కేవలం 40 అంటే.. 40 నిమిషాలు.. ఇంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువగా టికెట్లు అమ్మాలన్నా.. లక్షల్లో అయితే సాధ్యం కాదు. మెగాస్టార్ నుంచి రాజమౌళి వరకు.. ఎవరి సినిమా అయినా.. ఇంకా చెప్పాలంటే.. ప్రపంచాన్ని దుమ్ము దులిపేస్తున్న ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీలైనా.. లక్షల్లో ఇంత తక్కువ సమయంలో టికెట్లు అమ్మిన పరిస్థితి లేదు. కానీ, తాజాగా రికార్డు కొట్టేసింది.. టీటీడీ!
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులకు సంబంధించి 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను శనివారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. అయితే.. ఇవి ఇలా విడుదలయ్యాయోలేదో.. వెంటనే కేవలం 40 నిమిషాలలోనే టిక్కెట్ల విక్రయాలు పూర్తి అయ్యాయి.
మొత్తంగా ఈ టికెట్ల విక్రయం ద్వారా టీటీడీ 6 కోట్ల రూపాయలను 40 నిమిషాల్లో సొంత చేసుకుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. టిక్కెట్లు అయిపోయాయ్యన్న విషయం తెలియక ఇంకా వెబ్సైట్లో టిక్కెట్ల కోసం భక్తులు వెతుకుతున్న పరిస్థితి కనిపించింది. దీంతో టీటీడీ ఆన్ లైన్లోనే ప్రకటన చేసింది.
మరోవైపు సర్వ దర్శనం భక్తులకు జనవరి 1న ఆఫ్లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇదీ.. సంగతి! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శన భాగ్యం అంత డిమాండ్ గా మారిపోయిందన్న మాట.
This post was last modified on December 24, 2022 5:19 pm
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…