కరోనా చుట్టూ ఎప్పుడై నెగెటివ్ న్యూసే చూస్తున్నాం. కానీ ఈ మహమ్మారి వల్ల కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. కాలుష్యం తగ్గడం.. మనుషుల మధ్య దూరం తగ్గి, బంధాలు బలపడటం లాంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ కోవలోనే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇద్దరి మనసులు కలిసి.. పెళ్లి బంధంతో ఒక్కటి కావడం విశేషం. ఇది జరిగింది మన తెలుగు గడ్డ మీదే కావడం విశేషం. దీనికి సంబంధిని వార్తా కథనాలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ కరోనా ప్రేమకథ విశేషాలేంటో చూద్దాం పదండి.
ఆ అబ్బాయిది ప్రకాశం జిల్లా పర్చూరు.. అమ్మాయిది గుంటూరు జిల్లా చిలకలూరి పేట. అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. అమ్మాయి కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. వీళ్లిద్దరూ ఈ మధ్యే కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడింది.
ఇద్దరూ గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. పక్క పక్క బెడ్లలో ఉండటంతో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. కరోనా తీవ్రత అంతగా లేకపోవడంతో ఆసుపత్రిలో సరదాగానే గడిపారు. ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసింది. అభిరుచులు కలిశాయి.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ఫోన్ నంబర్లతో పాటు మనసులు ఇచ్చి పుచ్చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కూడా కావడంతో ఇరు వైపులా పెద్దలకూ పెళ్లి చేసేందుకు అభ్యంతరం లేకపోయింది.
ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేకపోవడంతో ఆలస్యం చేయకుండా.. హడావుడి లేకుండా ఇటీవలే పొన్నూరులోని ఓ దేవాలయంలో పెద్దల సమక్షంలో వారి పెళ్లి చేసేశారు. పరిచయం నుంచి పెళ్లి వరకు మొత్తం వ్యవహారం కేవలం నెల రోజుల లోపే అయిపోవడం విశేషం. కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
This post was last modified on July 29, 2020 10:46 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…