గతంతో పోలిస్తే కొంతకాలంగా భారత్ లో మహిళల క్రికెట్ కు ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్ టోర్నీని మహిళల క్రికెట్లో కూడా ప్రవేశ పెట్టడంతో కొత్తతరం మహిళా క్రికెటర్లు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటి ఎంతోమంది యువ మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు టీమిండియా తలుపుతడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9 నుంచి బంగ్లాదేశ్ లో పర్యటించనున్న టీమిండియా జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలు చోటు దక్కించుకున్నారు.
జూలై 9 నుంచి బంగ్లాదేశ్ లో టీమిండియా మహిళల జట్టు పాల్గొననుంది. మీర్ పూర్ లో జూలై 9, 11,13వ తేదీలలో టీ20 మ్యాచ్ లు, జూలై 16, 19, 22 వ తేదీలలో 3 వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో పర్యటించే మహిళల జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఆ జట్టులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు అమ్మాయిలు స్థానం దక్కించుకున్నారు. చాలాకాలంగా నిలకడగా రాణిస్తున్న మేఘన టీ20 జట్టులో తన స్థానాన్ని నిలుపుకుంది. ఇక, మరో తెలుగు అమ్మాయి, పేస్ ఆల్ రౌండర్ అంజలి శర్వాణి వన్డేతో పాటు టీ20 జట్టుకు కూడా ఎంపికైంది. మరోవైపు, స్పిన్ ఆల్ రౌండర్ బారెడ్డి అనూష కూడా వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియాకు ఎంపికైంది.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళా క్రికెటర్లు తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఆడనున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్.. ఈ నెల 9వ తేదీ నుంచి బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ల కోసం జట్లను ఎంపిక చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు అమ్మాయిలకు చోటు దక్కడం విశేషం.
చాన్నాళ్ల నుంచి జట్టులో ఉన్న సబ్బినేని మేఘన టీ20 జట్టులో చోటు నిలుపుకొంది. పేస్ ఆల్ రౌండర్ అంజలి శర్వాణి రెండు జట్లకు ఎంపికైంది. స్పిన్ ఆల్ రౌండర్ బారెడ్డి అనూష తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చింది. ఆమె కూడా రెండు జట్లలో చోటు దక్కించుకుంది. ఈ పర్యటనలో భాగంగా భారత మహిళలు మీర్పూర్ వేదికగా ఈ నెల 9, 11, 13వ తేదీల్లో మూడు టీ20లు, 16, 19, 22వ తేదీల్లో మూడు వన్డేల్లో బంగ్లాతో తలపడనున్నారు.
This post was last modified on July 3, 2023 4:03 pm
మామూలుగా ఒక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఆలస్యంగా రిలీజైతే కొంచెం బజ్ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘రాబిన్…
అతడు.. తెలుగు ప్రేక్షకులు అత్యంత మెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరసలోఉంటుందనడంలో సందేహం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్…
చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల వ్యవహార తీరుకు సంబంధించి చట్టాల్లోని నియమ నిబంధనలు పెద్దగా పనిచేయడం లేదు. చట్టాలను పక్కనపెట్టేస్తున్న కొందరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం బస్సు డ్రైవర్ గా అవతారం…
బాహుబలి తర్వాత సీక్వెల్ ట్రెండ్ అనేది ఎంత పాపులరయ్యిందో చూస్తున్నాం. కెజిఎఫ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లు దానికి మరింత…
క్రికెట్ పండగ వస్తోంది. మార్చి 22 నుంచి మే 25 దాకా రెండు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్…