కిమ్. ఈ రెండు అక్షరాలకు.. ఈ పేరుకు ఇటీవల కాలంలో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఉత్తర కొరియాను అప్రతిహతంగా పాలిస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. అక్కడి ప్రజల విషయంలోనేకాదు.. నాయకులు.. రాజకీయంగా కూడా నియంతృత్వ ధోరణితోనే ముందు కు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కిమ్ పాలిత ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. అంతేకాదు.. ప్రపంచానికి.. ఉత్తర కొరియాకు మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయాయనే చెప్పాలి.
ఏదో చైనా వంటి ఒకటి రెండు దేశాలతోనే ఉత్తర కొరియా టచ్లో ఉంది. ఇదిలావుంటే.. తాజాగా కిమ్ తన విశ్వరూపాన్ని మరోసారి చూపించారని తెలిసింది. వాస్తవానికి ఉత్తరకొరియా ప్రజలు బయటి ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తెలుసుకొని చైతన్యం పొందుతారేమోనని, దాని వల్ల తన కుటుంబ పాలనకు ఆటంకం కలుగుతుందేమోనని కిమ్ అనుక్షణం భయపడుతుంటాడు.
ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకుండా చేశారు. విధుల నిమిత్తం కావాలన్నా.. వాటి వరకే పరిమితం కావాలి. ఏ చిన్న తేడా వచ్చినా.. తలలే ఎగిరిపోతాయ్!! తన ప్రత్యర్థి దేశాలకు చెందిన మ్యూజిక్, సిరీస్లను దేశంలోకి రానివ్వకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు. వాటిని చూసి పిల్లలు దొరికితే.. ఆరు నెలల పాటు తల్లిదండ్రులను కార్మిక శిబిరాలకు తరలిస్తారు. పిల్లలని చూడకుండా ఐదేళ్ల శిక్ష విధిస్తున్నారు.
మరి ఇంత కఠిన ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఓ అధికారి సాహసం చేశాడు. ప్రజల కమ్యూనికేషన్ వ్యవహారాలు చూస్తున్న బ్యూరోలో పనిచేస్తున్న గూఢచారికి తన బాధ్యతల దృష్ట్యా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసుకోవడానికి అనుమతి లభించింది. దీంతో సదరు గూఢచారి.. అసలు పని మానేసి.. కిమ్ గురించి తెలిసినా.. ఆయన వ్యక్తిగత వివరాలు వెతికే ధైర్యం చేశాడు. ఈ విషయం తెలిసిన.. కిమ్.. వెంటనే ఆయనకు మరణ శిక్ష విధించారు. ఇదే విషయానికి సంబంధించి మరికొందరు ఉన్నతాధికారులను విధుల నుంచి బహిష్కరించారు. ఇదీ.. కిమ్ పరిస్థితి!
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…