అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి చదువుకోవాలని.. అక్కడ ఉద్యోగం చేయాలి.. కారణం ఏదైనా కల మాత్రం అమెరికాకు ప్రయాణమే అన్న వారందరికీ అగ్ర రాజ్యం తీపికబురు చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు ఇచ్చేయనున్నట్లు చెప్పింది. ఈ ఏడాది 10 లక్షలు (మిలియన్) వీసాలు ఇవ్వనున్నట్లుగా అమెరికా విదేశాంగ శాఖలో సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న డొనాల్ట్ వెల్లడించారు.
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికే భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ వీసాల ఆమోద ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతున్నారు. అమెరికాలో చదువుకోవటం కోసం వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. అంతేకాదు.. మనోళ్లు అధికంగా కోరుకునే హెచ్ 1బీ, ఎల్ వర్కు వీసాల జారీకి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. కీలకమైన వర్కు వీసాల జారీకి భారత్ లోని కొన్ని కాన్సులేట్ లలో అరవై రోజుల కంటే తక్కువ సమయమే పడుతుందని చెప్పారు.
హెచ్ 1బీ వీసాలు ఉన్నప్పటికీ జాబ్స్ పోయిన ఐటీ నిపుణులు తమ హోదాను పునరుద్ధరించుకోవటానికి ఏమేం చేయాలో పేర్కొంటూ అమెరికన్ హోంల్యాండ్ సెక్యూరిటీ విధివిధానాలను విడుదల చేసినట్లుగా డొనాల్ట్ వెల్లడించారు. గడిచిన కొన్నాళ్లుగా భారత్ – అమెరికాల మధ్య ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఏడాదికి పదిలక్షల వరకు చేరుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. భారతీయులు పెద్దఎత్తున అమెరికాలో నివసిస్తూ స్థిరపడుతుంటే.. భారత్ లోనూ నివసించే అమెరికన్ల సంఖ్య ఎక్కువ అవుతోంది. తాజాగా అమెరికా విదేశాంగ అంచనా ప్రకారం భారత్ లో లక్ష మంది వరకు అమెరికాన్లు నివసిస్తున్నట్లుగా చెబుతున్నారు.
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…