రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో రష్యాను బలంగా నిలువరిస్తున్న ఉక్రెయిన్ సైనికులు ప్రాణత్యాగాలకు కూడా వెరువకుండా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఉక్రెయిన్ సైనికుడు చాలా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. రష్యావిసిరిన బాంబు.. ఆయన శరీరంలో ఎలా చేరిందో తెలియదు కానీ.. గ్రెనేడ్ లాంచర్ నుంచి విసిరిన బాంబు పేలకుండా.. గురి తప్పి.. ఉక్రెయిన్ సైనికుడి పక్కటెముకల్లోకి చేరింది.
అయితే.. అది పేలుడు పదార్థం కావడంతో ఏ క్షణంలో అయినా.. పేలే అవకాశం ఉందని గుర్తించిన ఉక్రెయిన్ సైన్యం సదరు సైనికుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ చేసి.. లైవ్ బాంబును పక్క టెముల నుంచి తొలగించి సైనికుడి ప్రాణాలను రక్షించారు.
రష్యా దాడిలో రైఫిల్కు అనుసంధానించబడిన గ్రెనేడ్ లాంచర్ నుంచి గురితప్పిన పేలని గ్రెనేడ్ ఉక్రేనియన్ సైనికుడి మొండెంలో చేరిపోయింంది. ఆ వ్యక్తి శరీరం నుంచి లైవ్ బాంబును సర్జన్ తొలగించారు. పేలుడు పదార్థం ఏ సమయంలోనైనా పేలిపోయే ప్రమాదం ఉంది. అయితే, డాక్టర్లు చేసిన ఆపరేషన్ తర్వాత ఉక్రెయిన్ సైనికుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు అని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
బఖ్ముట్ ప్రాంతంలో జరుగుతున్న దాడుల్లో ఈ బాంబు సైనికుడి శరీరంలో చేరిందని వివరించారు. ఆపరేషన్ చేసే సమయంలో మరో ఇద్దరు సైనికులు అక్కడే ఉండి.. బాంబు పేలకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు ఉక్రెయిన్ తెలిపింది . అదేసమయంలో బాంబు ఎక్స్ప్లోజివ్ టీం కూడా ఆసుపత్రి వద్దే ఉన్నట్టు తెలిపింది.
ఉక్రేనియన్ సర్జన్ మేజర్ జనరల్ ఆండ్రీ వెర్బా ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్లో పలువురు వైద్యులు పాలు పంచుకున్నారు. అయితే.. వీరు కూడా ప్రాణాలకు తెగించే ఈ ఆపరేషన్ చేసినట్టు సైన్యం పేర్కొంది. “మా సైనిక వైద్యులు సైనికుడి శరీరం నుండి పేలని VOG గ్రెనేడ్ను తొలగించడానికి ఆపరేషన్ చేసారు” అని ప్రాంతీయ గవర్నర్ సెర్హీ బోర్జోవ్ ధృవీకరించారు.
పేలుడు ముప్పు ఉండడంతో మరో ఇద్దరు సైనికులతో కలిసి సర్జరీ చేశారని తెలిపారు. రక్తస్రావం నియంత్రించడానికి, అసాధారణ కణజాలాన్ని నాశనం చేయడానికి వేడిని ఉపయోగించే శస్త్రచికిత్స – నిర్వహించలేదని, గ్రెనేడ్ను ఇది ప్రేరేపించవచ్చునని పేర్కొన్నారు. అయితే, మరో మార్గంలో ఆపరేషన్ చేసిన డాక్టర్ వెర్బా విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి గ్రెనేడ్ను తొలగించగలిగారని బోర్జోవ్ తెలిపారు.
This post was last modified on January 11, 2023 2:39 pm
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…