Trends

కిమ్ మామూలోడు కాదు… వాటికోసం లాక్ డౌన్

కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ అంటే ప్రపంచ ప్రజానీకానికి తెలిసి వచ్చింది. అప్పటివరకు తెలీని లాక్ డౌన్ తోపాటు మరెన్నో విషయాలు తెలిశాయి. లాక్ డౌన్ అన్నంతనే వణుకు పుట్టేలా మరింది. ఇదిలా ఉంటే తాజాగా పరమ భీకరనియంత ఏలుబడిలోఉన్న ఉత్తర కొరియాలోని ఒక నగరంలోలాక్ డౌన్ విధించారు. ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇంతకూ లాక్ డౌన్ ఎందుకు? మళ్లీ ఆ దేశంలో కొవిడ్ విరుచుకుపడిందా? అంటే.. అదేమీ లేదంటున్నారు.
మరి.. ఎందుకు లాక్ డౌన్ విధించారా? అంటూ ఆరా తీస్తే షాకింగ్ నిజం బయటకు వచ్చింది. పిస్టల్ లో వాడే తూటాల కారణంగా ఆ నగరంలో లాక్ డౌన్ విధించినట్లు చెబుతున్నారు. ఉత్తర కొరియాలోని హైసన్ అనే నగరంలో సైనికులు కొన్ని తూటాల్ని పోగొట్టుకున్నారు.

వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వీలుగా లాక్ డౌన్ ను విధించినట్లుగా వెల్లడైంది. ఉత్తర కొరియాలోని సరిహద్దునగరాల్లో ఒకటైన హైసన్ నగరంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 10 మధ్య సైనిక దళాల ఉపసంహరణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో సైనికుల వద్ద నుంచి 653 తూటాలు మిస్ అయినట్లుగా గుర్తించారు.

సైనిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా వాటిని గుర్తించే ప్రయత్నం చేసినా అవి మాత్రం దొరకలేదు. దీంతో.. ఉన్నతాధికారులకు ఈ అంశం గురించి సమాచారం ఇవ్వగా.. తూటాలు దొరికే వరకు హైసన్ నగరంలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. ఇంతటి విచిత్రమైన నిర్ణయాన్ని తీసుకున్నది మరెవరో కాదు.. ఆ దేశాధ్యక్షుడు కమ్ నియంత అయిన కిమ్ జోంగ్ ఉన్.

అతగాడి నిర్ణయం కారణంగా ఆ నగరంలోని రెండు లక్షల ప్రజల జీవితాలు స్తంభించిపోయాయి. ఇళ్లకే పరిమితమయ్యారు. తూటాలు పడిపోతే.. లక్షలాది మంది బతుకులకు లాక్ డౌన్ విధించిన కిమ్ లాంటి పాలకుడి నీడలో బతుకుతున్న ప్రజల జీవితాలను తలుచుకుంటేనే వణుకు పుట్టటం ఖాయం. కాదంటారా?

This post was last modified on March 30, 2023 5:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఊరి కోసం పోరాడే రియల్ ‘ఛాంపియన్’

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…

19 minutes ago

తప్పు తెలుసుకున్న యువ హీరో

స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…

45 minutes ago

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…

3 hours ago

వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న సీఎం

2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తామే విజ‌యం దక్కించుకుంటామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవ‌రు ఎన్ని జిమ్మిక్కులు…

3 hours ago

రుషికొండ ప్యాలెస్ విశాఖకే ఆణిముత్యమా?

వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…

3 hours ago

ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?

మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…

4 hours ago