అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి చదువుకోవాలని.. అక్కడ ఉద్యోగం చేయాలి.. కారణం ఏదైనా కల మాత్రం అమెరికాకు ప్రయాణమే అన్న వారందరికీ అగ్ర రాజ్యం తీపికబురు చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు ఇచ్చేయనున్నట్లు చెప్పింది. ఈ ఏడాది 10 లక్షలు (మిలియన్) వీసాలు ఇవ్వనున్నట్లుగా అమెరికా విదేశాంగ శాఖలో సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న డొనాల్ట్ వెల్లడించారు.
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికే భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ వీసాల ఆమోద ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతున్నారు. అమెరికాలో చదువుకోవటం కోసం వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. అంతేకాదు.. మనోళ్లు అధికంగా కోరుకునే హెచ్ 1బీ, ఎల్ వర్కు వీసాల జారీకి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. కీలకమైన వర్కు వీసాల జారీకి భారత్ లోని కొన్ని కాన్సులేట్ లలో అరవై రోజుల కంటే తక్కువ సమయమే పడుతుందని చెప్పారు.
హెచ్ 1బీ వీసాలు ఉన్నప్పటికీ జాబ్స్ పోయిన ఐటీ నిపుణులు తమ హోదాను పునరుద్ధరించుకోవటానికి ఏమేం చేయాలో పేర్కొంటూ అమెరికన్ హోంల్యాండ్ సెక్యూరిటీ విధివిధానాలను విడుదల చేసినట్లుగా డొనాల్ట్ వెల్లడించారు. గడిచిన కొన్నాళ్లుగా భారత్ – అమెరికాల మధ్య ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఏడాదికి పదిలక్షల వరకు చేరుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. భారతీయులు పెద్దఎత్తున అమెరికాలో నివసిస్తూ స్థిరపడుతుంటే.. భారత్ లోనూ నివసించే అమెరికన్ల సంఖ్య ఎక్కువ అవుతోంది. తాజాగా అమెరికా విదేశాంగ అంచనా ప్రకారం భారత్ లో లక్ష మంది వరకు అమెరికాన్లు నివసిస్తున్నట్లుగా చెబుతున్నారు.
This post was last modified on April 23, 2023 11:10 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…