కరోనా వ్యాక్సిన్.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న వస్తువు ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందకు పైగా దేశాలు వైరస్ బారిన పడి అల్లాడుతున్నాయి. దేశాల ఆర్థిక పునాదులే కదులుతున్నాయి. ప్రాణ నష్టం సహా ఎన్నో రకాల నష్టాలు చూస్తున్నారు జనాలు.
ప్రపంచమంతా ఒకరకమైన స్తబ్దత నెలకొందిప్పుడు. అదంతా పోవాలంటే కరోనా వ్యాక్సిన్ రావాల్సిందే. అన్ని అనుమతులూ పొంది కరోనాకు చక్కగా పని చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దానికుండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది దీని మీద.
భారత్ విషయానికి వస్తే ఇక్కడ భారత్ బయోటెక్తో పాటు మరో సంస్థ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరమ్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ తయారీలో అత్యంత చురుగ్గా ఉన్న సంస్థలు ఐదింటితో ఒప్పందాలు చేసుకుని.. వాటితో కలిసి పని చేస్తోంది. ఏకంగా 450 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందీ సంస్థ.
దీని అధినేత అదర్ పూనవాలా ముందు నుంచి ఇండియాలోకి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చే విషయంలో పాజిటివ్ న్యూస్లే చెబుతున్నారు. అత్యంత తక్కువ ధరతో, అత్యధిక మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒకేసారి ఐదు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. ఏది ముందు అందుబాటులోకి వస్తే దాన్ని మార్కెట్లోకి తెస్తామని అంటున్నారు.
ఆక్స్ఫర్ట్ యూనివర్శిటీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉండగా.. దానికి విదేశాల్లో, భారత్లో అనుమతులు రాకముందే ఇక్కడ పెద్ద ఎత్తున సీరమ్ సంస్థ ఉత్పత్తి చేస్తుండటం విశేషం. బహుశా ఈ వ్యాక్సిన్ ఫెయిలయ్యే ఛాన్సే లేదన్న కాన్ఫిడెన్స్ ఆ సంస్థది కావచ్చు.
This post was last modified on August 5, 2020 4:11 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…