వందల మంది ప్రాణాల్ని తీసిన ఒడిశా విషాదానికి సంబంధించిన మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ ఘోర ఘటనలో మొత్తం 278 మంది మరణించగా.. అందులో 40 మంది కేవలం కరెంట్ షాక్ తో మరణించినట్లుగా అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు.
ఈ ఉదంతంపై కొందరు అధికారులు చెబుతున్నదేమంటే.. ‘గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టిన తర్వాత ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలు పక్కనున్న ట్రాక్ మీద పడ్డాయి. అదే సమయంలో ఆ ట్రాక్ మీద బెంగళూరు – హౌవ్ డా రైలు వెళుతుండగా చివరి నాలుగు బోగీలపై బోగీలు పడ్డాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఓవర్ హెడ్ లో టెన్షన్ లైన్ విద్యుత్ తీగలు తెగి బోగీల మీద పడ్దాయి. దీంతో విద్యుద్ఘాతం చోటు చేసుకుంది’’ అని వివరించారు.
బోగీల మధ్య చాలా మంది నలిగిపోవటంతో డెడ్ బాడీలను గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైనట్లు చెబుతున్నారు. అయితే.. 40 డెడ్ బాడీల మీద ఎలాంటి గాయాలు లేకపోవటాన్ని గుర్తించారు. వారి పోస్టుమార్టం రిపోర్టులో వారంతా కరెంటు షాక్ కు గురై చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కుట్ర ఆరోపణల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. నేడు ఘటనాస్థలానికి వెళ్లిన అధికారులు దర్యాప్తు షురూ చేశారు.
This post was last modified on June 6, 2023 6:41 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…