అనూహ్యంగా చోటు చేసుకునే కొన్ని ఘటనలు ఎలాంటి పరిణామాలకు తెర తీస్తాయనటానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ఇండోర్ కు చెందిన ఆ బాలకార్మికుడి ఏడుపు అతన్ని సెలబ్రిటీగా మార్చటమే కాదు.. అతని జీవితాన్ని మారిపోయేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే..
ఆ పిల్లాడి పేరు పరాస్. వయసు పదమూడేళ్లు.
పేదరికంతో తల్లడిల్లే అతడి కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు తనకు తోచిన వ్యాపారాన్ని చేస్తుంటాడు. ఇందులో భాగంగా తోపుడు బండి మీద కోడిగుడ్లు అమ్ముతంటాడు. అలా ఆ పిల్లాడి జీవితం సాగుతున్న వేళ.. తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుమారు రూ.7వేలు విలువైన కోడిగుడ్లు ఉన్న ట్రేను తోపుడు బండి మీద పెట్టుకొని రోడ్డు మీద వెళుతూ.. రోడ్డు పక్కన తన బండిని నిలిపి పక్కకు వెళ్లాడు.
అంతలో అక్కడకు వచ్చిన మున్సిపల్ కార్మికులు ఆ బాలుడ్ని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.100 ఫైన్ వేశారు. అంతలోనే.. కోపంతో ఆ బండిని గిరాటేశారు. దీంతో బండి తలకిందులై.. కోడిగుడ్లు మొత్తం కిందపడి పగిలిపోయాయి. కళ్ల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామంతో షాక్ కు గురైన ఆ పిల్లాడు.. పెద్ద ఎత్తున రోదించసాగాడు. అతడి ఏడుపు రోడ్డు మీద వెళ్లే వారిని ఆపేలా చేయటమే కాదు.. ఈ మొత్తం ఉదంతాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇది కాస్తా వైరల్ గా మారింది. మున్సిపల్ సిబ్బంది దాష్ఠీకాన్ని పలువురు తప్పు పట్టారు. భారీగా నష్టపోయిన ఆ పిల్లాడి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఆ పిల్లాడి మీద పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమైంది. పలువురు ఆ పిల్లాడికి భారీగా సాయం చేస్తామని ముందుకు వచ్చారు. అలాంటివారిలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆ పిల్లాడికి రూ.10వేలు పంపారు. అంతేకాదు..ఆ పిల్లాడి చదువుకు అయ్యే మొత్తాన్ని తాను భరిస్తానని చెప్పారు.
దీనిపై ఇండోర్ 2 బీజేపీ ఎమ్మెల్యే స్పందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆ బాలుడికి ఒక ఇంటిని ఇప్పిస్తానని వరాన్నిఇచ్చేశారు. అతడి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని చెప్పటమే కాదు.. రూ.2500 మొత్తాన్ని.. బట్టల్ని.. ఒక సైకిల్ ను పంపారు. ఒకరి తర్వాత ఒకరు స్పందించటంతో.. ఒక విధమైన రాజకీయం మొదలైంది.
ఒకరిమీద ఒకరు పోటీతో సాయాన్ని ప్రకటించటం.. ఇంటికి వచ్చి పరామర్శించటంతో ఆ పిల్లాడు ఇప్పుడు చిన్నసైజు సెలబ్రిటీలా మారాడు. ఇంతకాలం బాలకార్మికుడిగా బతుకు బండి లాగిన ఆ కుర్రాడు ఇప్పుడు ఏకంగా స్కూలుకు వెళ్లే అవకాశం లభించింది. మొత్తానికి దీనంగా ఏడ్చిన ఏడుపు ఆ పిల్లాడి ఫ్యూచర్ మారేలా చేసిందని చెప్పక తప్పదు.
This post was last modified on July 27, 2020 3:15 pm
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…