నిన్న అమెరికా.. ఇప్పడు బ్రిటన్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధానికి సమీపంలో ట్రక్కు దాడి మరవకవముందే.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసంపై కూడా ఈ తరహా ఘటన జరగడం కలకలం రేపింది. లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్ గేట్ను.. ఓ వ్యక్తి కారుతో ఢీ కొట్టడం సంచలనంగా మారింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.20 సమయంలో జరిగిందని వెల్లడించా రు. అయితే ఇది ఉగ్ర కుట్ర కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును కారు ఢీకొన్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ వీధిలో వాహనాల రాకపోకలను నిలిపివేసి.. ఇంకా ఎవరైనా దుండగులు ఉన్నారేమోనని తనిఖీలు చేపట్టారు. అనుమానించాల్సిన పరిస్థితి కనపడకపోవడం వల్ల దిగ్బంధాన్ని తొలగించారు.
కారు దాడి జరిగిన సమయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన కార్యాలయంలో ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన కొద్ది సమయం వరకూ అధికారులెవరూ బయటకు రావొద్దని పోలీసులు ఆదేశించారు. బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ ముందు ఎల్లవేళలా గట్టి బందోబస్తు ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. బ్రిటన్ పార్లమెంట్కు 10 డౌనింగ్ స్ట్రీట్ షార్ట్కట్ మార్గం. డౌనింగ్ స్ట్రీట్ ప్రవేశంలో 1989లోనే భారీ గేట్లను ఏర్పాటు చేశారు.
అప్పట్లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్లో బాంబు దాడులకు పాల్పడటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. 1991లో అప్పటి ప్రధాని నివాసంపై మరోసారి మోర్టార్ షెల్స్తో దాడి జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు. రక్షణ వలయంగా భారీ గేట్లు, భద్రతా సిబ్బంది ఉంటారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఆ మార్గంలోకి కారు వెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే తాజా ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on May 26, 2023 10:46 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…