Trends

40 నిమిషాలు.. 2 ల‌క్ష‌ల టికెట్లు.. 6 కోట్ల క‌లెక్ష‌న్‌!!

కేవ‌లం 40 అంటే.. 40 నిమిషాలు.. ఇంత త‌క్కువ స‌మ‌యంలో ఎంత ఎక్కువ‌గా టికెట్లు అమ్మాల‌న్నా.. ల‌క్షల్లో అయితే సాధ్యం కాదు. మెగాస్టార్ నుంచి రాజ‌మౌళి వ‌ర‌కు.. ఎవ‌రి సినిమా అయినా.. ఇంకా చెప్పాలంటే.. ప్ర‌పంచాన్ని దుమ్ము దులిపేస్తున్న ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీలైనా.. ల‌క్ష‌ల్లో ఇంత త‌క్కువ స‌మ‌యంలో టికెట్లు అమ్మిన ప‌రిస్థితి లేదు. కానీ, తాజాగా రికార్డు కొట్టేసింది.. టీటీడీ!

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులకు సంబంధించి 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను శనివారం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే.. ఇవి ఇలా విడుద‌ల‌య్యాయోలేదో.. వెంట‌నే కేవ‌లం 40 నిమిషాలలోనే టిక్కెట్ల విక్రయాలు పూర్తి అయ్యాయి.

మొత్తంగా ఈ టికెట్ల విక్ర‌యం ద్వారా టీటీడీ 6 కోట్ల రూపాయ‌ల‌ను 40 నిమిషాల్లో సొంత చేసుకుంది. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. టిక్కెట్లు అయిపోయాయ్యన్న విషయం తెలియక ఇంకా వెబ్‌సైట్‌లో టిక్కెట్ల కోసం భక్తులు వెతుకుతున్న పరిస్థితి క‌నిపించింది. దీంతో టీటీడీ ఆన్ లైన్‌లోనే ప్ర‌క‌ట‌న చేసింది.

మరోవైపు సర్వ దర్శనం భక్తులకు జనవరి 1న ఆఫ్‌లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇదీ.. సంగతి! అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడి ద‌ర్శ‌న భాగ్యం అంత డిమాండ్ గా మారిపోయింద‌న్న మాట‌.

This post was last modified on December 24, 2022 5:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

9 hours ago