కరోనా చుట్టూ ఎప్పుడై నెగెటివ్ న్యూసే చూస్తున్నాం. కానీ ఈ మహమ్మారి వల్ల కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. కాలుష్యం తగ్గడం.. మనుషుల మధ్య దూరం తగ్గి, బంధాలు బలపడటం లాంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ కోవలోనే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇద్దరి మనసులు కలిసి.. పెళ్లి బంధంతో ఒక్కటి కావడం విశేషం. ఇది జరిగింది మన తెలుగు గడ్డ మీదే కావడం విశేషం. దీనికి సంబంధిని వార్తా కథనాలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ కరోనా ప్రేమకథ విశేషాలేంటో చూద్దాం పదండి.
ఆ అబ్బాయిది ప్రకాశం జిల్లా పర్చూరు.. అమ్మాయిది గుంటూరు జిల్లా చిలకలూరి పేట. అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. అమ్మాయి కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. వీళ్లిద్దరూ ఈ మధ్యే కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడింది.
ఇద్దరూ గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. పక్క పక్క బెడ్లలో ఉండటంతో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. కరోనా తీవ్రత అంతగా లేకపోవడంతో ఆసుపత్రిలో సరదాగానే గడిపారు. ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసింది. అభిరుచులు కలిశాయి.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ఫోన్ నంబర్లతో పాటు మనసులు ఇచ్చి పుచ్చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కూడా కావడంతో ఇరు వైపులా పెద్దలకూ పెళ్లి చేసేందుకు అభ్యంతరం లేకపోయింది.
ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేకపోవడంతో ఆలస్యం చేయకుండా.. హడావుడి లేకుండా ఇటీవలే పొన్నూరులోని ఓ దేవాలయంలో పెద్దల సమక్షంలో వారి పెళ్లి చేసేశారు. పరిచయం నుంచి పెళ్లి వరకు మొత్తం వ్యవహారం కేవలం నెల రోజుల లోపే అయిపోవడం విశేషం. కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
This post was last modified on July 29, 2020 10:46 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…