కరోనా మీద ప్రపంచానికి క్లారిటీ వస్తోంది. ఈ వైరస్ ప్రపంచానికి పరిచయమైన తొలినాళ్లలో లాక్ డౌన్ తో వ్యవస్థల్ని ఎక్కడికక్కడ స్తంభిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. వైరస్ తీవ్రత ఒకట్రెండునెలలతో పోయేది కాదని.. అది నెలల తరబడి కొనసాగుతుందన్న విషయాన్ని అన్ని దేశాల ప్రభుత్వాలు ఇప్పటికే గుర్తించాయి. అందుకే.. ఎవరికి వారు కొన్ని మినహాయింపులు ఇస్తూ.. ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దేశంలోనూ అలాంటి పరిస్థితే ఉంది. లాక్ డౌన్ స్థానే అన్ లాక్ వెర్షన్లను ఒకటి తర్వాత ఒకటిగా తెర మీదకు తెస్తున్న కేంద్రం.. తాజాగా విదేశీప్రయాణాలకు అనువుగా.. అంతర్జాతీయ విమాన సేవల్ని పునరుద్దరించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే విదేశాలకు పలు విమాన సర్వీసులు షురూ అయ్యాయి. కాకుంటే.. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చేందుకు వీలుగా ఈ నెల ఎనిమిది నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పునరుద్దరించనున్నారు.
దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాల్ని తాజాగా విడుదల చేశారు. దీని ప్రకారం.. అంతర్జాతీయ విమానయాన ప్రయాణికులు తప్పనిసరిగా పద్నాలుగురోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు.. మొదటి ఏడు రోజులు వారి సొంత ఖర్చులతో ప్రభుత్వం నిర్దేశించిన క్వారంటైన్ కేంద్రంలోనూ.. తర్వాతి వారం రోజులు హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.
కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు తమ అనుమతి ఉందన్న విషయాన్ని తమ ప్రయాణానికి 72 గంటల ముందే.. న్యూఢిల్లీఎయిర్ పోర్టు.ఇన్ కు తెలియజేయాలని కోరుతోంది. వాస్తవానికి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలేమీ మరీ అంత కఠినంగా లేవనే చెప్పాలి. నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తే.. విదేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే కాదు.. వారి కుటుంబీకులకు సైతం మంచిదన్న విషయాన్ని గుర్తించాలి.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…