబు తెలుగు ప్రేక్షకులకు నిన్నే పెళ్లాడతా…
మాములుగా ఏ భాష సినిమాలైనా థియేటర్ కు ఓటిటికి మహా అయితే రెండు నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండటం…
సరైన సినిమాలు రాలేదనే కారణం స్పష్టంగా కనిపిస్తున్నా ఎన్నికల ప్రభావం బాక్సాఫీస్ మీద తీవ్రంగా పడిన మాట వాస్తవం. వార్…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం దాదాపు ముగిసింది. ఈ వార్త రాసే సమయానికి ఇంకా కొన్ని చోట్ల మాత్రమే పోలింగ్…
మంచు విష్ణు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. కన్నప్ప. ఈ చిత్రాన్ని విష్ణు అనే కాదు.. మంచు ఫ్యామిలీనే…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…