Trends

టీమిండియాలో ముగ్గురు తెలుగమ్మాయిలకు చోటు

గతంతో పోలిస్తే కొంతకాలంగా భారత్ లో మహిళల క్రికెట్ కు ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్ టోర్నీని మహిళల క్రికెట్లో కూడా ప్రవేశ పెట్టడంతో కొత్తతరం మహిళా క్రికెటర్లు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటి ఎంతోమంది యువ మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు టీమిండియా తలుపుతడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9 నుంచి బంగ్లాదేశ్ లో పర్యటించనున్న టీమిండియా జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలు చోటు దక్కించుకున్నారు.

జూలై 9 నుంచి బంగ్లాదేశ్ లో టీమిండియా మహిళల జట్టు పాల్గొననుంది. మీర్ పూర్ లో జూలై 9, 11,13వ తేదీలలో టీ20 మ్యాచ్ లు, జూలై 16, 19, 22 వ తేదీలలో 3 వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో పర్యటించే మహిళల జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఆ జట్టులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు అమ్మాయిలు స్థానం దక్కించుకున్నారు. చాలాకాలంగా నిలకడగా రాణిస్తున్న మేఘన టీ20 జట్టులో తన స్థానాన్ని నిలుపుకుంది. ఇక, మరో తెలుగు అమ్మాయి, పేస్ ఆల్ రౌండర్ అంజలి శర్వాణి వన్డేతో పాటు టీ20 జట్టుకు కూడా ఎంపికైంది. మరోవైపు, స్పిన్ ఆల్ రౌండర్ బారెడ్డి అనూష కూడా వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియాకు ఎంపికైంది.

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళా క్రికెటర్లు తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఆడనున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్.. ఈ నెల 9వ తేదీ నుంచి బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ల కోసం జట్లను ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు అమ్మాయిలకు చోటు దక్కడం విశేషం.

చాన్నాళ్ల నుంచి జట్టులో ఉన్న సబ్బినేని మేఘన టీ20 జట్టులో చోటు నిలుపుకొంది. పేస్ ఆల్ రౌండర్ అంజలి శర్వాణి రెండు జట్లకు ఎంపికైంది. స్పిన్ ఆల్ రౌండర్ బారెడ్డి అనూష తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చింది. ఆమె కూడా రెండు జట్లలో చోటు దక్కించుకుంది. ఈ పర్యటనలో భాగంగా భారత మహిళలు మీర్పూర్‌‌ వేదికగా ఈ నెల 9, 11, 13వ తేదీల్లో మూడు టీ20లు, 16, 19, 22వ తేదీల్లో మూడు వన్డేల్లో బంగ్లాతో తలపడనున్నారు.

This post was last modified on July 3, 2023 4:03 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

3 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

3 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

3 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

4 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

5 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

6 hours ago