Trends

ఫ్రెండ్ తో చనువుగా ఉందని విశాఖ బీచ్ కు తీసుకెళ్లి చంపేశాడు

విశాఖపట్నంలో దారుణ హత్య జరిగింది. తాను పరిచయం చేసిన స్నేహితుడితో చనువుగా ఉంటుందన్న కోపంతో చంపేసిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. అసలేమైందంటే.. అనకాపల్లి జిల్లా పరవాడకు చెందిన గోపాల్ పెయింటర్. పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటాడు.
అతనికి తమ ప్రాంతానికే చెందిన 28 ఏళ్ల వివాహిత అయిన శ్రావణితో పరిచయం ఏర్పడింది. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. ఆమె జగదాంబ కూడలిలోని ఒక షాపులో పని చేస్తోంది. వీరి స్నేహం తర్వాతి లెవెల్ కు వెళ్లింది. దీంతో.. వారిద్దరూ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఆర్నెల్లుగా కలిసి ఉంటున్నారు.

ఈ క్రమంలో తన స్నేహితుడైన వెంకటేశ్ ను ఆమెకు పరిచయం చేశాడు. కొంతకాలంగా శ్రావణి.. తన స్నేహితుడు వెంకటేశ్ తో ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం మొదలైంది. దీంతో.. వారిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. ఈ వ్యవహారంపై మాట్లాడుకుందామంటూ శ్రావణికి.. వెంకటేశ్ లకు ఫోన్ చేసి చెప్పాడు గోపాల్. అనంతరం.. వారు ముగ్గురు కలిసి ఒకే వాహనం మీద ఆర్కే బీచ్ కు వెళ్లారు. అక్కడ వారు మాట్లాడుతుండగా.. పోలీసులు అక్కడకు వచ్చి వెళ్లిపోవాలని చెప్పటంతో వారు తిరిగి బయలుదేరారు.

ఆ క్రమంలో ఆర్కే బీచ్ కు సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఒక ఇంటి వద్దకు వెళ్లారు. శ్రావణితో తాను ఒంటరిగా మాట్లాడాలని గోపాల్ చెప్పటంతో వెంకటేశ్ కాస్తంత దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో వెంకటేశ్ తో శ్రావణి చనువుగా ఉంటున్న విషయం వారి మధ్య చర్చకు రావటం.. అది కాస్తా వాగ్వాదం వరకు వెళ్లింది. ఈ క్రమంలో తీవ్ర కోపానికి గురైన గోపాల్.. శ్రావణి గొంతు నులిమాడు.

దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించింది. విగతజీవిగా ఉన్న శ్రావణిని అక్కడే విడిచి పెట్టిన గోపాల్.. తానిప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లి.. నేరుగా గాజావాక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తాను చేసిన పని చెప్పి లొంగిపోయాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.

This post was last modified on May 21, 2023 12:40 pm

Share
Show comments
Published by
Satya
Tags: Vishaka

Recent Posts

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

16 minutes ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

31 minutes ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

2 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

4 hours ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

4 hours ago