కరోనా వ్యాక్సిన్.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న వస్తువు ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందకు పైగా దేశాలు వైరస్ బారిన పడి అల్లాడుతున్నాయి. దేశాల ఆర్థిక పునాదులే కదులుతున్నాయి. ప్రాణ నష్టం సహా ఎన్నో రకాల నష్టాలు చూస్తున్నారు జనాలు.
ప్రపంచమంతా ఒకరకమైన స్తబ్దత నెలకొందిప్పుడు. అదంతా పోవాలంటే కరోనా వ్యాక్సిన్ రావాల్సిందే. అన్ని అనుమతులూ పొంది కరోనాకు చక్కగా పని చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దానికుండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది దీని మీద.
భారత్ విషయానికి వస్తే ఇక్కడ భారత్ బయోటెక్తో పాటు మరో సంస్థ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరమ్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ తయారీలో అత్యంత చురుగ్గా ఉన్న సంస్థలు ఐదింటితో ఒప్పందాలు చేసుకుని.. వాటితో కలిసి పని చేస్తోంది. ఏకంగా 450 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందీ సంస్థ.
దీని అధినేత అదర్ పూనవాలా ముందు నుంచి ఇండియాలోకి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చే విషయంలో పాజిటివ్ న్యూస్లే చెబుతున్నారు. అత్యంత తక్కువ ధరతో, అత్యధిక మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒకేసారి ఐదు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. ఏది ముందు అందుబాటులోకి వస్తే దాన్ని మార్కెట్లోకి తెస్తామని అంటున్నారు.
ఆక్స్ఫర్ట్ యూనివర్శిటీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉండగా.. దానికి విదేశాల్లో, భారత్లో అనుమతులు రాకముందే ఇక్కడ పెద్ద ఎత్తున సీరమ్ సంస్థ ఉత్పత్తి చేస్తుండటం విశేషం. బహుశా ఈ వ్యాక్సిన్ ఫెయిలయ్యే ఛాన్సే లేదన్న కాన్ఫిడెన్స్ ఆ సంస్థది కావచ్చు.
This post was last modified on August 5, 2020 4:11 pm
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…