కేవలం 40 అంటే.. 40 నిమిషాలు.. ఇంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువగా టికెట్లు అమ్మాలన్నా.. లక్షల్లో అయితే సాధ్యం కాదు. మెగాస్టార్ నుంచి రాజమౌళి వరకు.. ఎవరి సినిమా అయినా.. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచాన్ని దుమ్ము దులిపేస్తున్న ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీలైనా.. లక్షల్లో ఇంత తక్కువ సమయంలో టికెట్లు అమ్మిన పరిస్థితి లేదు. కానీ, తాజాగా రికార్డు కొట్టేసింది.. టీటీడీ!
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులకు సంబంధించి 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను శనివారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. అయితే.. ఇవి ఇలా విడుదలయ్యాయోలేదో.. వెంటనే కేవలం 40 నిమిషాలలోనే టిక్కెట్ల విక్రయాలు పూర్తి అయ్యాయి.
మొత్తంగా ఈ టికెట్ల విక్రయం ద్వారా టీటీడీ 6 కోట్ల రూపాయలను 40 నిమిషాల్లో సొంత చేసుకుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. టిక్కెట్లు అయిపోయాయ్యన్న విషయం తెలియక ఇంకా వెబ్సైట్లో టిక్కెట్ల కోసం భక్తులు వెతుకుతున్న పరిస్థితి కనిపించింది. దీంతో టీటీడీ ఆన్ లైన్లోనే ప్రకటన చేసింది.
మరోవైపు సర్వ దర్శనం భక్తులకు జనవరి 1న ఆఫ్లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇదీ.. సంగతి! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శన భాగ్యం అంత డిమాండ్ గా మారిపోయిందన్న మాట.
This post was last modified on December 24, 2022 5:19 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…