Trends

బెదిరింపుల దెబ్బకు రచయితకు సెక్యూరిటీ

ఆదిపురుష్ వివాదాలు ఇప్పట్లో చల్లారేలా లేవు. బాక్సాఫీస్ వద్ద బాగా నెమ్మదించినప్పటికీ కాంట్రావర్సీలు మాత్రం ఆగడం లేదు. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ బ్యాన్ చేయాలని  ఏకంగా ప్రధాన మంత్రికి ఉత్తరం రాయడం ఇప్పటికే ప్రకంపనలు రేపింది. తాజాగా రచయిత మనోజ్ ముంతషీర్ కు చంపేస్తామని బెదిరింపులు రావడంతో ఆయనకు ముంబై పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీతాదేవి భారతదేశంలో పుట్టినట్టు అర్థం వచ్చే డైలాగులు, హనుమంతుడితో చెప్పిన తైలం సంభాషణలు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకున్నాయి.

దానికి తోడు అసలు తాము రామాయణమే తీయలేదని మనోజ్ ముంతషీర్ మొన్నో ఇంటర్వ్యూలో బుకాయించడం అగ్నికి ఆజ్యం పోసింది. కేవలం స్ఫూర్తిగా తీసుకున్నామని ఇది పూర్తిగా వేరే కథని కలరింగ్ ఇవ్వడం రివర్స్ అయ్యింది. ఎందుకంటే ఇతనే కొన్ని నెలల క్రితం ఆదిపురుష్ రాముడి గాథ ఆధారంగా రూపొందుతోందని సెలవిచ్చాడు. దెబ్బకు ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ ద్వారా మనోజ్ కు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఈయన రాతల వల్లే నేపాల్ లో ఏకంగా బాలీవుడ్ సినిమాలనే బ్యాన్ చేసే పరిస్థితి వెళ్ళింది. సో రక్షణ అవసరమేనని చెప్పాలి

అయినా దర్శకుడి సమ్మతి లేకుండా ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాయకుండా ఏ రచయిత స్వంత తెలివి తేటలు ఎక్కువ చూపించలేడు. అలాంటప్పుడు ఓం రౌత్ కూడా లక్ష్యమేనని నెటిజెన్లు లాజిక్ తీస్తున్నారు. ఆలా అని ఈయనకు వార్నింగ్స్ రాలేదని కాదు. వచ్చాయి. ఆదిపురుష్ బ్యాన్ పట్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే సూచనలు లేవు కానీ ఈ వివాదాలన్నీ మాట్లాడుకోవడానికి తప్ప కలెక్షన్ల పరంగా ఎంత వరకు ఉపయోగపడతాయన్నది కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది. వీటి వల్లే ముందుగా ప్లాన్ చేసుకున్న ఇంటర్వ్యూలన్నీ ఆదిపురుష్ టీమ్ రద్దు చేసుకుంది 

This post was last modified on June 20, 2023 11:52 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

కాస్త సౌండ్ పెంచు పురుషోత్తమా

యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…

3 mins ago

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

1 hour ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

3 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

4 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

4 hours ago