Trends

మ్యాచ్ అవ్వకముందే.. టెన్షన్ తీరిపోయింది


భారత క్రికెట్ జట్టును కొన్ని రోజుల నుంచి ఒక టెన్షన్ వెంటాడుతోంది. ఒక దశలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ రేసులో బాగా వెనుకబడ్డట్లు కనిపించిన టీమ్ ఇండియా.. వరుస విజయాలతో పట్టికలో పైపైకి ఎగబాకింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై వరుసగా రెండు టెస్టుల్లో విజయం సాధించడంతో ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు దక్కడం లాంఛనం లాగే కనిపించింది. కానీ మూడో టెస్టులో కంగారూల చేతిలో అనూహ్యంగా ఓడడంతో సమీకరణాలు మారిపోయాయి.

న్యూజిలాండ్‌లో రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సిన శ్రీలంక.. అందులో 2-0తో గెలిస్తే.. అదే సమయంలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో భారత్ గెలవకపోతే ఫైనల్ బెర్తు దూరం అయ్యే పరిస్థితి తలెత్తింది. అహ్మదాబాద్‌లో చివరి టెస్టు తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా ఆధిపత్యం చలాయించగా.. అదే సమయంలో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శ్రీలంక ఆధిపత్యం కనిపించింది. దీంతో భారత్‌కు టెన్షన్ తప్పలేదు.

కానీ కింగ్ కోహ్లి సరైన సమయంలో ఫామ్ అందుకున్నాడు. 186 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో జట్టును ప్రమాదం నుంచి బయటపడేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడేందుకు ఆస్కారమే లేకుండా చేశాడు. మరోవైపు శ్రీలంక-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. న్యూజిలాండ్‌కు లంక 285 పరుగుల ప్రమాదకర లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆటలో చివరి రోజైన సోమవారం కివీస్‌ గొప్పగా పోరాడి 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. లంక తొలి టెస్టులో ఓడిపోవడంతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో టీమ్ ఇండియా టెన్షన్ తీరిపోయింది.

ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కాగా ఈ మ్యాచ్‌ డ్రాగా ముగియడం లాంఛనమే. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులు వెనుకబడ్డ ఆస్ట్రేలియా.. సోమవారం మధ్యాహ్నానికి వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా ఆలౌటై.. భారత్ ఆ లక్ష్యాన్ని ఛేదించడం.. జరిగే పని కాదు కాబట్టి మ్యాచ్ డ్రానే. 2-1తో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకోనుంది.

This post was last modified on March 13, 2023 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆర్టీసీ స‌మ్మె… అసలు కారణం ఇదేనా?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. త‌ద్వారా ఉద్యోగాల‌కు పొంచి…

36 minutes ago

నాయకుడు బయటికి వచ్చేది ఎప్పుడు

తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…

1 hour ago

ఆర్టీసీ డ్రైవర్ బలిదానం.. సీఎంకు పెద్ద పరీక్ష

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…

2 hours ago

అనంతపురం హనీట్రాప్ గుట్టు వీడింది

సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…

5 hours ago

సమంత చేతికి బంగారం లాంటి ఛాన్స్

బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…

6 hours ago

వైసీపీ మైన‌స్ `నాలుగు`?

ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి 4 నియోజ‌క‌వ‌ర్గాలు చేజారి పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.…

7 hours ago