Trends

అతను బౌల్డ్ చేస్తే బీసీసీఐకి 60 లక్షలు నష్టం

ఐపీఎల్‌లో ఒక బౌలర్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. ఆ రెండూ బౌల్డ్‌లే. ఐతే అతను బౌల్డ్ చేసినందుకు బీసీసీఐ రూ.60 లక్షలు నష్టపోవడం గమనార్హం. ఇదేం లాజిక్? ఇందులో బెట్టింగ్, ఫిక్సింగ్ వ్యవహారం ఏమైనా ఉందా? అని ఆశ్చర్యం కలుగుతోందా? అలాంటిదేమీ లేదు.

ఆ బౌలర్ బౌల్డ్ చేసిన రెండు సందర్భాల్లోనూ మిడిల్ స్టంప్ రెండుగా విరిగిపోవడం విశేషం. ఆ విరిగిన స్టంప్ ఆషామాషీది కాదు. ఒక్కో స్టంప్ ఏకంగా రూ.30 లక్షలు ఖరీదు చేసేది. రెండు స్టంప్‌లు విరగడంతో బీసీసీఐకి రూ.60 లక్షల నష్టం తప్పలేదు. ఇది జరిగింది శనివారం రాత్రి ముంబయి-పంజాబ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో. పరుగుల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఏకంగా 214 పరుగుల స్కోరు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబయి కూడా దీటుగానే స్పందించింది. కానీ చివరికి 6 వికెట్లకు 201 పరుగులే చేసి ఓటమి పాలైంది.

గెలుపు బాటలో సాగుతున్న ముంబయికి కళ్లెం వేసింది పంజాబీ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. చివరి ఓవర్లో ముంబయి విజయానికి 16 పరుగులు అవసరమైన స్థితిలో అతను కేవలం 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో 3, 4 బంతులకు తిలక్ వర్మ, వధేరాల వికెట్లు తీశాడతను. అర్ష్‌దీప్ ధాటికి రెండు సార్లూ మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. అతడి బంతుల వేగం ఏ స్థాయిలో ఉందంటే.. రెండుసార్లూ స్టంప్ రెండుగా విరిగిపోయింది. ఇవి ఆషామాషీ స్టంప్స్ కావు.

మైక్, కెమెరాతో పాటు ఎల్‌ఈడీ లైటింగ్ కూడా ఉన్న అధునాతన టెక్నాలజీతో తయారు చేసినవి. ఒక్కో స్టంప్ ధర ఏకంగా రూ.30 లక్షలట. అర్ష్‌దీప్ వల్ల రెండు స్టంప్‌లు పాడైపోవడంతో బీసీసీఐకి రూ.60 లక్షల నష్టం వచ్చింది. నిన్న రాత్రి నుంచి ఈ విషయంలో ట్రెండింగ్‌లో ఉంది. అర్ష్‌దీప్ బౌల్డ్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లలో ఐపీఎల్ ద్వారా వెలుుగలోకి వచ్చిన ఆణిముత్యాల్లో అర్ష్‌దీప్ ఒకడు. అతను ఇండియన్ టీంకు కూడా ఆడుతున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 23, 2023 2:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

5 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

5 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

6 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

6 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

7 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

7 hours ago