తొమ్మిది మంది అమ్మాయిలు సఫారీ సూట్లు ధరించి తమ X-95 సబ్-మెషిన్ గన్లు, AK-47లు, 9 mm పిస్టల్లను చేతబట్టుకుని కాన్వాయ్ లో వచ్చి తనిఖీలు చేస్తారు. వారు క్షుణ్ణంగా ప్రతీ అంగుళం పరిశీలించిన తరువాతే సీఎం బయటకు వస్తాడు. ఇదంతా యాక్షన్ సినిమాలోని సన్నివేశం కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కి చెందిన ప్రధాన భద్రతా బృందానికి చెందిన సిబ్బంది.
సబ్-ఇన్స్పెక్టర్ ఎం థనుష్ కన్నకి, హెడ్ కానిస్టేబుల్ ఎం ధిల్షాత్ బేగం, కానిస్టేబుల్స్ ఆర్ విద్య, జె సుమతి వీరిలో ప్రధానం కాగా… ఎం కాళీశ్వరి, కె పవిత్ర, జి రామి, వి మోనిషా, కె కౌసల్య కూడా ఈ దళంలో భాగం. ఈ ఏడాది (మార్చి 8) మహిళా దినోత్సవం నాడు ఈ మహిళలు సిఎం కోర్ సెక్యూరిటీ డిటెయిల్లో చేరారు. వారి మొదటి డ్యూటీ అన్నా అరివాలయం (DMK ప్రధాన కార్యాలయం) వద్ద నిర్వర్తించారు.
80 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారుల నుండి షార్ట్లిస్ట్ చేయబడిన మహిళలు ఎంపిక చేయబడటానికి ముందు కఠినమైన శారీరక మరియు మానసిక పరీక్షల్లో పాల్గొన్నారు. పరిశీలన నైపుణ్యం, మానసిక చురుకుదనం వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని వీరి ఎంపిక జరిగింది.ఉదాహరణకు, ఒక నిమిషంలో వీరు ఎదురుగా వస్తున్న కారు, దానిలోని వ్యక్తుల సంఖ్య మరియు పరిసరాలలోని ప్రతిదానిని గుర్తించాల్సి ఉంది.
This post was last modified on December 12, 2022 3:02 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…