దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. రిలయన్స్ అధినేతగా సుపరిచితుడైన ముకేశ్ అంబానీ-నీతాల దంపతుల పెద్ద కొడుకు అకాశ్ అంబానీ -శ్లోకా మెహతాలు మరోసారి తల్లిదండ్రులయ్యారు. బుధవారం శ్లోకా మెహతా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది.
2019లో అకాశ్ అంబానీకి, శ్లోకా మెహతాకు వివాహమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగటం.. అప్పట్లో అన్నీ మీడియాలోనూ వీరి పెళ్లి వేళ చోటు చేసుకున్న హడావుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవటం తెలిసిందే. మొదటి కాన్పులో మగబిడ్డ పుట్టగా.. రెండోకాన్పులో అమ్మాయి పుట్టటంతో అంబానీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. మొదటి సంతానం 2020 డిసెంబరులో అబ్బాయి పుట్టారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో బేబీ బంప్ తో శ్లోకా కనిపించారు. నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆమె గర్భవతి అన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఈ మధ్యనే కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ది వినాయక ఆలయాన్నిదర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. తన పెద్ద కుమారుడికి రెండో సంతానంగా అమ్మాయి పుట్టటంతో అంబానీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది.
This post was last modified on June 1, 2023 3:59 pm
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…
ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…
తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ దఫా కూడా.. సిట్…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…