అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి చదువుకోవాలని.. అక్కడ ఉద్యోగం చేయాలి.. కారణం ఏదైనా కల మాత్రం అమెరికాకు ప్రయాణమే అన్న వారందరికీ అగ్ర రాజ్యం తీపికబురు చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు ఇచ్చేయనున్నట్లు చెప్పింది. ఈ ఏడాది 10 లక్షలు (మిలియన్) వీసాలు ఇవ్వనున్నట్లుగా అమెరికా విదేశాంగ శాఖలో సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న డొనాల్ట్ వెల్లడించారు.
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికే భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ వీసాల ఆమోద ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతున్నారు. అమెరికాలో చదువుకోవటం కోసం వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. అంతేకాదు.. మనోళ్లు అధికంగా కోరుకునే హెచ్ 1బీ, ఎల్ వర్కు వీసాల జారీకి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. కీలకమైన వర్కు వీసాల జారీకి భారత్ లోని కొన్ని కాన్సులేట్ లలో అరవై రోజుల కంటే తక్కువ సమయమే పడుతుందని చెప్పారు.
హెచ్ 1బీ వీసాలు ఉన్నప్పటికీ జాబ్స్ పోయిన ఐటీ నిపుణులు తమ హోదాను పునరుద్ధరించుకోవటానికి ఏమేం చేయాలో పేర్కొంటూ అమెరికన్ హోంల్యాండ్ సెక్యూరిటీ విధివిధానాలను విడుదల చేసినట్లుగా డొనాల్ట్ వెల్లడించారు. గడిచిన కొన్నాళ్లుగా భారత్ – అమెరికాల మధ్య ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఏడాదికి పదిలక్షల వరకు చేరుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. భారతీయులు పెద్దఎత్తున అమెరికాలో నివసిస్తూ స్థిరపడుతుంటే.. భారత్ లోనూ నివసించే అమెరికన్ల సంఖ్య ఎక్కువ అవుతోంది. తాజాగా అమెరికా విదేశాంగ అంచనా ప్రకారం భారత్ లో లక్ష మంది వరకు అమెరికాన్లు నివసిస్తున్నట్లుగా చెబుతున్నారు.
This post was last modified on April 23, 2023 11:10 am
జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…
నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…
ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…