Trends

రూ.500 నోట్ కూడా ఔట్?

రిజర్వ్ బ్యాంక్ తొందరలోనే మరో కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లుంది. ఈమధ్యనే రు. 2 వేల నోట్లను రద్దుచేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొందరలోనే రు. 500 నోట్లను కూడా రద్దుచేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే మార్కెట్లో రు. 2 వేల నకిలీ నోట్లకు మించి రు. 500 నకిలీ నోట్లు చెలామణి అవుతున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆందోళన వ్యక్తంచేసింది. దాంతో రు. 500 నోట్లను కూడా రద్దుచేయటం ఒకటే మార్గమని డిసైడ్ అయ్యిందట.

ఎప్పుడైతే రు. 2 వేల నోట్ల ఉపసంహరించిందో అప్పటినుండే రు. 500 నకిలీ నోట్లు చెలామణలోకి వచ్చేసిందని బ్యాంకు గుర్తించింది. రు. 2 వేల నోట్ల రద్దులో రిజర్వబ్యాంకు ఒకటి అనుకుంటే గ్రౌండ్ లెవల్లో మరోటి జరుగుతోంది. నోట్లను రద్దుచేయగానే మార్కెట్లో ఉన్న రు. 3.16 లక్షల కోట్ల డబ్బంతా బ్యాంకులకు వచ్చేస్తుందని అనుకున్నది. అయితే రద్దయిన రు. 2 వేల నోట్లలో బ్యాంకులకు చేరింది 20 శాతం మాత్రమేనట. మరి మిగిలిన నోట్లన్నీ ఏమయ్యాయి ? ఏమయ్యాయయంటే నగల దుకాణాలు, రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, పెట్రోల్ బంకులకు చేరుతున్నాయి.

రు. 2 వేల నోట్లు రద్దుకాగానే ఒక్కసారిగి రు. 500 నోట్ల చెలామణి పెరిగిపోయిందట. దీన్ని రిజర్వ్ బ్యాంకు జాగ్రత్తగా గమనిస్తే అంతకుముందు మార్కెట్ చెలామణితో పోల్చితే పెద్దనోట్ల రద్దుతర్వాతే రు. 500 నోట్ల చెలామణి పెరిగిపోయిందని అర్ధమైందట.  కారణం ఏమిటంటే రు. 500 నోట్లలో నకిలీ నోట్లు 5 రెట్లు మార్కోట్లోకి వచ్చేశాయట. ఇపుడు చెలామణిలో ఉన్న రు. 500 నోట్లలో 20 శాతం నకిలీ నోట్లేనని రిజర్వ్ బ్యాంకు గుర్తించిందట.

దేశాన్ని అస్ధిరపరిచేందుకే పాకిస్ధాన్ చేస్తున్న కుట్రగా మన ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. మన కరెన్సీని పాకిస్ధాన్ పెద్దఎత్తున ముద్రించి నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా మనదేశంలోకి చేరవేస్తున్నట్లు నిఘావర్గాలు గమనించాయి. దీన్ని అడ్డుకునేందుకే రు. 500 నోట్లను  కూడా రద్దుచేయాలని రిజర్వ్ బ్యాంకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి రద్దు ముహూర్తం ఎప్పుడో చూడాలి. 

This post was last modified on June 2, 2023 11:44 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

8 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

25 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

1 hour ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago