విశాఖపట్నంలో దారుణ హత్య జరిగింది. తాను పరిచయం చేసిన స్నేహితుడితో చనువుగా ఉంటుందన్న కోపంతో చంపేసిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. అసలేమైందంటే.. అనకాపల్లి జిల్లా పరవాడకు చెందిన గోపాల్ పెయింటర్. పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటాడు.
అతనికి తమ ప్రాంతానికే చెందిన 28 ఏళ్ల వివాహిత అయిన శ్రావణితో పరిచయం ఏర్పడింది. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. ఆమె జగదాంబ కూడలిలోని ఒక షాపులో పని చేస్తోంది. వీరి స్నేహం తర్వాతి లెవెల్ కు వెళ్లింది. దీంతో.. వారిద్దరూ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఆర్నెల్లుగా కలిసి ఉంటున్నారు.
ఈ క్రమంలో తన స్నేహితుడైన వెంకటేశ్ ను ఆమెకు పరిచయం చేశాడు. కొంతకాలంగా శ్రావణి.. తన స్నేహితుడు వెంకటేశ్ తో ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం మొదలైంది. దీంతో.. వారిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. ఈ వ్యవహారంపై మాట్లాడుకుందామంటూ శ్రావణికి.. వెంకటేశ్ లకు ఫోన్ చేసి చెప్పాడు గోపాల్. అనంతరం.. వారు ముగ్గురు కలిసి ఒకే వాహనం మీద ఆర్కే బీచ్ కు వెళ్లారు. అక్కడ వారు మాట్లాడుతుండగా.. పోలీసులు అక్కడకు వచ్చి వెళ్లిపోవాలని చెప్పటంతో వారు తిరిగి బయలుదేరారు.
ఆ క్రమంలో ఆర్కే బీచ్ కు సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఒక ఇంటి వద్దకు వెళ్లారు. శ్రావణితో తాను ఒంటరిగా మాట్లాడాలని గోపాల్ చెప్పటంతో వెంకటేశ్ కాస్తంత దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో వెంకటేశ్ తో శ్రావణి చనువుగా ఉంటున్న విషయం వారి మధ్య చర్చకు రావటం.. అది కాస్తా వాగ్వాదం వరకు వెళ్లింది. ఈ క్రమంలో తీవ్ర కోపానికి గురైన గోపాల్.. శ్రావణి గొంతు నులిమాడు.
దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించింది. విగతజీవిగా ఉన్న శ్రావణిని అక్కడే విడిచి పెట్టిన గోపాల్.. తానిప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లి.. నేరుగా గాజావాక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తాను చేసిన పని చెప్పి లొంగిపోయాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on May 21, 2023 12:40 pm
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…