ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో…ఇప్పుడు అందరి చూపు వ్యాక్సిన్పైనే. ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా వివిధ సంస్థలు క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు తీసుకువస్తున్నాయనే ప్రచారం ఎందరిలోనో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్పర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యం కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు నిర్వహిస్తోంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్. దీని పనితీరును పరిశీలించడంలో భాగంగా జరుగుతున్న పరిశోధనల్లో రెండో, మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ చేసుకోవచ్చంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రూ.225కే కరోనా వ్యాక్సిన్ అందజేయనున్నట్లు సీరమ్ ఇండియా ప్రకటించింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సాగిస్తున్న ఈ పరిశోధనలకు సంబంధించి యూకేలో ఈ వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా… బ్రెజిల్లో మూడో దశ, దక్షిణాఫ్రికాలో తొలి, రెండో దశలో మనుషులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ వ్యాక్సిన్ ను రూ.225కే అందిస్తున్నట్లు సీరమ్ ఇండియా ప్రకటించింది.
ఈ వ్యాక్సిన్ ను 92 దేశాలకు అందించేందుకు సుమారు 100 మిలియన్ల వ్యాక్సిన్ లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఈ తీపికబురు ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తించనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 8, 2020 2:25 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…