కాస్మొపాలిటన్ నగరాలు లేని రాష్ట్రం దేశంలో కొత్త కేసుల్లో వరుసగా రెండోరోజు నెం.1 స్థానంలో నిలిచింది. అది కూడా అత్యధిక టెస్టులు చేస్తూ వస్తున్నా వ్యాప్తి కంట్రోల్ కాకపోగా పెరుగుతూనే ఉంటూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తూనే ఉంది.
తాజాగా ఏపీ సర్కారు కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం విడుదల చేసిన లెక్కల ప్రకారం…రాష్ట్రంలో కొత్తగా గడిచిన 24 గంటల్లో 10093 కేసులు నమోదయ్యాయి. నిన్నటి నివేదిక ప్రకారం… సుమారు 8వేల కేసులతో దేశంలో కేసులలో ఒక్కరోజు సంఖ్యలో నెం.1గా నిలిచిన ఏపీ వరుసగా రెండో రోజు పదివేల కేసులతో నెం.1 గా నిలిచింది.
ఇదిలా ఉండగా… కేసులే కాదు పరీక్షలు కూడా అధికంగానే జరిగాయి. తాజాగా ఏపీలో 70,584 శాంపిల్స్ను పరీక్షించారు. ఇందులో 37,199 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు కాగా మిగతావి ఆర్టీపీసీఆర్ టెస్టులు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 18,20,009 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,17,495 పాజిటివ్ కేసు లకు గాను ఇప్పటివరకు 52,529 మంది డిశ్చార్జ్ కాగా, 1,213 మంది మరణించారు. ప్రస్తుతం 63,753 చికిత్స పొందుతున్నారు. కేసులు భారీగా నమోదు కాగా… ఈరోజు డిశ్చార్జి అయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కేవలం 2,784 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈరోజు నమోదైన మరణాలు 65.
అత్యధికంగా తూర్పు గోదావరిలో 1676, అనంతపురంలో 1371, కర్నూలులో 1091 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాలివే.
This post was last modified on July 29, 2020 6:28 pm
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…
మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…
ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…
రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ కార్తికేయ 2తో పెద్ద బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న యూత్…
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునే వారు. అది…