సెక్స్ వర్కర్స్కు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మారిందా? ఇక్కడ సెక్స్ను అమ్ముతున్నవారు ఎక్కువగా ఉన్నారా? అంటే.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఔనని చెబుతోంది. పడుపువృత్తి చేసుకుంటూ జీవించే సెక్సు కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్టు తెలిపింది. అంతే కాదు.. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి సెక్స్ వ్యాపారం చేస్తున్న వారి సంఖ్యలోనూ ఏపీ ముందు వరుసలోనే ఉందని తెలిపింది.
ఒకప్పుడు ఈ రెండు విషయాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఈ స్థానాన్ని ఏపీ కైవసం చేసుకుందని కేంద్రం స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్స్ విషయంలో ఏపీ అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు పరిగణించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. హెచ్ఐవీ ఎయిడ్స్ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం, స్థానిక సెక్సు కార్మికులు ఏపీలో అత్యధికంగా 1.33 లక్షల మంది ఉన్నారు.
కర్ణాటకలో 1.16 లక్షలు, తెలంగాణలో లక్షమంది ఈ పని ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇక.. సెక్సు కార్మికులు ఏపీలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కూడా హెచ్చరించింది. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగిన సెక్సు కార్మికులు కనిపిస్తున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. ఇక, లెక్కలోకి రాకుండా మరికొన్ని వేలమంది ఉండి ఉంటారని అభిప్రాయపడింది.
This post was last modified on December 21, 2022 3:39 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…