Trends

కిమ్ మామూలోడు కాదు… వాటికోసం లాక్ డౌన్

కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ అంటే ప్రపంచ ప్రజానీకానికి తెలిసి వచ్చింది. అప్పటివరకు తెలీని లాక్ డౌన్ తోపాటు మరెన్నో విషయాలు తెలిశాయి. లాక్ డౌన్ అన్నంతనే వణుకు పుట్టేలా మరింది. ఇదిలా ఉంటే తాజాగా పరమ భీకరనియంత ఏలుబడిలోఉన్న ఉత్తర కొరియాలోని ఒక నగరంలోలాక్ డౌన్ విధించారు. ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇంతకూ లాక్ డౌన్ ఎందుకు? మళ్లీ ఆ దేశంలో కొవిడ్ విరుచుకుపడిందా? అంటే.. అదేమీ లేదంటున్నారు.
మరి.. ఎందుకు లాక్ డౌన్ విధించారా? అంటూ ఆరా తీస్తే షాకింగ్ నిజం బయటకు వచ్చింది. పిస్టల్ లో వాడే తూటాల కారణంగా ఆ నగరంలో లాక్ డౌన్ విధించినట్లు చెబుతున్నారు. ఉత్తర కొరియాలోని హైసన్ అనే నగరంలో సైనికులు కొన్ని తూటాల్ని పోగొట్టుకున్నారు.

వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వీలుగా లాక్ డౌన్ ను విధించినట్లుగా వెల్లడైంది. ఉత్తర కొరియాలోని సరిహద్దునగరాల్లో ఒకటైన హైసన్ నగరంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 10 మధ్య సైనిక దళాల ఉపసంహరణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సైనికుల వద్ద నుంచి 653 తూటాలు మిస్ అయినట్లుగా గుర్తించారు.

సైనిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా వాటిని గుర్తించే ప్రయత్నం చేసినా అవి మాత్రం దొరకలేదు. దీంతో.. ఉన్నతాధికారులకు ఈ అంశం గురించి సమాచారం ఇవ్వగా.. తూటాలు దొరికే వరకు హైసన్ నగరంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఇంతటి విచిత్రమైన నిర్ణయాన్ని తీసుకున్నది మరెవరో కాదు.. ఆ దేశాధ్యక్షుడు కమ్ నియంత అయిన కిమ్ జోంగ్ ఉన్.

అతగాడి నిర్ణయం కారణంగా ఆ నగరంలోని రెండు లక్షల ప్రజల జీవితాలు స్తంభించిపోయాయి. ఇళ్లకే పరిమితమయ్యారు. తూటాలు పడిపోతే.. లక్షలాది మంది బతుకులకు లాక్ డౌన్ విధించిన కిమ్ లాంటి పాలకుడి నీడలో బతుకుతున్న ప్రజల జీవితాలను తలుచుకుంటేనే వణుకు పుట్టటం ఖాయం. కాదంటారా?

This post was last modified on March 30, 2023 5:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago