విశాఖపట్నంలో దారుణ హత్య జరిగింది. తాను పరిచయం చేసిన స్నేహితుడితో చనువుగా ఉంటుందన్న కోపంతో చంపేసిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. అసలేమైందంటే.. అనకాపల్లి జిల్లా పరవాడకు చెందిన గోపాల్ పెయింటర్. పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటాడు.
అతనికి తమ ప్రాంతానికే చెందిన 28 ఏళ్ల వివాహిత అయిన శ్రావణితో పరిచయం ఏర్పడింది. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. ఆమె జగదాంబ కూడలిలోని ఒక షాపులో పని చేస్తోంది. వీరి స్నేహం తర్వాతి లెవెల్ కు వెళ్లింది. దీంతో.. వారిద్దరూ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఆర్నెల్లుగా కలిసి ఉంటున్నారు.
ఈ క్రమంలో తన స్నేహితుడైన వెంకటేశ్ ను ఆమెకు పరిచయం చేశాడు. కొంతకాలంగా శ్రావణి.. తన స్నేహితుడు వెంకటేశ్ తో ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం మొదలైంది. దీంతో.. వారిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. ఈ వ్యవహారంపై మాట్లాడుకుందామంటూ శ్రావణికి.. వెంకటేశ్ లకు ఫోన్ చేసి చెప్పాడు గోపాల్. అనంతరం.. వారు ముగ్గురు కలిసి ఒకే వాహనం మీద ఆర్కే బీచ్ కు వెళ్లారు. అక్కడ వారు మాట్లాడుతుండగా.. పోలీసులు అక్కడకు వచ్చి వెళ్లిపోవాలని చెప్పటంతో వారు తిరిగి బయలుదేరారు.
ఆ క్రమంలో ఆర్కే బీచ్ కు సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఒక ఇంటి వద్దకు వెళ్లారు. శ్రావణితో తాను ఒంటరిగా మాట్లాడాలని గోపాల్ చెప్పటంతో వెంకటేశ్ కాస్తంత దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో వెంకటేశ్ తో శ్రావణి చనువుగా ఉంటున్న విషయం వారి మధ్య చర్చకు రావటం.. అది కాస్తా వాగ్వాదం వరకు వెళ్లింది. ఈ క్రమంలో తీవ్ర కోపానికి గురైన గోపాల్.. శ్రావణి గొంతు నులిమాడు.
దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించింది. విగతజీవిగా ఉన్న శ్రావణిని అక్కడే విడిచి పెట్టిన గోపాల్.. తానిప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లి.. నేరుగా గాజావాక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తాను చేసిన పని చెప్పి లొంగిపోయాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on May 21, 2023 12:40 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…