Trends

ఒడిశా ఘోరంలో కరెంటు షాక్ తోనే 40 మంది చనిపోయారట

వందల మంది ప్రాణాల్ని తీసిన ఒడిశా విషాదానికి సంబంధించిన మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ ఘోర ఘటనలో మొత్తం 278 మంది మరణించగా.. అందులో 40 మంది కేవలం కరెంట్ షాక్ తో మరణించినట్లుగా అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు.

ఈ ఉదంతంపై కొందరు అధికారులు చెబుతున్నదేమంటే.. ‘గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టిన తర్వాత ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలు పక్కనున్న ట్రాక్ మీద పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్ మీద బెంగళూరు – హౌవ్ డా రైలు వెళుతుండగా చివరి నాలుగు బోగీలపై బోగీలు పడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఓవర్ హెడ్ లో టెన్షన్ లైన్ విద్యుత్ తీగలు తెగి బోగీల మీద పడ్దాయి. దీంతో విద్యుద్ఘాతం చోటు చేసుకుంది’’ అని వివరించారు.

బోగీల మధ్య చాలా మంది నలిగిపోవటంతో డెడ్ బాడీలను గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైనట్లు చెబుతున్నారు. అయితే.. 40 డెడ్ బాడీల మీద ఎలాంటి గాయాలు లేకపోవటాన్ని గుర్తించారు. వారి పోస్టుమార్టం రిపోర్టులో వారంతా కరెంటు షాక్ కు గురై చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కుట్ర ఆరోపణల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. నేడు ఘటనాస్థలానికి వెళ్లిన అధికారులు దర్యాప్తు షురూ చేశారు.

This post was last modified on June 6, 2023 6:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

7 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago