దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. రిలయన్స్ అధినేతగా సుపరిచితుడైన ముకేశ్ అంబానీ-నీతాల దంపతుల పెద్ద కొడుకు అకాశ్ అంబానీ -శ్లోకా మెహతాలు మరోసారి తల్లిదండ్రులయ్యారు. బుధవారం శ్లోకా మెహతా పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది.
2019లో అకాశ్ అంబానీకి, శ్లోకా మెహతాకు వివాహమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగటం.. అప్పట్లో అన్నీ మీడియాలోనూ వీరి పెళ్లి వేళ చోటు చేసుకున్న హడావుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవటం తెలిసిందే. మొదటి కాన్పులో మగబిడ్డ పుట్టగా.. రెండోకాన్పులో అమ్మాయి పుట్టటంతో అంబానీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. మొదటి సంతానం 2020 డిసెంబరులో అబ్బాయి పుట్టారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో బేబీ బంప్ తో శ్లోకా కనిపించారు. నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆమె గర్భవతి అన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఈ మధ్యనే కుటుంబ సభ్యులతో కలిసి ముంబయిలోని సిద్ది వినాయక ఆలయాన్నిదర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. తన పెద్ద కుమారుడికి రెండో సంతానంగా అమ్మాయి పుట్టటంతో అంబానీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది.
This post was last modified on June 1, 2023 3:59 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…