ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో…ఇప్పుడు అందరి చూపు వ్యాక్సిన్పైనే. ఈ మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా వివిధ సంస్థలు క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు తీసుకువస్తున్నాయనే ప్రచారం ఎందరిలోనో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్పర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యం కరోనా వ్యాక్సిన్ పై పరిశోధనలు నిర్వహిస్తోంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్. దీని పనితీరును పరిశీలించడంలో భాగంగా జరుగుతున్న పరిశోధనల్లో రెండో, మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ చేసుకోవచ్చంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రూ.225కే కరోనా వ్యాక్సిన్ అందజేయనున్నట్లు సీరమ్ ఇండియా ప్రకటించింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సాగిస్తున్న ఈ పరిశోధనలకు సంబంధించి యూకేలో ఈ వ్యాక్సిన్ రెండో దశ, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా… బ్రెజిల్లో మూడో దశ, దక్షిణాఫ్రికాలో తొలి, రెండో దశలో మనుషులపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ వ్యాక్సిన్ ను రూ.225కే అందిస్తున్నట్లు సీరమ్ ఇండియా ప్రకటించింది.
ఈ వ్యాక్సిన్ ను 92 దేశాలకు అందించేందుకు సుమారు 100 మిలియన్ల వ్యాక్సిన్ లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఈ తీపికబురు ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తించనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 8, 2020 2:25 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…