దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. రిలయన్స్ అధినేతగా సుపరిచితుడైన ముకేశ్ అంబానీ-నీతాల దంపతుల పెద్ద కొడుకు అకాశ్ అంబానీ -శ్లోకా మెహతాలు మరోసారి తల్లిదండ్రులయ్యారు. బుధవారం శ్లోకా మెహతా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది.
2019లో అకాశ్ అంబానీకి, శ్లోకా మెహతాకు వివాహమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగటం.. అప్పట్లో అన్నీ మీడియాలోనూ వీరి పెళ్లి వేళ చోటు చేసుకున్న హడావుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవటం తెలిసిందే. మొదటి కాన్పులో మగబిడ్డ పుట్టగా.. రెండోకాన్పులో అమ్మాయి పుట్టటంతో అంబానీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. మొదటి సంతానం 2020 డిసెంబరులో అబ్బాయి పుట్టారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో బేబీ బంప్ తో శ్లోకా కనిపించారు. నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆమె గర్భవతి అన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఈ మధ్యనే కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ది వినాయక ఆలయాన్నిదర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. తన పెద్ద కుమారుడికి రెండో సంతానంగా అమ్మాయి పుట్టటంతో అంబానీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది.
This post was last modified on June 1, 2023 3:59 pm
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…