Trends

పేప‌ర్ లీకేజీ కోసం.. కారు అమ్మేశారు

తెలంగాణ‌లో లీకు వీరులు సృష్టించిన తుఫాను.. మ‌రిన్ని దిశ‌లుగా ప‌య‌నిస్తోంది. తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నియామ‌కాల‌కు సంబంధించి పేప‌ర్లు లీక్ అయిన వ్య‌వ‌హారం.. అన్నివైపుల నుంచి విస్మ‌యానికి గురి చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురిని అదుపులోకి తీసుకోవ‌డం తెలిసిందే. అయితే.. తోడుతున్న కొద్దీ.. నీరు ఊరిన‌ట్టు.. ఈ కేసులో విచార‌ణ చేస్తున్న కొద్దీ విస్మ‌యం క‌లిగించే విష‌యం వెలుగు చూస్తున్నాయి.

పేప‌ర్ లీకు కుంభ‌కోణంలో ఖమ్మం ప్రాంతానికి చెందిన దంపతులు సాయిలౌకిక్‌, సుస్మితల నుంచి ల్యాప్‌టాప్‌, ప్రశ్నపత్రం స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి రాబ‌ట్టిన స‌మాచారం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఖమ్మం ప్రాంతానికి చెందిన పాతకార్ల వ్యాపారి సాయిలౌకిక్‌ డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో) ప్రశ్నపత్రం కొనుగోలు చేసేందుకు ప్ర‌ధాన నిందితుడు ప్రవీణ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.

దానికోసం సాయిలౌకిక్ కారును అమ్మేశాడు. ఇలా అమ్మేయ‌గా వ‌చ్చిన 6లక్షల సొమ్మును నిందితుడు ప్రవీణ్‌ బ్యాంకు ఖాతాలో వేశారు. మిగిలిన మ‌రో 4 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను పరీక్ష రాశాక ఇస్తానంటూ సాయి లౌకిక్ ఫిబ్రవరి 23న డీఏఓ ప్రశ్నపత్రం తీసుకున్నాడు. అదే నెల 26న డీఏఓ పరీక్ష రాశారు. ఆ తర్వాత మార్చి 11న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ విషయం బయటపడడం తెలిసిందే.

విచార‌ణ‌కు స‌హ‌క‌రించడంతో..

ఈ లీకుల బాగోతంలో కొస‌మెరుపు ఏంటంటే.. సాయిలౌకిక్, సుస్మిత దంపతులు పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డ‌మే. దీంతో కేసు దాదాపు ఒక కొలిక్కి వ‌చ్చింద‌ని ఆఫ్ ది రికార్డుగా పోలీసులు చెబుతున్నారు. లీకేజీ దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు అయిన ప్రవీణ్‌ బ్యాంకు ఖాతాలను పరిశోధించినప్పుడు సాయిలౌకిక్‌ ద్వారా రూ.6 లక్షలు వచ్చినట్లు వెల్లడవడంతో డీఏఓ ప్రశ్నపత్రం కూడా విక్రయించినట్టు సిట్‌ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయంపై కస్టడీ సమయంలో ఆ దంపతులు తామే ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు అంగీకరించారు. మొత్తానికి లీకుల వ్య‌వ‌హారం ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతుందోన‌ని పోలీసులు చెబుతున్నారు.

This post was last modified on April 17, 2023 2:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

2 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

3 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

4 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

5 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

6 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

7 hours ago