తొమ్మిది మంది అమ్మాయిలు సఫారీ సూట్లు ధరించి తమ X-95 సబ్-మెషిన్ గన్లు, AK-47లు, 9 mm పిస్టల్లను చేతబట్టుకుని కాన్వాయ్ లో వచ్చి తనిఖీలు చేస్తారు. వారు క్షుణ్ణంగా ప్రతీ అంగుళం పరిశీలించిన తరువాతే సీఎం బయటకు వస్తాడు. ఇదంతా యాక్షన్ సినిమాలోని సన్నివేశం కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కి చెందిన ప్రధాన భద్రతా బృందానికి చెందిన సిబ్బంది.
సబ్-ఇన్స్పెక్టర్ ఎం థనుష్ కన్నకి, హెడ్ కానిస్టేబుల్ ఎం ధిల్షాత్ బేగం, కానిస్టేబుల్స్ ఆర్ విద్య, జె సుమతి వీరిలో ప్రధానం కాగా… ఎం కాళీశ్వరి, కె పవిత్ర, జి రామి, వి మోనిషా, కె కౌసల్య కూడా ఈ దళంలో భాగం. ఈ ఏడాది (మార్చి 8) మహిళా దినోత్సవం నాడు ఈ మహిళలు సిఎం కోర్ సెక్యూరిటీ డిటెయిల్లో చేరారు. వారి మొదటి డ్యూటీ అన్నా అరివాలయం (DMK ప్రధాన కార్యాలయం) వద్ద నిర్వర్తించారు.
80 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారుల నుండి షార్ట్లిస్ట్ చేయబడిన మహిళలు ఎంపిక చేయబడటానికి ముందు కఠినమైన శారీరక మరియు మానసిక పరీక్షల్లో పాల్గొన్నారు. పరిశీలన నైపుణ్యం, మానసిక చురుకుదనం వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని వీరి ఎంపిక జరిగింది.ఉదాహరణకు, ఒక నిమిషంలో వీరు ఎదురుగా వస్తున్న కారు, దానిలోని వ్యక్తుల సంఖ్య మరియు పరిసరాలలోని ప్రతిదానిని గుర్తించాల్సి ఉంది.
This post was last modified on December 12, 2022 3:02 pm
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…