కరోనా వ్యాక్సిన్.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న వస్తువు ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందకు పైగా దేశాలు వైరస్ బారిన పడి అల్లాడుతున్నాయి. దేశాల ఆర్థిక పునాదులే కదులుతున్నాయి. ప్రాణ నష్టం సహా ఎన్నో రకాల నష్టాలు చూస్తున్నారు జనాలు.
ప్రపంచమంతా ఒకరకమైన స్తబ్దత నెలకొందిప్పుడు. అదంతా పోవాలంటే కరోనా వ్యాక్సిన్ రావాల్సిందే. అన్ని అనుమతులూ పొంది కరోనాకు చక్కగా పని చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దానికుండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది దీని మీద.
భారత్ విషయానికి వస్తే ఇక్కడ భారత్ బయోటెక్తో పాటు మరో సంస్థ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరమ్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ తయారీలో అత్యంత చురుగ్గా ఉన్న సంస్థలు ఐదింటితో ఒప్పందాలు చేసుకుని.. వాటితో కలిసి పని చేస్తోంది. ఏకంగా 450 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందీ సంస్థ.
దీని అధినేత అదర్ పూనవాలా ముందు నుంచి ఇండియాలోకి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చే విషయంలో పాజిటివ్ న్యూస్లే చెబుతున్నారు. అత్యంత తక్కువ ధరతో, అత్యధిక మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒకేసారి ఐదు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. ఏది ముందు అందుబాటులోకి వస్తే దాన్ని మార్కెట్లోకి తెస్తామని అంటున్నారు.
ఆక్స్ఫర్ట్ యూనివర్శిటీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉండగా.. దానికి విదేశాల్లో, భారత్లో అనుమతులు రాకముందే ఇక్కడ పెద్ద ఎత్తున సీరమ్ సంస్థ ఉత్పత్తి చేస్తుండటం విశేషం. బహుశా ఈ వ్యాక్సిన్ ఫెయిలయ్యే ఛాన్సే లేదన్న కాన్ఫిడెన్స్ ఆ సంస్థది కావచ్చు.
This post was last modified on August 5, 2020 4:11 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…