Trends

దేశంలో జూన్ భయం

కరోనా మరోసారి విజృంభించేందుకు రేడీ అవుతోంది. అక్కడక్కడా కేసులు నమోదవుతున్నాయి. అవి ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధాని మోదీ దీనిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ట్రెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పై ఉదాసీనన వద్దని కేంద్రం సూచించింది. తమ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది

గత 24 గంటల్లో దేశంలో 1,890 కరోనా కేసులు నమోదయ్యాయి. 2020 మార్చిలో కూడా ఇదే స్థాయిలో డెవలప్ అవుతూ.. జూన్ లో భారీగా పెరిగాయి. ఏకంగా రోజుకు లక్షల కేసులు నమోదయ్యాయి. సరిపడా టెస్టింగ్ పరికరాలు లేక చాలా మందికి కరోనా నిర్థారణ కాని పరిస్థితి ఏర్పడింది. తర్వాతి కాలంలో వ్యాక్సిన్ రావడం కారణంగా వైరస్ నియంత్రణకు వచ్చింది. ఇప్పటి వరకు 220 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పెరిగింది.

ప్రస్తుతం రోజుకు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరో వారం రోజుల్లో అది రెండు వేలకు చేరుకోవచ్చు. జూన్ మొదటి వారంలో వర్షాకాలం మొదలైతే… ఇక థర్డ్ వేవ్ భయం జనాన్ని , ప్రభుత్వాలను వెంటాడుతుంది. ప్రస్తుతం 9,433 ఉన్న కేస్ లోడ్ అప్పుడు లక్షలకు చేరుతుంది. వ్యాధి లక్షణాలను బట్టి ఖచితంగా అది కరోనానేనని చెప్పలేం. టెస్టింగ్ చేసిన తర్వాత మాత్రమే దేన్నైనా నిర్థారించే వీలుంది. అందుకే రాష్ట్రాల వైద్య శాఖలు అప్రమత్తంగా ఉండాల్సిన అనివార్యత ఏర్పడింది.

కరోనా బయట పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 92 కోట్ల టెస్టులు చేశామని కేంద్రం అంటోంది. గత 24 గంటల్లోనే లక్షా 21 వేల టెస్టులు చేశారట. అలాగని టెస్టులు సరిపోతాయా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో టెస్టు కిట్స్ కొరత ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రైవేటు రంగంలో టెస్టింగ్ సులభమవుతోంది. గ్రామీణ ప్రాంతాలకు అటువంటి సౌకర్యాలు లేవు. అందుకే జనం జాగ్రత్త వహించడం ఉత్తమమని చెప్పాలి. రెండు మూడు నెలల వరకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటివి చేస్తే థర్డ్ వేవ్ భయం నుంచి బయట పడే వీటుంటుంది..

This post was last modified on March 26, 2023 12:56 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

10 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

11 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

15 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

15 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

15 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

16 hours ago