దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. రిలయన్స్ అధినేతగా సుపరిచితుడైన ముకేశ్ అంబానీ-నీతాల దంపతుల పెద్ద కొడుకు అకాశ్ అంబానీ -శ్లోకా మెహతాలు మరోసారి తల్లిదండ్రులయ్యారు. బుధవారం శ్లోకా మెహతా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది.
2019లో అకాశ్ అంబానీకి, శ్లోకా మెహతాకు వివాహమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగటం.. అప్పట్లో అన్నీ మీడియాలోనూ వీరి పెళ్లి వేళ చోటు చేసుకున్న హడావుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవటం తెలిసిందే. మొదటి కాన్పులో మగబిడ్డ పుట్టగా.. రెండోకాన్పులో అమ్మాయి పుట్టటంతో అంబానీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. మొదటి సంతానం 2020 డిసెంబరులో అబ్బాయి పుట్టారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో బేబీ బంప్ తో శ్లోకా కనిపించారు. నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆమె గర్భవతి అన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఈ మధ్యనే కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ది వినాయక ఆలయాన్నిదర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. తన పెద్ద కుమారుడికి రెండో సంతానంగా అమ్మాయి పుట్టటంతో అంబానీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది.
This post was last modified on June 1, 2023 3:59 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…