Trends

నీహారిక విడాకుల ఘట్టం సమాప్తం

రెండు మూడు నెలల క్రితమే మెగా డాటర్ నీహారిక ఆమె భర్త చైతన్య విడిపోతున్నారనే వార్త వచ్చినప్పటికీ వ్యవహారం కోర్టులో ఉన్నందు వల్ల ఆ జంట మౌనంగా ఉంటూ వచ్చింది. విడాకులు అధికారికంగా మంజూరు కావడంతో ఎట్టకేలకు తమ బంధం ముగిసిపోయిందని, కొత్త జీవితానికి ప్రైవసీ ఇమ్మని కోరుతూ ఇద్దరూ ఒకటే మెసేజ్ పెట్టారు. ఇటీవలే జరిగిన వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్, క్లిన్ కారా నామకరణం వేడుకల్లో అసలు చైతన్య కాని, అతని కుటుంబ సభ్యుల జాడ కానీ లేకపోవడంతోనే ఈ విషయాన్ని ధృవీకరించుకున్న మీడియాకు, జనాలకు ఫైనల్ గా క్లారిటీ వచ్చేసింది.

కేవలం మూడేళ్ళకే ఈ బాండింగ్ ఇలా క్లైమాక్స్ కు వచ్చేయడం విచారకరం. గత కొన్నేళ్లలో ఇలాంటి సెలబ్రిటీ వెడ్డింగ్స్ డైవర్స్ దాకా వెళ్లడం ఫ్యాన్స్ ని కలవరపరుస్తున్నాయి. చిరంజీవి రెండో కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ ల బంధం గురించి ఇప్పటికీ అఫీషియల్ క్లారిటీ లేదు. నాగ చైతన్య సమంతాల విషయంలో ఎంత చర్చ జరిగిందో చూశాం. అట్టహాసంగా పెళ్లి చేసుకుని, జీవితాలను పంచుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత తక్కువ టైంలో సెలవు చెప్పేసుకోవడం కొత్తేమీ కాకపోయినా ఒకప్పుడు కనీసం అయిదు నుంచి పదేళ్ల జీవనం తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు.

ఇప్పుడంత ఓపిగ్గా ఎదురు చూడటం లేదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ ల నిర్మాణంలో బిజీ కావాలని చూస్తున్న నీహారిక త్వరలోనే ఓ రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సుస్మిత తండ్రి చిరంజీవి హీరోగా త్వరలోనే భారీ చిత్రం మొదలుపెట్టబోతున్న నేపథ్యంలో అన్నయ్య వరుణ్ తేజ్ తో నీహారిక సైతం ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తోందట. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీలో ఇలాంటి మ్యారేజ్ డిస్టర్ బెన్సులు తరచుగా వస్తూనే ఉన్నాయి. నీహారిక పెట్టిన సందేశాన్నే యధాతథంగా చైతన్య కూడా పోస్ట్ చేయడం గమనార్హం 

Satya

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

19 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

9 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago