Trends

‘కోళికోడ్’ కో పైలట్ కథ తెలిస్తే కన్నీళ్లే..

2020 మే 8.. వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకురావడం కోసం మొదలుపెట్టిన బృహత్ కార్యక్రమంలో భాగంగా దుబాయ్ నుంచి కోళికోడ్‌కు తొలి విమానం వచ్చింది. ఆ విమాన పైలట్లకు కోళికోడ్‌లో ఘన స్వాగతం లభించింది. అందులో అఖిలేష్ కుమార్ కూడా ఒకడు. కరతాళ ధ్వనులతో అతడిని స్వాగతించారు.

కరోనా ముప్పును పట్టించుకోకుండా విధులు నిర్వర్తించడమే ఆ ప్రశంసలకు కారణం. ఆ తర్వాత కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అతను వందే భారత్ మిషన్లో భాగంగా ఎయిర్ ఇండియా సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా దుబాయ్ నుంచి కోళికోడ్‌కు వచ్చిన విమానంలోనూ అతను ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయింది.

170 మందికి పైగా ప్రాణాలు కాపాడి.. పైలట్ దీపక్ సాథెతో పాటు కో పైలట్ అయిన అఖిలేష్ కూడా ప్రాణాలు విడిచాడు. మూడు నెలల కిందట సాదర స్వాగతం అందుకుంటూ సగర్వంగా విమానం నుంచి బయటికి వచ్చిన అఖిలేష్ ఇప్పుడు విగత జీవుడై బయటికి రావడం అందరినీ కలచి వేస్తోంది.

దీనికి మించిన బాధాకరమైన విషయం ఏంటంటే.. అఖిలేష్ భార్య మేఘా ఇంకో రెండు వారాల్లో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. నిండు గర్భిణిగా ఉన్న ఆమె అఖిలేష్ మరణ వార్త విని తట్టుకోలేకపోతున్నారు. ఇంకొన్ని రోజుల్లో బిడ్డను సంతోషంగా ఈ లోకంలోకి ఆహ్వానించాల్సిన ఆ కుటుంబం ఇప్పుడు అఖిలేష్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అఖిలేష్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని మథుర. 2017లో అతను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ‘ఫస్ట్ ఆఫీసర్’గా చేరారు.

This post was last modified on August 10, 2020 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

25 minutes ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

35 minutes ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

38 minutes ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

55 minutes ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

1 hour ago

టికెట్ రేట్లలో పెంచిన 100 రూపాయల్లో నిర్మాతకి వచ్చేది అంతేనా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…

2 hours ago