2020 మే 8.. వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకురావడం కోసం మొదలుపెట్టిన బృహత్ కార్యక్రమంలో భాగంగా దుబాయ్ నుంచి కోళికోడ్కు తొలి విమానం వచ్చింది. ఆ విమాన పైలట్లకు కోళికోడ్లో ఘన స్వాగతం లభించింది. అందులో అఖిలేష్ కుమార్ కూడా ఒకడు. కరతాళ ధ్వనులతో అతడిని స్వాగతించారు.
కరోనా ముప్పును పట్టించుకోకుండా విధులు నిర్వర్తించడమే ఆ ప్రశంసలకు కారణం. ఆ తర్వాత కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అతను వందే భారత్ మిషన్లో భాగంగా ఎయిర్ ఇండియా సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా దుబాయ్ నుంచి కోళికోడ్కు వచ్చిన విమానంలోనూ అతను ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయింది.
170 మందికి పైగా ప్రాణాలు కాపాడి.. పైలట్ దీపక్ సాథెతో పాటు కో పైలట్ అయిన అఖిలేష్ కూడా ప్రాణాలు విడిచాడు. మూడు నెలల కిందట సాదర స్వాగతం అందుకుంటూ సగర్వంగా విమానం నుంచి బయటికి వచ్చిన అఖిలేష్ ఇప్పుడు విగత జీవుడై బయటికి రావడం అందరినీ కలచి వేస్తోంది.
దీనికి మించిన బాధాకరమైన విషయం ఏంటంటే.. అఖిలేష్ భార్య మేఘా ఇంకో రెండు వారాల్లో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. నిండు గర్భిణిగా ఉన్న ఆమె అఖిలేష్ మరణ వార్త విని తట్టుకోలేకపోతున్నారు. ఇంకొన్ని రోజుల్లో బిడ్డను సంతోషంగా ఈ లోకంలోకి ఆహ్వానించాల్సిన ఆ కుటుంబం ఇప్పుడు అఖిలేష్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అఖిలేష్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్లోని మథుర. 2017లో అతను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ‘ఫస్ట్ ఆఫీసర్’గా చేరారు.
This post was last modified on August 10, 2020 3:10 pm
ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…
సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…
బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్లో ఎన్నికల…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…