Trends

ఆ ప్రమాదం జరిగిన చోటికి కామెరూన్ 30 సార్లు

ప్రఖ్యాత టైటానిక్ ఓడ మునిగి ప్రదేశానికి వెళ్లిన మినీ సబ్ మెరైన్ ‘టైటాన్’ ప్రమాదానికి గురై అందులోని ఐదుగురు సజీవ సమాధి కావడం విషాదాన్ని నింపింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ప్రమాదంపై టైటానిక్ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ స్పందించారు. సముద్రపు అడుగున టైటానిక్ మునిగిన ప్రదేశానికి సాహసోపేత యాత్ర చేయడం ఎప్పట్నుంచో జరుగుతున్నదే.

టైటానిక్ సినిమా తీసే సమయంలో కామెరూన్ ఏకంగా 30 సార్లు ఈ ప్రాంతానికి వెళ్లి వచ్చారట. ఈ అనుభవంతో తాజా ప్రమాదానికి కారణాలేంటో ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ‘‘టైటానిక్ ఘోరం జరిగిన చోటే ఈ ఘటన కూడా చోటు చేసుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అలాంటి ప్రమాదకర ప్రాంతంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. ఓషన్ గేల్ మినీ సబ్ మెరైన్‌కు అధునాతన సెన్సర్లు ఉన్నాయి. ప్రమాదానికి ముందు ఆ సబ్‌మెరైన్‌కు పగుళ్లు వచ్చి ఉండొచ్చు. ఆ సమయంలో లోపలున్న వారికి కచ్చితంగా వార్నింగ్ బెల్స్ మోగి ఉంటాయి.

వాళ్లు వెంటనే స్పందించి అదనపు లగేజీ గురించి ఆలోచించకుండా అత్యవసర ద్వారం నుంచి బయటపడే ప్రయత్నం చేసి ఉండాలి. కానీ ఈలోగా సబ్‌మెరైన్ పగిలి పోవడంతో అందరూ ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు. ఈ ప్రమాదంలో చనిపోయిన 73 ఏళ్ల హెన్రీ నాకు స్నేహితుడు. అతను పాతికేళ్లుగా నాకు తెలుసు. ఆయన మరణం విచారకరం’’ అని జేమ్స్ కామెరూన్ చెప్పాడు. కామెరూన్ మిత్రుడైన హెన్రీ టైటానిక్ మునిగిన ప్రదేశాన్ని 37 సార్లు సందర్శించాడు. 38వ ప్రయత్నంలో మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.

Satya

Recent Posts

పవన్ సభకు తెలంగాణ పోలీసుల ‘నో’

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…

47 minutes ago

రాజమౌళి లక్ష్యం… సినీ ప్రియుల స్వప్మం

తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…

3 hours ago

సేతుపతి స్థానంలో రాజశేఖర్?

దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…

3 hours ago

అరడజను సినిమాలు ‘పెద్ది’కి పోటీగా

అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…

3 hours ago

తెలంగాణలో పెద్ది టెన్షన్… కానీ ఏపీలో మొదలెట్టేశారు

తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…

3 hours ago

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ చిచ్చు రాజుకుందా…?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…

4 hours ago