వర్సిటీ కాల్పుల్ని మరవక ముందే మాల్ లో.. అమెరికా గన్ కల్చర్ కు మరొకరు బలి
గన్ కల్చర్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలో వరుస విషాదాంతాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలోని ప్రధాన క్యాంపస్ లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. అమెరికాలోని అతి పెద్ద వర్సిటీల్లో ఒకటైన మిచిగాన్ వర్సిటీలో చోటు చేసుకున్న కాల్పులు సంచలనంగా మారాయి.
దీనికి సంబంధించిన భయాందోళనలు ఇంకా ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా టెక్సాస్ లోని ఒక షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఇందులో ఒకరు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ఆధారంగా చూస్తే.. టెక్సాస్ లోని ఎప్ పాసో ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిన ఒక ఆగంతుకుడు వెనుకా ముందు చూసుకోకుండా కాల్పులు జరిపారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం సాయంత్రం ఈ ఉదంతం చోటు చేసుకుంది.
కాల్పుల సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక కార్యక్రమాల్ని చేపట్టారు. షాపింగ్ మాల్ లో గన్ పేలిన శబ్ధం విన్నంతనే ఎక్కడి వారు అక్కడి నుంచి బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ కాల్పులకు సంబంధించిన కారణం ఏమిటన్నది బయటకు రాలేదు. కాల్పుల ఘటన చోటు చేసుకున్న తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే ఒక అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు. పోలీసులు మాత్రం అరెస్టుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించలేదు. ఇటీవల కాలంలో కాల్పుల ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.
This post was last modified on February 16, 2023 10:56 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…