కాస్మొపాలిటన్ నగరాలు లేని రాష్ట్రం దేశంలో కొత్త కేసుల్లో వరుసగా రెండోరోజు నెం.1 స్థానంలో నిలిచింది. అది కూడా అత్యధిక టెస్టులు చేస్తూ వస్తున్నా వ్యాప్తి కంట్రోల్ కాకపోగా పెరుగుతూనే ఉంటూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తూనే ఉంది.
తాజాగా ఏపీ సర్కారు కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం విడుదల చేసిన లెక్కల ప్రకారం…రాష్ట్రంలో కొత్తగా గడిచిన 24 గంటల్లో 10093 కేసులు నమోదయ్యాయి. నిన్నటి నివేదిక ప్రకారం… సుమారు 8వేల కేసులతో దేశంలో కేసులలో ఒక్కరోజు సంఖ్యలో నెం.1గా నిలిచిన ఏపీ వరుసగా రెండో రోజు పదివేల కేసులతో నెం.1 గా నిలిచింది.
ఇదిలా ఉండగా… కేసులే కాదు పరీక్షలు కూడా అధికంగానే జరిగాయి. తాజాగా ఏపీలో 70,584 శాంపిల్స్ను పరీక్షించారు. ఇందులో 37,199 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు కాగా మిగతావి ఆర్టీపీసీఆర్ టెస్టులు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 18,20,009 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,17,495 పాజిటివ్ కేసు లకు గాను ఇప్పటివరకు 52,529 మంది డిశ్చార్జ్ కాగా, 1,213 మంది మరణించారు. ప్రస్తుతం 63,753 చికిత్స పొందుతున్నారు. కేసులు భారీగా నమోదు కాగా… ఈరోజు డిశ్చార్జి అయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కేవలం 2,784 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈరోజు నమోదైన మరణాలు 65.
అత్యధికంగా తూర్పు గోదావరిలో 1676, అనంతపురంలో 1371, కర్నూలులో 1091 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాలివే.
This post was last modified on July 29, 2020 6:28 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…