వర్సిటీ కాల్పుల్ని మరవక ముందే మాల్ లో.. అమెరికా గన్ కల్చర్ కు మరొకరు బలి
గన్ కల్చర్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలో వరుస విషాదాంతాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలోని ప్రధాన క్యాంపస్ లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. అమెరికాలోని అతి పెద్ద వర్సిటీల్లో ఒకటైన మిచిగాన్ వర్సిటీలో చోటు చేసుకున్న కాల్పులు సంచలనంగా మారాయి.
దీనికి సంబంధించిన భయాందోళనలు ఇంకా ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా టెక్సాస్ లోని ఒక షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఇందులో ఒకరు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ఆధారంగా చూస్తే.. టెక్సాస్ లోని ఎప్ పాసో ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిన ఒక ఆగంతుకుడు వెనుకా ముందు చూసుకోకుండా కాల్పులు జరిపారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం సాయంత్రం ఈ ఉదంతం చోటు చేసుకుంది.
కాల్పుల సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక కార్యక్రమాల్ని చేపట్టారు. షాపింగ్ మాల్ లో గన్ పేలిన శబ్ధం విన్నంతనే ఎక్కడి వారు అక్కడి నుంచి బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ కాల్పులకు సంబంధించిన కారణం ఏమిటన్నది బయటకు రాలేదు. కాల్పుల ఘటన చోటు చేసుకున్న తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే ఒక అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు. పోలీసులు మాత్రం అరెస్టుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించలేదు. ఇటీవల కాలంలో కాల్పుల ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.
This post was last modified on February 16, 2023 10:56 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…