కాస్మొపాలిటన్ నగరాలు లేని రాష్ట్రం దేశంలో కొత్త కేసుల్లో వరుసగా రెండోరోజు నెం.1 స్థానంలో నిలిచింది. అది కూడా అత్యధిక టెస్టులు చేస్తూ వస్తున్నా వ్యాప్తి కంట్రోల్ కాకపోగా పెరుగుతూనే ఉంటూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తూనే ఉంది.
తాజాగా ఏపీ సర్కారు కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం విడుదల చేసిన లెక్కల ప్రకారం…రాష్ట్రంలో కొత్తగా గడిచిన 24 గంటల్లో 10093 కేసులు నమోదయ్యాయి. నిన్నటి నివేదిక ప్రకారం… సుమారు 8వేల కేసులతో దేశంలో కేసులలో ఒక్కరోజు సంఖ్యలో నెం.1గా నిలిచిన ఏపీ వరుసగా రెండో రోజు పదివేల కేసులతో నెం.1 గా నిలిచింది.
ఇదిలా ఉండగా… కేసులే కాదు పరీక్షలు కూడా అధికంగానే జరిగాయి. తాజాగా ఏపీలో 70,584 శాంపిల్స్ను పరీక్షించారు. ఇందులో 37,199 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు కాగా మిగతావి ఆర్టీపీసీఆర్ టెస్టులు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 18,20,009 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,17,495 పాజిటివ్ కేసు లకు గాను ఇప్పటివరకు 52,529 మంది డిశ్చార్జ్ కాగా, 1,213 మంది మరణించారు. ప్రస్తుతం 63,753 చికిత్స పొందుతున్నారు. కేసులు భారీగా నమోదు కాగా… ఈరోజు డిశ్చార్జి అయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కేవలం 2,784 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈరోజు నమోదైన మరణాలు 65.
అత్యధికంగా తూర్పు గోదావరిలో 1676, అనంతపురంలో 1371, కర్నూలులో 1091 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాలివే.
This post was last modified on July 29, 2020 6:28 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…