విశాఖపట్నంలో దారుణ హత్య జరిగింది. తాను పరిచయం చేసిన స్నేహితుడితో చనువుగా ఉంటుందన్న కోపంతో చంపేసిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. అసలేమైందంటే.. అనకాపల్లి జిల్లా పరవాడకు చెందిన గోపాల్ పెయింటర్. పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటాడు.
అతనికి తమ ప్రాంతానికే చెందిన 28 ఏళ్ల వివాహిత అయిన శ్రావణితో పరిచయం ఏర్పడింది. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. ఆమె జగదాంబ కూడలిలోని ఒక షాపులో పని చేస్తోంది. వీరి స్నేహం తర్వాతి లెవెల్ కు వెళ్లింది. దీంతో.. వారిద్దరూ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఆర్నెల్లుగా కలిసి ఉంటున్నారు.
ఈ క్రమంలో తన స్నేహితుడైన వెంకటేశ్ ను ఆమెకు పరిచయం చేశాడు. కొంతకాలంగా శ్రావణి.. తన స్నేహితుడు వెంకటేశ్ తో ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం మొదలైంది. దీంతో.. వారిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. ఈ వ్యవహారంపై మాట్లాడుకుందామంటూ శ్రావణికి.. వెంకటేశ్ లకు ఫోన్ చేసి చెప్పాడు గోపాల్. అనంతరం.. వారు ముగ్గురు కలిసి ఒకే వాహనం మీద ఆర్కే బీచ్ కు వెళ్లారు. అక్కడ వారు మాట్లాడుతుండగా.. పోలీసులు అక్కడకు వచ్చి వెళ్లిపోవాలని చెప్పటంతో వారు తిరిగి బయలుదేరారు.
ఆ క్రమంలో ఆర్కే బీచ్ కు సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఒక ఇంటి వద్దకు వెళ్లారు. శ్రావణితో తాను ఒంటరిగా మాట్లాడాలని గోపాల్ చెప్పటంతో వెంకటేశ్ కాస్తంత దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో వెంకటేశ్ తో శ్రావణి చనువుగా ఉంటున్న విషయం వారి మధ్య చర్చకు రావటం.. అది కాస్తా వాగ్వాదం వరకు వెళ్లింది. ఈ క్రమంలో తీవ్ర కోపానికి గురైన గోపాల్.. శ్రావణి గొంతు నులిమాడు.
దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించింది. విగతజీవిగా ఉన్న శ్రావణిని అక్కడే విడిచి పెట్టిన గోపాల్.. తానిప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లి.. నేరుగా గాజావాక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తాను చేసిన పని చెప్పి లొంగిపోయాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on May 21, 2023 12:40 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ సంకటం ఏర్పడింది. 2023లో రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ మూసీ…
సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులకు ఎక్కువ, క్యారెక్టర్ నటులకు తక్కువ అనిపించేలా కొందరుంటారు. వాళ్లు చాలా సినిమాల్లో కనిపిస్తారు కానీ.. వారి పాత్రలకు తగిన…
ఢిల్లీలో చేపట్టిన నీట్ నిరసనలకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అరెస్టు చేసిన వారిని…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. సోమవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు…
సినిమా అనేది పబ్లిక్ ప్లాట్ ఫార్మ్. ఒక్కసారి థియేటర్లో వచ్చాక దాని మీద అభిప్రాయం వెలిబుచ్చే హక్కు ప్రతి ఒక్కరికి…
అక్కినేని అఖిల్ కు బలమైన కంబ్యాక్ గా నిలిచిన లెనిన్ థియేటర్ రన్ ఇంకా కొనసాగుతోంది. అయితే చెన్నై లవ్…