రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో రష్యాను బలంగా నిలువరిస్తున్న ఉక్రెయిన్ సైనికులు ప్రాణత్యాగాలకు కూడా వెరువకుండా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఉక్రెయిన్ సైనికుడు చాలా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. రష్యావిసిరిన బాంబు.. ఆయన శరీరంలో ఎలా చేరిందో తెలియదు కానీ.. గ్రెనేడ్ లాంచర్ నుంచి విసిరిన బాంబు పేలకుండా.. గురి తప్పి.. ఉక్రెయిన్ సైనికుడి పక్కటెముకల్లోకి చేరింది.
అయితే.. అది పేలుడు పదార్థం కావడంతో ఏ క్షణంలో అయినా.. పేలే అవకాశం ఉందని గుర్తించిన ఉక్రెయిన్ సైన్యం సదరు సైనికుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ చేసి.. లైవ్ బాంబును పక్క టెముల నుంచి తొలగించి సైనికుడి ప్రాణాలను రక్షించారు.
రష్యా దాడిలో రైఫిల్కు అనుసంధానించబడిన గ్రెనేడ్ లాంచర్ నుంచి గురితప్పిన పేలని గ్రెనేడ్ ఉక్రేనియన్ సైనికుడి మొండెంలో చేరిపోయింంది. ఆ వ్యక్తి శరీరం నుంచి లైవ్ బాంబును సర్జన్ తొలగించారు. పేలుడు పదార్థం ఏ సమయంలోనైనా పేలిపోయే ప్రమాదం ఉంది. అయితే, డాక్టర్లు చేసిన ఆపరేషన్ తర్వాత ఉక్రెయిన్ సైనికుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు అని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు.
బఖ్ముట్ ప్రాంతంలో జరుగుతున్న దాడుల్లో ఈ బాంబు సైనికుడి శరీరంలో చేరిందని వివరించారు. ఆపరేషన్ చేసే సమయంలో మరో ఇద్దరు సైనికులు అక్కడే ఉండి.. బాంబు పేలకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు ఉక్రెయిన్ తెలిపింది . అదేసమయంలో బాంబు ఎక్స్ప్లోజివ్ టీం కూడా ఆసుపత్రి వద్దే ఉన్నట్టు తెలిపింది.
ఉక్రేనియన్ సర్జన్ మేజర్ జనరల్ ఆండ్రీ వెర్బా ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్లో పలువురు వైద్యులు పాలు పంచుకున్నారు. అయితే.. వీరు కూడా ప్రాణాలకు తెగించే ఈ ఆపరేషన్ చేసినట్టు సైన్యం పేర్కొంది. “మా సైనిక వైద్యులు సైనికుడి శరీరం నుండి పేలని VOG గ్రెనేడ్ను తొలగించడానికి ఆపరేషన్ చేసారు” అని ప్రాంతీయ గవర్నర్ సెర్హీ బోర్జోవ్ ధృవీకరించారు.
పేలుడు ముప్పు ఉండడంతో మరో ఇద్దరు సైనికులతో కలిసి సర్జరీ చేశారని తెలిపారు. రక్తస్రావం నియంత్రించడానికి, అసాధారణ కణజాలాన్ని నాశనం చేయడానికి వేడిని ఉపయోగించే శస్త్రచికిత్స – నిర్వహించలేదని, గ్రెనేడ్ను ఇది ప్రేరేపించవచ్చునని పేర్కొన్నారు. అయితే, మరో మార్గంలో ఆపరేషన్ చేసిన డాక్టర్ వెర్బా విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి గ్రెనేడ్ను తొలగించగలిగారని బోర్జోవ్ తెలిపారు.
This post was last modified on January 11, 2023 2:39 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…