కాస్మొపాలిటన్ నగరాలు లేని రాష్ట్రం దేశంలో కొత్త కేసుల్లో వరుసగా రెండోరోజు నెం.1 స్థానంలో నిలిచింది. అది కూడా అత్యధిక టెస్టులు చేస్తూ వస్తున్నా వ్యాప్తి కంట్రోల్ కాకపోగా పెరుగుతూనే ఉంటూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తూనే ఉంది.
తాజాగా ఏపీ సర్కారు కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం విడుదల చేసిన లెక్కల ప్రకారం…రాష్ట్రంలో కొత్తగా గడిచిన 24 గంటల్లో 10093 కేసులు నమోదయ్యాయి. నిన్నటి నివేదిక ప్రకారం… సుమారు 8వేల కేసులతో దేశంలో కేసులలో ఒక్కరోజు సంఖ్యలో నెం.1గా నిలిచిన ఏపీ వరుసగా రెండో రోజు పదివేల కేసులతో నెం.1 గా నిలిచింది.
ఇదిలా ఉండగా… కేసులే కాదు పరీక్షలు కూడా అధికంగానే జరిగాయి. తాజాగా ఏపీలో 70,584 శాంపిల్స్ను పరీక్షించారు. ఇందులో 37,199 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు కాగా మిగతావి ఆర్టీపీసీఆర్ టెస్టులు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 18,20,009 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,17,495 పాజిటివ్ కేసు లకు గాను ఇప్పటివరకు 52,529 మంది డిశ్చార్జ్ కాగా, 1,213 మంది మరణించారు. ప్రస్తుతం 63,753 చికిత్స పొందుతున్నారు. కేసులు భారీగా నమోదు కాగా… ఈరోజు డిశ్చార్జి అయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కేవలం 2,784 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈరోజు నమోదైన మరణాలు 65.
అత్యధికంగా తూర్పు గోదావరిలో 1676, అనంతపురంలో 1371, కర్నూలులో 1091 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాలివే.
This post was last modified on July 29, 2020 6:28 pm
హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…