కేవలం 40 అంటే.. 40 నిమిషాలు.. ఇంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువగా టికెట్లు అమ్మాలన్నా.. లక్షల్లో అయితే సాధ్యం కాదు. మెగాస్టార్ నుంచి రాజమౌళి వరకు.. ఎవరి సినిమా అయినా.. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచాన్ని దుమ్ము దులిపేస్తున్న ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీలైనా.. లక్షల్లో ఇంత తక్కువ సమయంలో టికెట్లు అమ్మిన పరిస్థితి లేదు. కానీ, తాజాగా రికార్డు కొట్టేసింది.. టీటీడీ!
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులకు సంబంధించి 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను శనివారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. అయితే.. ఇవి ఇలా విడుదలయ్యాయోలేదో.. వెంటనే కేవలం 40 నిమిషాలలోనే టిక్కెట్ల విక్రయాలు పూర్తి అయ్యాయి.
మొత్తంగా ఈ టికెట్ల విక్రయం ద్వారా టీటీడీ 6 కోట్ల రూపాయలను 40 నిమిషాల్లో సొంత చేసుకుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. టిక్కెట్లు అయిపోయాయ్యన్న విషయం తెలియక ఇంకా వెబ్సైట్లో టిక్కెట్ల కోసం భక్తులు వెతుకుతున్న పరిస్థితి కనిపించింది. దీంతో టీటీడీ ఆన్ లైన్లోనే ప్రకటన చేసింది.
మరోవైపు సర్వ దర్శనం భక్తులకు జనవరి 1న ఆఫ్లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇదీ.. సంగతి! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శన భాగ్యం అంత డిమాండ్ గా మారిపోయిందన్న మాట.
This post was last modified on December 24, 2022 5:19 pm
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…
మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్…
ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో…
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్.…
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత…