కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో తెలిసిందే. ఐతే ఆ మహమ్మారి ప్రభావం బాగా తగ్గాక కూడా దాని దుష్ప్రభావాలు కొనసాగుతూ ఇబ్బంది పడుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు.
ఆ సంగతలా ఉంచితే కొవిడ్ వ్యాక్సిన్లు మనుషుల మీద దీర్ఘ కాలంలో ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే చర్చ కూడా చాన్నాళ్ల నుంచే నడుస్తోంది. ఎంతో ఆరోగ్యంగా కనిపించే చాలామంది వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా గుండెపోటు లాంటి కారణాలతో చనిపోతున్న తీరు విస్మయం కలిగిస్తోంది.
ఇందుకు ఒక రకంగా కరోనా వ్యాక్సిన్లు ఒక కారణం అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ విషయాన్ని కచ్చితంగా మాత్రం ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా వైద్య నిపుణులు ఈ విషయాలను కొట్టిపారేస్తున్నారు.
ఐతే అసీమ్ మల్హోత్రా అనే భారత సంతతికి చెందిన బ్రిటిష్ కార్డియాలజిస్ట్.. ప్రఖ్యాత ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనికా తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కొవిషీల్డ్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాక్సిన్ ప్రమాదకరమని ఆయన తేల్చేశారు.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల కన్నా కొవిషీల్డ్ దుష్ప్రభావాలు మనుషులపై ఎక్కువ ఉన్నాయని అసీమ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. కొవిషీల్డ్ వల్ల గుండెపోటు, పక్షవాతం తదితర దుష్ప్రభావాలు కలిగాయన్నారు.
బ్రిటన్లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పది శాతం మంది దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లుగా మల్హోత్రా పేర్కొన్నారు. ఇండియాలో భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్తో పాటు కొవిషీల్డ్ వ్యాక్సిన్ను విస్తృతంగా ఉపయోగించారు.
ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కొవిడ్ తీవ్రత దృష్ట్యా చాలా హడావుడిగా, పూర్తి స్థాయి ట్రయల్స్ లేకుండా కొవిడ్ వ్యాక్సిన్లను తయారు చేయడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయని ముందు నుంచి అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…