Trends

ఇది ఒక ‘గుడ్డు‘ స్టోరీ !

అనూహ్యంగా చోటు చేసుకునే కొన్ని ఘటనలు ఎలాంటి పరిణామాలకు తెర తీస్తాయనటానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ఇండోర్ కు చెందిన ఆ బాలకార్మికుడి ఏడుపు అతన్ని సెలబ్రిటీగా మార్చటమే కాదు.. అతని జీవితాన్ని మారిపోయేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే..
ఆ పిల్లాడి పేరు పరాస్. వయసు పదమూడేళ్లు.

పేదరికంతో తల్లడిల్లే అతడి కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు తనకు తోచిన వ్యాపారాన్ని చేస్తుంటాడు. ఇందులో భాగంగా తోపుడు బండి మీద కోడిగుడ్లు అమ్ముతంటాడు. అలా ఆ పిల్లాడి జీవితం సాగుతున్న వేళ.. తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుమారు రూ.7వేలు విలువైన కోడిగుడ్లు ఉన్న ట్రేను తోపుడు బండి మీద పెట్టుకొని రోడ్డు మీద వెళుతూ.. రోడ్డు పక్కన తన బండిని నిలిపి పక్కకు వెళ్లాడు.

అంతలో అక్కడకు వచ్చిన మున్సిపల్ కార్మికులు ఆ బాలుడ్ని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.100 ఫైన్ వేశారు. అంతలోనే.. కోపంతో ఆ బండిని గిరాటేశారు. దీంతో బండి తలకిందులై.. కోడిగుడ్లు మొత్తం కిందపడి పగిలిపోయాయి. కళ్ల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామంతో షాక్ కు గురైన ఆ పిల్లాడు.. పెద్ద ఎత్తున రోదించసాగాడు. అతడి ఏడుపు రోడ్డు మీద వెళ్లే వారిని ఆపేలా చేయటమే కాదు.. ఈ మొత్తం ఉదంతాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇది కాస్తా వైరల్ గా మారింది. మున్సిపల్ సిబ్బంది దాష్ఠీకాన్ని పలువురు తప్పు పట్టారు. భారీగా నష్టపోయిన ఆ పిల్లాడి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఆ పిల్లాడి మీద పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమైంది. పలువురు ఆ పిల్లాడికి భారీగా సాయం చేస్తామని ముందుకు వచ్చారు. అలాంటివారిలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆ పిల్లాడికి రూ.10వేలు పంపారు. అంతేకాదు..ఆ పిల్లాడి చదువుకు అయ్యే మొత్తాన్ని తాను భరిస్తానని చెప్పారు.

దీనిపై ఇండోర్ 2 బీజేపీ ఎమ్మెల్యే స్పందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆ బాలుడికి ఒక ఇంటిని ఇప్పిస్తానని వరాన్నిఇచ్చేశారు. అతడి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని చెప్పటమే కాదు.. రూ.2500 మొత్తాన్ని.. బట్టల్ని.. ఒక సైకిల్ ను పంపారు. ఒకరి తర్వాత ఒకరు స్పందించటంతో.. ఒక విధమైన రాజకీయం మొదలైంది.

ఒకరిమీద ఒకరు పోటీతో సాయాన్ని ప్రకటించటం.. ఇంటికి వచ్చి పరామర్శించటంతో ఆ పిల్లాడు ఇప్పుడు చిన్నసైజు సెలబ్రిటీలా మారాడు. ఇంతకాలం బాలకార్మికుడిగా బతుకు బండి లాగిన ఆ కుర్రాడు ఇప్పుడు ఏకంగా స్కూలుకు వెళ్లే అవకాశం లభించింది. మొత్తానికి దీనంగా ఏడ్చిన ఏడుపు ఆ పిల్లాడి ఫ్యూచర్ మారేలా చేసిందని చెప్పక తప్పదు.

Satya

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

5 minutes ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

14 minutes ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

2 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

2 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

3 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

3 hours ago