విశాఖపట్నంలో దారుణ హత్య జరిగింది. తాను పరిచయం చేసిన స్నేహితుడితో చనువుగా ఉంటుందన్న కోపంతో చంపేసిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. అసలేమైందంటే.. అనకాపల్లి జిల్లా పరవాడకు చెందిన గోపాల్ పెయింటర్. పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటాడు.
అతనికి తమ ప్రాంతానికే చెందిన 28 ఏళ్ల వివాహిత అయిన శ్రావణితో పరిచయం ఏర్పడింది. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. ఆమె జగదాంబ కూడలిలోని ఒక షాపులో పని చేస్తోంది. వీరి స్నేహం తర్వాతి లెవెల్ కు వెళ్లింది. దీంతో.. వారిద్దరూ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఆర్నెల్లుగా కలిసి ఉంటున్నారు.
ఈ క్రమంలో తన స్నేహితుడైన వెంకటేశ్ ను ఆమెకు పరిచయం చేశాడు. కొంతకాలంగా శ్రావణి.. తన స్నేహితుడు వెంకటేశ్ తో ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం మొదలైంది. దీంతో.. వారిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. ఈ వ్యవహారంపై మాట్లాడుకుందామంటూ శ్రావణికి.. వెంకటేశ్ లకు ఫోన్ చేసి చెప్పాడు గోపాల్. అనంతరం.. వారు ముగ్గురు కలిసి ఒకే వాహనం మీద ఆర్కే బీచ్ కు వెళ్లారు. అక్కడ వారు మాట్లాడుతుండగా.. పోలీసులు అక్కడకు వచ్చి వెళ్లిపోవాలని చెప్పటంతో వారు తిరిగి బయలుదేరారు.
ఆ క్రమంలో ఆర్కే బీచ్ కు సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఒక ఇంటి వద్దకు వెళ్లారు. శ్రావణితో తాను ఒంటరిగా మాట్లాడాలని గోపాల్ చెప్పటంతో వెంకటేశ్ కాస్తంత దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో వెంకటేశ్ తో శ్రావణి చనువుగా ఉంటున్న విషయం వారి మధ్య చర్చకు రావటం.. అది కాస్తా వాగ్వాదం వరకు వెళ్లింది. ఈ క్రమంలో తీవ్ర కోపానికి గురైన గోపాల్.. శ్రావణి గొంతు నులిమాడు.
దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించింది. విగతజీవిగా ఉన్న శ్రావణిని అక్కడే విడిచి పెట్టిన గోపాల్.. తానిప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లి.. నేరుగా గాజావాక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తాను చేసిన పని చెప్పి లొంగిపోయాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on May 21, 2023 12:40 pm
ఏదైనా మితంగా చేస్తే బాగుంటుంది. అతి చేస్తే మొహం మొత్తుతుంది. రీ రిలీజుల వ్యవహారంలో డిస్ట్రిబ్యూటర్ల ధోరణి చూస్తే ఇలాగే…
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…