Trends

ఇది ఒక ‘గుడ్డు‘ స్టోరీ !

అనూహ్యంగా చోటు చేసుకునే కొన్ని ఘటనలు ఎలాంటి పరిణామాలకు తెర తీస్తాయనటానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ఇండోర్ కు చెందిన ఆ బాలకార్మికుడి ఏడుపు అతన్ని సెలబ్రిటీగా మార్చటమే కాదు.. అతని జీవితాన్ని మారిపోయేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే..
ఆ పిల్లాడి పేరు పరాస్. వయసు పదమూడేళ్లు.

పేదరికంతో తల్లడిల్లే అతడి కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు తనకు తోచిన వ్యాపారాన్ని చేస్తుంటాడు. ఇందులో భాగంగా తోపుడు బండి మీద కోడిగుడ్లు అమ్ముతంటాడు. అలా ఆ పిల్లాడి జీవితం సాగుతున్న వేళ.. తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుమారు రూ.7వేలు విలువైన కోడిగుడ్లు ఉన్న ట్రేను తోపుడు బండి మీద పెట్టుకొని రోడ్డు మీద వెళుతూ.. రోడ్డు పక్కన తన బండిని నిలిపి పక్కకు వెళ్లాడు.

అంతలో అక్కడకు వచ్చిన మున్సిపల్ కార్మికులు ఆ బాలుడ్ని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.100 ఫైన్ వేశారు. అంతలోనే.. కోపంతో ఆ బండిని గిరాటేశారు. దీంతో బండి తలకిందులై.. కోడిగుడ్లు మొత్తం కిందపడి పగిలిపోయాయి. కళ్ల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామంతో షాక్ కు గురైన ఆ పిల్లాడు.. పెద్ద ఎత్తున రోదించసాగాడు. అతడి ఏడుపు రోడ్డు మీద వెళ్లే వారిని ఆపేలా చేయటమే కాదు.. ఈ మొత్తం ఉదంతాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇది కాస్తా వైరల్ గా మారింది. మున్సిపల్ సిబ్బంది దాష్ఠీకాన్ని పలువురు తప్పు పట్టారు. భారీగా నష్టపోయిన ఆ పిల్లాడి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఆ పిల్లాడి మీద పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమైంది. పలువురు ఆ పిల్లాడికి భారీగా సాయం చేస్తామని ముందుకు వచ్చారు. అలాంటివారిలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆ పిల్లాడికి రూ.10వేలు పంపారు. అంతేకాదు..ఆ పిల్లాడి చదువుకు అయ్యే మొత్తాన్ని తాను భరిస్తానని చెప్పారు.

దీనిపై ఇండోర్ 2 బీజేపీ ఎమ్మెల్యే స్పందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆ బాలుడికి ఒక ఇంటిని ఇప్పిస్తానని వరాన్నిఇచ్చేశారు. అతడి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని చెప్పటమే కాదు.. రూ.2500 మొత్తాన్ని.. బట్టల్ని.. ఒక సైకిల్ ను పంపారు. ఒకరి తర్వాత ఒకరు స్పందించటంతో.. ఒక విధమైన రాజకీయం మొదలైంది.

ఒకరిమీద ఒకరు పోటీతో సాయాన్ని ప్రకటించటం.. ఇంటికి వచ్చి పరామర్శించటంతో ఆ పిల్లాడు ఇప్పుడు చిన్నసైజు సెలబ్రిటీలా మారాడు. ఇంతకాలం బాలకార్మికుడిగా బతుకు బండి లాగిన ఆ కుర్రాడు ఇప్పుడు ఏకంగా స్కూలుకు వెళ్లే అవకాశం లభించింది. మొత్తానికి దీనంగా ఏడ్చిన ఏడుపు ఆ పిల్లాడి ఫ్యూచర్ మారేలా చేసిందని చెప్పక తప్పదు.

This post was last modified on July 27, 2020 3:15 pm

Share
Show comments
Published by
Satya
Tags: BoyTrends

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago