Trends

పేప‌ర్ లీకేజీ కోసం.. కారు అమ్మేశారు

తెలంగాణ‌లో లీకు వీరులు సృష్టించిన తుఫాను.. మ‌రిన్ని దిశ‌లుగా ప‌య‌నిస్తోంది. తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నియామ‌కాల‌కు సంబంధించి పేప‌ర్లు లీక్ అయిన వ్య‌వ‌హారం.. అన్నివైపుల నుంచి విస్మ‌యానికి గురి చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురిని అదుపులోకి తీసుకోవ‌డం తెలిసిందే. అయితే.. తోడుతున్న కొద్దీ.. నీరు ఊరిన‌ట్టు.. ఈ కేసులో విచార‌ణ చేస్తున్న కొద్దీ విస్మ‌యం క‌లిగించే విష‌యం వెలుగు చూస్తున్నాయి.

పేప‌ర్ లీకు కుంభ‌కోణంలో ఖమ్మం ప్రాంతానికి చెందిన దంపతులు సాయిలౌకిక్‌, సుస్మితల నుంచి ల్యాప్‌టాప్‌, ప్రశ్నపత్రం స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి రాబ‌ట్టిన స‌మాచారం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఖమ్మం ప్రాంతానికి చెందిన పాతకార్ల వ్యాపారి సాయిలౌకిక్‌ డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో) ప్రశ్నపత్రం కొనుగోలు చేసేందుకు ప్ర‌ధాన నిందితుడు ప్రవీణ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.

దానికోసం సాయిలౌకిక్ కారును అమ్మేశాడు. ఇలా అమ్మేయ‌గా వ‌చ్చిన 6లక్షల సొమ్మును నిందితుడు ప్రవీణ్‌ బ్యాంకు ఖాతాలో వేశారు. మిగిలిన మ‌రో 4 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పరీక్ష రాశాక ఇస్తానంటూ సాయి లౌకిక్ ఫిబ్రవరి 23న డీఏఓ ప్రశ్నపత్రం తీసుకున్నాడు. అదే నెల 26న డీఏఓ పరీక్ష రాశారు. ఆ తర్వాత మార్చి 11న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ విషయం బయటపడడం తెలిసిందే.

విచార‌ణ‌కు స‌హ‌క‌రించడంతో..

ఈ లీకుల బాగోతంలో కొస‌మెరుపు ఏంటంటే.. సాయిలౌకిక్, సుస్మిత దంపతులు పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డ‌మే. దీంతో కేసు దాదాపు ఒక కొలిక్కి వ‌చ్చింద‌ని ఆఫ్ ది రికార్డుగా పోలీసులు చెబుతున్నారు. లీకేజీ దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు అయిన ప్రవీణ్‌ బ్యాంకు ఖాతాలను పరిశోధించినప్పుడు సాయిలౌకిక్‌ ద్వారా రూ.6 లక్షలు వచ్చినట్లు వెల్లడవడంతో డీఏఓ ప్రశ్నపత్రం కూడా విక్రయించినట్టు సిట్‌ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయంపై కస్టడీ సమయంలో ఆ దంపతులు తామే ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు అంగీకరించారు. మొత్తానికి లీకుల వ్య‌వ‌హారం ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతుందోన‌ని పోలీసులు చెబుతున్నారు.

This post was last modified on April 17, 2023 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

3 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

6 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

7 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

8 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

9 hours ago