Trends

ఏపీలో కరోనా విలయం… ఆగస్టులో 10 లక్షల మార్క్ కు కేసులు?

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఏపీలో తనదైన రీతిలో విస్తరిస్తోంది. ఆదిలో రోజుకు సింగిల్, డబుల్ డిజిట్ కొత్త కేసులు నమోదైతేనే భయపడిపోయిన ఏపీ వాసులను.. ఇప్పుడు ఏకంగా రోజుకు 10 వేల కొత్త కేసులు నమోదైపోతుండటం మరింతగా భయపెడుతోంది.

బుధవారం ఒక్కరోజే ఏకంగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగించే అంశమేనని చెప్పాలి. అయితే గడచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే… అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు జనం కూడా జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ఆగస్టులో కరోనా విలయతాండవం చేసే ప్రమాదం లేకపోలేదన్న మాట గట్టిగానే వినిపిస్తోంది.

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా… ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందుతున్న మాదిరి పరిస్థితులే ఉంటే… ఆగస్టులో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదన ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం రోజువారీగా విడుదల చేస్తున్న గణాంకాలను బట్టి చూస్తేనే… ఆగస్టులో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలకు చేరే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. సరిగ్గా బుధవారానికి 14 రోజుల ముందు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 30 వేలకు దిగువగానే ఉంది. అయితే ఈ 14 రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య అనూహ్యంగా 1.20 లక్షలకు చేరిపోయింది. అంటే… 14 రోజుల క్రితం నాడు కరోనా బాధితులుగా ఉన్న 30 వేల మంది ద్వారా ఏకంగా 90 వేల మందికి వైరస్ వ్యాప్తి చెందిందన్న మాట.

ఈ కొత్తగా చేరిన బాధితులు… అంతకుముందు కరోనా బారిన పడిన వారి కుటుంబ సభ్యులైనా కావచ్చు. లేదంటే వారికి సన్నిహితంగా మెలగిన ఇతరులైనా కావచ్చు. మొత్తంగా 30 వేల మంది బాధితులు కేవలం 14 రోజుల్లోనే ఏకంగా 90 వేల మందికి వైరస్ ను అంటించేశారన్న మాట. అంటే… ఒక్కో బాధితుడు సగటున నలుగురికి ఈ వైరస్ ను అంటించేశాడన్న మాట.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే… మరో 14 రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు చేరిపోవడం అంత కష్టమేమీ కాదన్న మాట వినిపిస్తోంది. వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత ఫలవంతం కావడం, ప్రజలు శుభ్రత, భద్రత విషయంలో మరింత జాగ్ర్తత్తగా వ్యవహరిస్తేనే వైరస్ వ్యాప్తిని నిలువరించే అవకాశం ఉందన్న మాట.

అలా కాకుండా ఇప్పుడున్న నిర్లక్ష్య ధోరణే ఇక ముందు కూడా కొనసాగితే… కేసుల సంఖ్య 10 లక్షలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే… కరోనా బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే… ఇటు ప్రభుత్వం తరఫున కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలు కూడా తమ కుటుంబాలను కాపాడుకునే విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించక తప్పదని చెప్పక తప్పదు.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

8 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

8 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago