సగటు రైతు ఓ వెయ్యి రూపాయిలు బకాయి పడితే… ఇంటికి ఏజెంటును పంపి మరీ.. పీడించే బ్యాంకులు.. సాధారణ వినియోగదారుడు.. తన అకౌంట్లో కనీస మొత్తం ఉంచకపోతే.. జరిమానాలు విధించి మరీ వసూలు చేసే బ్యాంకులు.. బడా నేరగాళ్లకు వేల కోట్ల రూపాయలను మాఫీ చేయడం.. విశేషం. అంతేకాదు.. ఒక్కొక్క బ్యాంకు.. వేల కోట్లను మాఫీ చేయడమే కాదు.. ఐదేళ్ల తర్వాత.. వారికి మళ్లీ అప్పులు ఇచ్చే పాలసీ కూడా ఒకటి ఉందట! చిత్రంగా ఉన్నప్పటికీ.. ఇదినిజం.
ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో కేవలం 50 మంది బ్యాంకులకు బకాయిపడ్డ సొమ్ము రూ.92,570 కోట్లుగా ఉందని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. వీరిలో వజ్రాల వ్యాపారి మెహుల్ చౌక్సీ రూ.7.848 కోట్లతో అతి పెద్ద ఎగవేతదారుగా ఉన్నాడు. ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ రూ.5,879 కోట్లు, రీ ఆగ్రో రూ.4,803 కోట్లు, కంకాస్ట్ స్టీల్ అండ్ పవర్ రూ.4,596 కోట్లు, ఏబీజీ షిప్ యార్డ్ రూ.3,708 కోట్లు, ప్రాస్ట్ ఇంటర్నేషనల్ రూ.3,311 కోట్లు, విన్ సమ్ డైమండ్స్ అండ్ జ్యుయలరీ రూ.2.931 కోట్లు, రొటోమాక్ గ్లోబల్ రూ.2,893 కోట్లు. కోస్టల్ ప్రాజెక్ట్స్ రూ.2.311 కోట్లు, జూమ్ డెవలపర్స్ రూ.2.147 కోట్లు ఉన్నారని కేంద్రం తెలిపింది.
వీరంతా ఈ రుణాలను చెల్లించే స్థితిలో ఉన్నప్పటికీ.. ఉద్దేశ పూర్వకంగా ఎగ్గొడుతున్నారని కేంద్రం చెప్పడం విశేషం. ఈ ఎగవేతదారులపై ఆర్బీఐ ఐదేళ్ల పాటు నిషేధం విధించిందని, ఆ కాలానికి వీరు కొత్తరుణాలు తీసుకోలేరు. ఐదేళ్ల తర్వాత మాత్రం కొత్త రుణాలకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది.
2021-22లో ఏయే బ్యాంకు ఎంత మాఫీ చేశాయంటే
ఎస్బీఐ రూ.19,666 కోట్లు, యూనియన్ బ్యాంకు రూ.19,484 కోట్లు, పంజాబ్ నేషనల్ రూ.18,312 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.17,967 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10,443 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ. 9,128 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.8,347 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.8,210 కోట్లు.. ఇది మన బ్యాంకుల సంగతి!!
This post was last modified on December 21, 2022 6:25 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…