వర్సిటీ కాల్పుల్ని మరవక ముందే మాల్ లో.. అమెరికా గన్ కల్చర్ కు మరొకరు బలి
గన్ కల్చర్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలో వరుస విషాదాంతాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలోని ప్రధాన క్యాంపస్ లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. అమెరికాలోని అతి పెద్ద వర్సిటీల్లో ఒకటైన మిచిగాన్ వర్సిటీలో చోటు చేసుకున్న కాల్పులు సంచలనంగా మారాయి.
దీనికి సంబంధించిన భయాందోళనలు ఇంకా ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా టెక్సాస్ లోని ఒక షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఇందులో ఒకరు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ఆధారంగా చూస్తే.. టెక్సాస్ లోని ఎప్ పాసో ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిన ఒక ఆగంతుకుడు వెనుకా ముందు చూసుకోకుండా కాల్పులు జరిపారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం సాయంత్రం ఈ ఉదంతం చోటు చేసుకుంది.
కాల్పుల సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక కార్యక్రమాల్ని చేపట్టారు. షాపింగ్ మాల్ లో గన్ పేలిన శబ్ధం విన్నంతనే ఎక్కడి వారు అక్కడి నుంచి బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ కాల్పులకు సంబంధించిన కారణం ఏమిటన్నది బయటకు రాలేదు. కాల్పుల ఘటన చోటు చేసుకున్న తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే ఒక అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు. పోలీసులు మాత్రం అరెస్టుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించలేదు. ఇటీవల కాలంలో కాల్పుల ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.
This post was last modified on February 16, 2023 10:56 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…