ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం.. అని తలపట్టుకునే భర్త పుంగవులకు.. కళ్లు తెరిపించే ఘటన వెలుగు చూసింది. ఏకంగా.. ఒక భర్తకు 40 మంది భార్యలు ఉన్నారు. వారికి పిల్లలు కూడా పుట్టారు. ఎవరిని అడిగినా.. తమ భర్త పేరు ఒక్కటే అని చెబుతున్నారు. మొత్తం 40 మందీ ఇదే పాట పాడుతున్నారు. మరి ఆ 40 మంది భార్యలు.. ఒక్కగానొక్క భర్త కథేంటి? ఎక్కడ వెలుగు చూసింది.. అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బిహార్లోని నితీష్కుమార్ ప్రభుత్వం కొన్నాళ్లుగా కుల గణన చేపడుతోంది. అంటే.. ఏయే కులాల వారు ఎంతెంత మంది ఉన్నారు.. వారికిప్రభుత్వం అందించే రాయితీలు.. పథకాలు అందుతున్నాయా? లేదా? వంటి విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికారులు రాష్ట్రం మొత్తం తిరిగి.. వివరాలు సేకరిస్తున్నారు. ఇలానే అర్వల్ జిల్లాలోని ఓ రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి సమాచారం సేకరించారు. అక్కడ నివాసం ఉండే మహిళలు చెప్పిన సమాధానాలు ఆశ్చర్యానికి గురిచేశాయి.
దాదాపు 40 మంది మహిళలు.. తమ భర్తగా ఒక్కరి పేరే చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లిన అధికారులంతా అవాక్కయ్యారు. చాలా మంది పిల్లలు కూడా తమ తండ్రిగా.. అతని పేరే చెప్పారు. ఓ రెడ్లైట్ ఏరియాకు అధికారులు వెళ్లారు. అక్కడ వివరాలు సేకరిస్తుండగా.. దాదాపు 40 కుటుంబాలు తమ భర్త కాలమ్లో రూప్చంద్ అనే పేరు నమోదు చేసుకున్నాయి. వారంతా కలిసి ఒకే పేరు చెప్పడం వల్ల అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. పూర్తి వివరాలను ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
రెడ్లైట్ ఏరియాలో ఓ డ్యాన్సర్ ఉన్నాడు. అతడు చాలా ఏళ్లుగా పాటలు పాడుతూ.. డాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి అక్కడ సొంత నివాసం కూడా లేదు. అతడిపై అభిమానంతోనే వీరంతా రూప్చంద్ పేరును.. తమ భర్తల పేరుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. వారికి కులం అంటు ఏది లేదని అధికారులు తెలిపారు.
This post was last modified on April 27, 2023 7:02 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…