అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి చదువుకోవాలని.. అక్కడ ఉద్యోగం చేయాలి.. కారణం ఏదైనా కల మాత్రం అమెరికాకు ప్రయాణమే అన్న వారందరికీ అగ్ర రాజ్యం తీపికబురు చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు ఇచ్చేయనున్నట్లు చెప్పింది. ఈ ఏడాది 10 లక్షలు (మిలియన్) వీసాలు ఇవ్వనున్నట్లుగా అమెరికా విదేశాంగ శాఖలో సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న డొనాల్ట్ వెల్లడించారు.
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికే భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ వీసాల ఆమోద ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతున్నారు. అమెరికాలో చదువుకోవటం కోసం వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. అంతేకాదు.. మనోళ్లు అధికంగా కోరుకునే హెచ్ 1బీ, ఎల్ వర్కు వీసాల జారీకి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. కీలకమైన వర్కు వీసాల జారీకి భారత్ లోని కొన్ని కాన్సులేట్ లలో అరవై రోజుల కంటే తక్కువ సమయమే పడుతుందని చెప్పారు.
హెచ్ 1బీ వీసాలు ఉన్నప్పటికీ జాబ్స్ పోయిన ఐటీ నిపుణులు తమ హోదాను పునరుద్ధరించుకోవటానికి ఏమేం చేయాలో పేర్కొంటూ అమెరికన్ హోంల్యాండ్ సెక్యూరిటీ విధివిధానాలను విడుదల చేసినట్లుగా డొనాల్ట్ వెల్లడించారు. గడిచిన కొన్నాళ్లుగా భారత్ – అమెరికాల మధ్య ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఏడాదికి పదిలక్షల వరకు చేరుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. భారతీయులు పెద్దఎత్తున అమెరికాలో నివసిస్తూ స్థిరపడుతుంటే.. భారత్ లోనూ నివసించే అమెరికన్ల సంఖ్య ఎక్కువ అవుతోంది. తాజాగా అమెరికా విదేశాంగ అంచనా ప్రకారం భారత్ లో లక్ష మంది వరకు అమెరికాన్లు నివసిస్తున్నట్లుగా చెబుతున్నారు.
This post was last modified on April 23, 2023 11:10 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…