వందల మంది ప్రాణాల్ని తీసిన ఒడిశా విషాదానికి సంబంధించిన మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ ఘోర ఘటనలో మొత్తం 278 మంది మరణించగా.. అందులో 40 మంది కేవలం కరెంట్ షాక్ తో మరణించినట్లుగా అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు.
ఈ ఉదంతంపై కొందరు అధికారులు చెబుతున్నదేమంటే.. ‘గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టిన తర్వాత ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలు పక్కనున్న ట్రాక్ మీద పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్ మీద బెంగళూరు – హౌవ్ డా రైలు వెళుతుండగా చివరి నాలుగు బోగీలపై బోగీలు పడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఓవర్ హెడ్ లో టెన్షన్ లైన్ విద్యుత్ తీగలు తెగి బోగీల మీద పడ్దాయి. దీంతో విద్యుద్ఘాతం చోటు చేసుకుంది’’ అని వివరించారు.
బోగీల మధ్య చాలా మంది నలిగిపోవటంతో డెడ్ బాడీలను గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైనట్లు చెబుతున్నారు. అయితే.. 40 డెడ్ బాడీల మీద ఎలాంటి గాయాలు లేకపోవటాన్ని గుర్తించారు. వారి పోస్టుమార్టం రిపోర్టులో వారంతా కరెంటు షాక్ కు గురై చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కుట్ర ఆరోపణల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. నేడు ఘటనాస్థలానికి వెళ్లిన అధికారులు దర్యాప్తు షురూ చేశారు.
This post was last modified on June 6, 2023 6:41 pm
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…
ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడంలోనే అసలైన గౌరవం, మర్యాద ఉంటాయని మరోసారి ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి…