కరోనా చుట్టూ ఎప్పుడై నెగెటివ్ న్యూసే చూస్తున్నాం. కానీ ఈ మహమ్మారి వల్ల కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. కాలుష్యం తగ్గడం.. మనుషుల మధ్య దూరం తగ్గి, బంధాలు బలపడటం లాంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ కోవలోనే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇద్దరి మనసులు కలిసి.. పెళ్లి బంధంతో ఒక్కటి కావడం విశేషం. ఇది జరిగింది మన తెలుగు గడ్డ మీదే కావడం విశేషం. దీనికి సంబంధిని వార్తా కథనాలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ కరోనా ప్రేమకథ విశేషాలేంటో చూద్దాం పదండి.
ఆ అబ్బాయిది ప్రకాశం జిల్లా పర్చూరు.. అమ్మాయిది గుంటూరు జిల్లా చిలకలూరి పేట. అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. అమ్మాయి కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. వీళ్లిద్దరూ ఈ మధ్యే కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడింది.
ఇద్దరూ గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. పక్క పక్క బెడ్లలో ఉండటంతో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. కరోనా తీవ్రత అంతగా లేకపోవడంతో ఆసుపత్రిలో సరదాగానే గడిపారు. ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసింది. అభిరుచులు కలిశాయి.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ఫోన్ నంబర్లతో పాటు మనసులు ఇచ్చి పుచ్చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కూడా కావడంతో ఇరు వైపులా పెద్దలకూ పెళ్లి చేసేందుకు అభ్యంతరం లేకపోయింది.
ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేకపోవడంతో ఆలస్యం చేయకుండా.. హడావుడి లేకుండా ఇటీవలే పొన్నూరులోని ఓ దేవాలయంలో పెద్దల సమక్షంలో వారి పెళ్లి చేసేశారు. పరిచయం నుంచి పెళ్లి వరకు మొత్తం వ్యవహారం కేవలం నెల రోజుల లోపే అయిపోవడం విశేషం. కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
This post was last modified on July 29, 2020 10:46 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మధ్యంతర ఎన్నికల సెగ భారీగా తగిలేలా కనిపిస్తోంది. మధ్యంతర ఎన్నికలు వచ్చే అక్టోబరు-నవంబరు మాసాల…
పెద్ది తర్వాత దర్శకుడు బుచ్చిబాబు బయట ఎక్కువ కనిపించడం లేదు. ఇరుముడి లాంటి ఒకటి రెండు ఈవెంట్స్ లో స్టేజి…
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల్లో మహేంద్రగిరి వారాహి మీద క్రమంగా అటెన్షన్ వస్తోంది. పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ కంటెంట్…
అమెరికాలో H-1B వీసాపై విదేశీ ఉద్యోగిని తీసుకోవాలంటే కంపెనీలు భారీగా అదనపు ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రతి H-1B…
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన…
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు…అంటే రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడితో సమానం అన్న నానుడిని ఇప్పటికీ చాలామంది…