తొమ్మిది మంది అమ్మాయిలు సఫారీ సూట్లు ధరించి తమ X-95 సబ్-మెషిన్ గన్లు, AK-47లు, 9 mm పిస్టల్లను చేతబట్టుకుని కాన్వాయ్ లో వచ్చి తనిఖీలు చేస్తారు. వారు క్షుణ్ణంగా ప్రతీ అంగుళం పరిశీలించిన తరువాతే సీఎం బయటకు వస్తాడు. ఇదంతా యాక్షన్ సినిమాలోని సన్నివేశం కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కి చెందిన ప్రధాన భద్రతా బృందానికి చెందిన సిబ్బంది.
సబ్-ఇన్స్పెక్టర్ ఎం థనుష్ కన్నకి, హెడ్ కానిస్టేబుల్ ఎం ధిల్షాత్ బేగం, కానిస్టేబుల్స్ ఆర్ విద్య, జె సుమతి వీరిలో ప్రధానం కాగా… ఎం కాళీశ్వరి, కె పవిత్ర, జి రామి, వి మోనిషా, కె కౌసల్య కూడా ఈ దళంలో భాగం. ఈ ఏడాది (మార్చి 8) మహిళా దినోత్సవం నాడు ఈ మహిళలు సిఎం కోర్ సెక్యూరిటీ డిటెయిల్లో చేరారు. వారి మొదటి డ్యూటీ అన్నా అరివాలయం (DMK ప్రధాన కార్యాలయం) వద్ద నిర్వర్తించారు.
80 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారుల నుండి షార్ట్లిస్ట్ చేయబడిన మహిళలు ఎంపిక చేయబడటానికి ముందు కఠినమైన శారీరక మరియు మానసిక పరీక్షల్లో పాల్గొన్నారు. పరిశీలన నైపుణ్యం, మానసిక చురుకుదనం వంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని వీరి ఎంపిక జరిగింది.ఉదాహరణకు, ఒక నిమిషంలో వీరు ఎదురుగా వస్తున్న కారు, దానిలోని వ్యక్తుల సంఖ్య మరియు పరిసరాలలోని ప్రతిదానిని గుర్తించాల్సి ఉంది.
This post was last modified on December 12, 2022 3:02 pm
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…